Political News

పవన్ ఓడిన రెండు సీట్లూ పవనే గెలిపిస్తున్నాడా?

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు షాక్ త‌ప్ప‌లేదు. ఆయ‌న భీమ‌వ‌రం, గాజువాక‌లో పోటీ చేయ‌గా రెండు చోట్లా ఓట‌మి పాల‌య్యారు. కానీ ఈ సారి ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి జెండా ఎగ‌ర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పవన్ తో పాటు ఆయన అభిమానులు ఈ రెండు సీట్లపై పట్టుదలతో ఉన్నారు. ఈ సారి ఇక్క‌డ వైసీపీ క‌థ ముగిసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు పిఠాపురం నుంచి పోటీ చేసిన ప‌వ‌న్ క‌చ్చితంగా గెలుస్తార‌నే టాక్ ఉంది.

2019 ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ వేర్వేరుగా పోటీ చేశాయి. దీంతో భీమ‌వ‌రం, గాజువాక‌లో ఓట్లు చీలిపోయి వైసీపీకి ఫ‌లితాలు క‌లిసొచ్చాయ‌నే అభిప్రాయం ఉంది. ఈ సారి ఈ మూడు పార్టీలు కూట‌మిగా బ‌రిలో దిగ‌డంతో ఓట్లు చీలే అవ‌కాశం లేదు. గాజువాక‌లో వైసీపీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ బ‌రిలో దిగారు. కూట‌మి అభ్య‌ర్థిగా టీడీపీ నుంచి ప‌ల్లా శ్రీనివాస‌రావు పోటీ చేశారు. ఇక్క‌డ ఈ ఇద్ద‌రి లీడ‌ర్ల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డిచింది. అయినా ఇక్క‌డ ప‌ల్లా గెలుపు ఖాయ‌మైంద‌నే అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి.

ఇక భీమ‌వ‌రంలోనూ కూట‌మికే జ‌నాలు జై కొట్టార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ప‌వ‌న్‌పై వైసీపీ అభ్య‌ర్థి గ్రంథి శ్రీనివాస్ దాదాపు ఎనిమిది వేల మెజారిటీతో గెలిచారు. ఈ సారి కూడా ఆయ‌న పోటీలో ఉన్నారు. కూట‌మి నుంచి జ‌న‌సేన త‌ర‌పున పుల‌వ‌ర్తి ఆంజ‌నేయులు స‌మ‌రానికి సై అన్నారు. టీడీపీ నుంచి జ‌న‌సేన‌లోకి మారి ఆయ‌న పోటీలో నిల‌బ‌డ్డారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన పుల‌వ‌ర్తికి 55 వేల ఓట్లు వ‌చ్చాయి. ఈ సారి కూట‌మి ఉండ‌టంతో ఆయ‌న గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌నే అంటున్నారు.

This post was last modified on May 24, 2024 3:18 pm

Share
Show comments

Recent Posts

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

3 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

10 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

10 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

11 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

12 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

13 hours ago