ఏపీలో మరో వివాదం తెరమీదికి వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు అధికారులకు కన్ఫర్డ్ ఐఏఎస్ లు ఇవ్వాలని.. ప్రమోషన్ కల్పించాలని కోరుతూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి యూపీఎస్సీకి సిఫార్సు చేశారు. ఇది రాజకీయంగా వివాదం రేపింది. దీనిపై విదేశాల్లో ఉన్న చంద్రబాబు లేఖ రాశారు. నేరుగా యూపీఎస్సీ కి చంద్రబాబు లేఖ సంధించారు. వాళ్లంతా జగన్ కార్యాలయం మనుషులని పేర్కొన్నారు. ఇలా కొందరికి మాత్రమే ప్రమోషన్ ఇవ్వడం సరికాదని చంద్రబాబు తెలిపారు.
కేవలం కొందరిని మాత్రమే ఎంపిక చేసి.. ఇలా ప్రమోషన్ ఇవ్వడం రాజకీయ దురుద్దేశమని పేర్కొన్నారు. దీనిలో పారదర్శకత లోపించిందని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రమోషన్ల ప్రక్రియను నిలువరించాలని కోరారు. అదేసమయంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అసలు ఇలా ప్రమోషన్లు ఇవ్వాలని సిఫారసు చేయడం కూడా.. నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. తక్షణం ఈ ప్రక్రియలను నిలుపుదల చేయాలని చంద్రబాబు కోరారు. అంతేకాదు.. ఇలా సిఫారసు చేసిన జవహర్రెడ్డి పై చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జూన్ 4న రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని.. అప్పటి వరకు ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలని కూడా చంద్రబాబు తన లేఖ లో కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అప్పటి వరకు.. ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలని సూచించారు. పారదర్శకత లోపించడం.. అయిన వారికి ప్రమోషన్లు ఇవ్వడం వంటివి నిస్సందేహంగా ఖండించాల్సిన అంశాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషయంలో తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా.. పలువురు అధికారులను ఐఏఎస్లుగా ప్రమోషన్ చేయాలని కోరుతూ.. జవహర్రెడ్డి రెండు రోజుల కిందట అత్యంత రహస్యంగా యూపీఎస్సీకి లేఖ రాశారు.
This post was last modified on May 24, 2024 10:22 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…