Political News

పిఠాపురంలో ఇలా ఎందుకు జ‌ర‌క్కూడ‌దు?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంపై ఇప్ప‌టికే వంద‌ల సంఖ్య‌లో అంచ‌నాలు వ‌చ్చాయి. ఎవ‌రి వాద‌న వారే వినిపిస్తున్నారు. ఇక్క‌డ ఎవ‌రు మాట్లాడినా.. ఎవ‌రు విశ్లేషించినా.. కాపు ఓటు బ్యాంకు గురించి చ‌ర్చిస్తున్నారు. మంచిదే. 75 వేలుగా ఉన్న కాపుల ఓట్ల‌లో 60 వేలు వ‌రకు. ప‌వ‌న్‌కు ప‌డ‌తాయ‌ని చెబుతున్నారు. ఇక‌, 68 వేలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు విష‌యానికి వ‌స్తే మాత్రం వైసీపీకి అనుకూలంగా తీర్పులు చెబుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు గుండుగుత్త‌గా వైసీపీకి ప‌డుతుంద‌ని ప‌రిశీల‌కులు.. విశ్లేష‌కులు కూడా చెబుతున్నారు. అయితే.. ఇక్క‌డే అస‌లు కీల‌క విష‌యం ఉంది. యువ‌త ఓట్ల‌న్నీ .. కులాలు, మ‌తాల‌కు అతీతంగా ప‌వ‌న్ వెంటే ఉన్నాయి. ఈ సారి ఖ‌చ్చితంగా తమ అభిమాన నాయ‌కుడిని అసెంబ్లీకి పంపించాల‌ని వారు నిర్ణ‌యించుకున్నారు. ఈ కోణంలో ఎవ‌రూ ఆలోచ‌న చేయ‌డం లేదు. ఇలా చూసుకుంటే.. అన్ని సామాజిక వ‌ర్గాల కంటే కూడా.. ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకులో 32 వేల మంది యువ‌త ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అదేవిధంగా మైనారిటీల్లోనూ యువ‌త ఉన్నారు. వీరు కూడా.. పార్టీల‌కు అతీతంగా ప‌వ‌న్‌కు జై కొడుతున్న ఓట‌ర్లు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ రెండు వ‌ర్గాలు క‌లిపితే.. 48 వేల ఓట్ల వ‌ర‌కు ఉంటాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుత అంచ‌నాల ప్ర‌కారం.. యువ‌త మొత్తం ప‌వ‌న్ వైపే ఉన్నార‌ని అనుకుంటే.. ఈ ఓటు బ్యాంకు కూడా.. జ‌న‌సేన కు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్తితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పిఠాపురంలో మాత్రం.. ఖ‌చ్చితంగా ఈ ఓటు బ్యాంకు ప‌వ‌న్ వైపే ఉంటుంద‌ని అంచ‌నా.

ఇలాచూసుకుంటే.. కాపులు+యువ‌త క‌లుపుకొంటే… 60+48 వేల‌ను కూడితే.. ల‌క్ష‌కుపైగానే ఓట్టు ఏక‌ప‌క్షం గా ప‌వ‌న్‌కు ప‌డుతున్నాయి. ఇత‌ర సామాజిక వ‌ర్గాల్లోనూ.. 50 వేల మంది ఇటువైపు మొగ్గితే.. ప‌వ‌న్ గెలుపు ఈ సారి ఏక‌ప‌క్షంగా మారినా ఆశ్చ‌ర్యంలేద‌నే టాక్ వినిపిస్తోంది. దీనిని అంచ‌నా వేసుకునే ప‌వ‌న్‌.. త‌న‌కు ల‌క్ష మెజారిటీ ఖాయ‌మ‌ని ప‌లు సంద‌ర్భాల‌లో చెప్పారు. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇలా అయితే.. వైసీపీ ఇక్క‌డ బ‌ల‌మైన పోటీ ఇచ్చే అవ‌కాశం లేద‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి.

This post was last modified on May 25, 2024 12:42 pm

Share

Recent Posts

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

24 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

3 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

4 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

4 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

6 hours ago