Political News

పవన్ ఓడిన రెండు సీట్లూ పవనే గెలిపిస్తున్నాడా?

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు షాక్ త‌ప్ప‌లేదు. ఆయ‌న భీమ‌వ‌రం, గాజువాక‌లో పోటీ చేయ‌గా రెండు చోట్లా ఓట‌మి పాల‌య్యారు. కానీ ఈ సారి ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి జెండా ఎగ‌ర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పవన్ తో పాటు ఆయన అభిమానులు ఈ రెండు సీట్లపై పట్టుదలతో ఉన్నారు. ఈ సారి ఇక్క‌డ వైసీపీ క‌థ ముగిసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు పిఠాపురం నుంచి పోటీ చేసిన ప‌వ‌న్ క‌చ్చితంగా గెలుస్తార‌నే టాక్ ఉంది.

2019 ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ వేర్వేరుగా పోటీ చేశాయి. దీంతో భీమ‌వ‌రం, గాజువాక‌లో ఓట్లు చీలిపోయి వైసీపీకి ఫ‌లితాలు క‌లిసొచ్చాయ‌నే అభిప్రాయం ఉంది. ఈ సారి ఈ మూడు పార్టీలు కూట‌మిగా బ‌రిలో దిగ‌డంతో ఓట్లు చీలే అవ‌కాశం లేదు. గాజువాక‌లో వైసీపీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ బ‌రిలో దిగారు. కూట‌మి అభ్య‌ర్థిగా టీడీపీ నుంచి ప‌ల్లా శ్రీనివాస‌రావు పోటీ చేశారు. ఇక్క‌డ ఈ ఇద్ద‌రి లీడ‌ర్ల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డిచింది. అయినా ఇక్క‌డ ప‌ల్లా గెలుపు ఖాయ‌మైంద‌నే అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి.

ఇక భీమ‌వ‌రంలోనూ కూట‌మికే జ‌నాలు జై కొట్టార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ప‌వ‌న్‌పై వైసీపీ అభ్య‌ర్థి గ్రంథి శ్రీనివాస్ దాదాపు ఎనిమిది వేల మెజారిటీతో గెలిచారు. ఈ సారి కూడా ఆయ‌న పోటీలో ఉన్నారు. కూట‌మి నుంచి జ‌న‌సేన త‌ర‌పున పుల‌వ‌ర్తి ఆంజ‌నేయులు స‌మ‌రానికి సై అన్నారు. టీడీపీ నుంచి జ‌న‌సేన‌లోకి మారి ఆయ‌న పోటీలో నిల‌బ‌డ్డారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన పుల‌వ‌ర్తికి 55 వేల ఓట్లు వ‌చ్చాయి. ఈ సారి కూట‌మి ఉండ‌టంతో ఆయ‌న గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌నే అంటున్నారు.

This post was last modified on May 24, 2024 3:18 pm

Share
Show comments

Recent Posts

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

13 minutes ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

42 minutes ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

2 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

2 hours ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

3 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

4 hours ago