టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ గత ఏడాది 2023, జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయాత్ర.. రాష్ట్రంలో దుమ్మురేపింది. ఎక్కడో చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ప్రారంభించిన ఈ యాత్ర.. అనేక ఇబ్బందులు.. అనేకానేక విరామాల అనంతరం.. విశాఖపట్నంలో ముగిసింది. మధ్య మధ్య అనేక వివాదాలు కూడా తలెత్తాయి. మొత్తానికి యాత్రను ముగించారు. అయితే.. దీనివెనుక మూడు లక్ష్యాలు ఉన్నాయి. మరి ఇవి ఏమేరకు సక్సెస్ అయ్యాయి అనేది ఈ ఎన్నికలు తేల్చనున్నాయి.
1) రాష్ట్రనేతగా గుర్తింపు: నారా లోకేష్ ను రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందేలా చేయాలనేది ఈ పాదయాత్ర వెనుక ఉన్న అంతర్వ్యూహం. ఎందుకంటే.. ఇప్పుడు కాకపోతే.. మరో ఐదేళ్లలో అయినా.. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టాల్సి ఉంది. పార్టీని నడిపించాల్సి ఉంటుంది. దీంతో ఆయనను రాష్ట్ర స్థాయి నాయకుడిగా చేయాలంటే.. ప్రజల ఆశీర్వాదం ముఖ్యం. ఈ నేపథ్యంలోనే పాదయాత్రను ప్రారంభించారు. మరి ఆయనను ప్రజలు రాష్ట్రనేతగా గుర్తించారా? అనేది ప్రశ్న.
2) వైసీపీకి చెక్: పాదయాత్ర ద్వారా.. వైసీపీకి చెక్ పెట్టాలనేది మరో ముఖ్య వ్యూహం. సీమ ప్రాంతంలోనే పాదయాత్ర ఎక్కువగా సాగింది. టీడీపీకి పట్టున్న ఉత్తరాంధ్రలో లైట్ అయిపోయింది. కానీ, వైసీపీకి బలమైన నియోజకవర్గాలుగా ఉన్న చోట మాత్రం ఎక్కడా పాదయాత్ర వెనుకడుగు వేయకుండా.. ప్రతి మండలాన్నీ చుట్టి వచ్చింది. అంటే.. ఆయా స్థానాల్లో వైసీపీ బలాన్ని తగ్గించాలనేది యువగళం వ్యూహం. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అయింది. వైసీపీ ఓటు బ్యాంకు ను తగ్గిస్తుందా.. సీట్లను తగ్గిస్తుందా? అనేది చర్చ.
3) పార్టీ నేతలపై పట్టు: యువగళం పాదయాత్ర ద్వారా.. టీడీపీపై పట్టు పెంచుకునేందుకు.. సీనియర్లు, జూనియర్ నేతలపైనా పట్టు పెంచుకునేందుకు నారా లోకేష్ ప్రయత్నించారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? అనే విషయాన్ని ఆయన తెలుసుకునేందుకు ఈ యువగళం పాదయాత్ర ద్వారా ప్రయత్నించారు. మరి ఇవన్నీ.. ఈ ఎన్నికలు తేల్చేయనున్నాయని అంటున్నారు పరిశీలకులు. మంగళగిరిలో నారా లోకేష్ గెలిచినా.. సీమలో వైసీపీకి సీట్లు తగ్గినా… ప్రజలు ఆయనను రాష్ట్ర నేతగా గుర్తించినట్టేనని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 25, 2024 12:50 pm
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…
గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…