Political News

పిఠాపురంలో ఇలా ఎందుకు జ‌ర‌క్కూడ‌దు?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంపై ఇప్ప‌టికే వంద‌ల సంఖ్య‌లో అంచ‌నాలు వ‌చ్చాయి. ఎవ‌రి వాద‌న వారే వినిపిస్తున్నారు. ఇక్క‌డ ఎవ‌రు మాట్లాడినా.. ఎవ‌రు విశ్లేషించినా.. కాపు ఓటు బ్యాంకు గురించి చ‌ర్చిస్తున్నారు. మంచిదే. 75 వేలుగా ఉన్న కాపుల ఓట్ల‌లో 60 వేలు వ‌రకు. ప‌వ‌న్‌కు ప‌డ‌తాయ‌ని చెబుతున్నారు. ఇక‌, 68 వేలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు విష‌యానికి వ‌స్తే మాత్రం వైసీపీకి అనుకూలంగా తీర్పులు చెబుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు గుండుగుత్త‌గా వైసీపీకి ప‌డుతుంద‌ని ప‌రిశీల‌కులు.. విశ్లేష‌కులు కూడా చెబుతున్నారు. అయితే.. ఇక్క‌డే అస‌లు కీల‌క విష‌యం ఉంది. యువ‌త ఓట్ల‌న్నీ .. కులాలు, మ‌తాల‌కు అతీతంగా ప‌వ‌న్ వెంటే ఉన్నాయి. ఈ సారి ఖ‌చ్చితంగా తమ అభిమాన నాయ‌కుడిని అసెంబ్లీకి పంపించాల‌ని వారు నిర్ణ‌యించుకున్నారు. ఈ కోణంలో ఎవ‌రూ ఆలోచ‌న చేయ‌డం లేదు. ఇలా చూసుకుంటే.. అన్ని సామాజిక వ‌ర్గాల కంటే కూడా.. ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకులో 32 వేల మంది యువ‌త ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అదేవిధంగా మైనారిటీల్లోనూ యువ‌త ఉన్నారు. వీరు కూడా.. పార్టీల‌కు అతీతంగా ప‌వ‌న్‌కు జై కొడుతున్న ఓట‌ర్లు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ రెండు వ‌ర్గాలు క‌లిపితే.. 48 వేల ఓట్ల వ‌ర‌కు ఉంటాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుత అంచ‌నాల ప్ర‌కారం.. యువ‌త మొత్తం ప‌వ‌న్ వైపే ఉన్నార‌ని అనుకుంటే.. ఈ ఓటు బ్యాంకు కూడా.. జ‌న‌సేన కు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్తితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పిఠాపురంలో మాత్రం.. ఖ‌చ్చితంగా ఈ ఓటు బ్యాంకు ప‌వ‌న్ వైపే ఉంటుంద‌ని అంచ‌నా.

ఇలాచూసుకుంటే.. కాపులు+యువ‌త క‌లుపుకొంటే… 60+48 వేల‌ను కూడితే.. ల‌క్ష‌కుపైగానే ఓట్టు ఏక‌ప‌క్షం గా ప‌వ‌న్‌కు ప‌డుతున్నాయి. ఇత‌ర సామాజిక వ‌ర్గాల్లోనూ.. 50 వేల మంది ఇటువైపు మొగ్గితే.. ప‌వ‌న్ గెలుపు ఈ సారి ఏక‌ప‌క్షంగా మారినా ఆశ్చ‌ర్యంలేద‌నే టాక్ వినిపిస్తోంది. దీనిని అంచ‌నా వేసుకునే ప‌వ‌న్‌.. త‌న‌కు ల‌క్ష మెజారిటీ ఖాయ‌మ‌ని ప‌లు సంద‌ర్భాల‌లో చెప్పారు. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇలా అయితే.. వైసీపీ ఇక్క‌డ బ‌ల‌మైన పోటీ ఇచ్చే అవ‌కాశం లేద‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి.

Satya

Recent Posts

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

16 minutes ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

2 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

3 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

3 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

3 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

4 hours ago