Political News

వాళ్లంతా జ‌గ‌న్ మ‌నుషులు.. ప్ర‌మోష‌న్లు ఆపండి: చంద్ర‌బాబు

ఏపీలో మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న కొంద‌రు అధికారుల‌కు క‌న్ఫ‌ర్డ్ ఐఏఎస్ లు ఇవ్వాల‌ని.. ప్ర‌మోష‌న్ క‌ల్పించాల‌ని కోరుతూ.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్ రెడ్డి యూపీఎస్సీకి సిఫార్సు చేశారు. ఇది రాజ‌కీయంగా వివాదం రేపింది. దీనిపై విదేశాల్లో ఉన్న చంద్ర‌బాబు లేఖ రాశారు. నేరుగా యూపీఎస్సీ కి చంద్ర‌బాబు లేఖ సంధించారు. వాళ్లంతా జ‌గ‌న్ కార్యాల‌యం మ‌నుషుల‌ని పేర్కొన్నారు. ఇలా కొంద‌రికి మాత్ర‌మే ప్ర‌మోష‌న్ ఇవ్వ‌డం స‌రికాద‌ని చంద్ర‌బాబు తెలిపారు.

కేవలం కొంద‌రిని మాత్ర‌మే ఎంపిక చేసి.. ఇలా ప్ర‌మోష‌న్ ఇవ్వ‌డం రాజ‌కీయ దురుద్దేశమ‌ని పేర్కొన్నారు. దీనిలో పార‌ద‌ర్శ‌క‌త లోపించింద‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఈ ప్ర‌మోష‌న్ల ప్ర‌క్రియ‌ను నిలువ‌రించాల‌ని కోరారు. అదేస‌మ‌యంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోడ్ ఉన్న నేప‌థ్యంలో అస‌లు ఇలా ప్ర‌మోష‌న్‌లు ఇవ్వాల‌ని సిఫార‌సు చేయ‌డం కూడా.. నిబంధ‌న‌లకు విరుద్ధ‌మ‌ని తెలిపారు. త‌క్ష‌ణం ఈ ప్ర‌క్రియ‌ల‌ను నిలుపుదల చేయాల‌ని చంద్ర‌బాబు కోరారు. అంతేకాదు.. ఇలా సిఫార‌సు చేసిన జ‌వ‌హ‌ర్‌రెడ్డి పై చ‌ర్య‌లు తీసుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

జూన్ 4న రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌ని.. అప్ప‌టి వ‌ర‌కు ఈ ప్ర‌క్రియ‌ను నిలుపుద‌ల చేయాల‌ని కూడా చంద్ర‌బాబు త‌న లేఖ లో కోరారు. కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. దీనిపై నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలిపారు. అప్పటి వ‌రకు.. ఈ ప్ర‌క్రియ‌ను నిలుపుద‌ల చేయాల‌ని సూచించారు. పార‌ద‌ర్శ‌క‌త లోపించ‌డం.. అయిన వారికి ప్ర‌మోష‌న్లు ఇవ్వ‌డం వంటివి నిస్సందేహంగా ఖండించాల్సిన అంశాల‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ విష‌యంలో త‌క్ష‌ణం స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. కాగా.. ప‌లువురు అధికారుల‌ను ఐఏఎస్‌లుగా ప్ర‌మోష‌న్ చేయాల‌ని కోరుతూ.. జ‌వ‌హ‌ర్‌రెడ్డి రెండు రోజుల కింద‌ట అత్యంత ర‌హ‌స్యంగా యూపీఎస్సీకి లేఖ రాశారు.

This post was last modified on May 24, 2024 10:22 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

47 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago