2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు షాక్ తప్పలేదు. ఆయన భీమవరం, గాజువాకలో పోటీ చేయగా రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. కానీ ఈ సారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో కూటమి జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ తో పాటు ఆయన అభిమానులు ఈ రెండు సీట్లపై పట్టుదలతో ఉన్నారు. ఈ సారి ఇక్కడ వైసీపీ కథ ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కచ్చితంగా గెలుస్తారనే టాక్ ఉంది.
2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేశాయి. దీంతో భీమవరం, గాజువాకలో ఓట్లు చీలిపోయి వైసీపీకి ఫలితాలు కలిసొచ్చాయనే అభిప్రాయం ఉంది. ఈ సారి ఈ మూడు పార్టీలు కూటమిగా బరిలో దిగడంతో ఓట్లు చీలే అవకాశం లేదు. గాజువాకలో వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బరిలో దిగారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. ఇక్కడ ఈ ఇద్దరి లీడర్ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. అయినా ఇక్కడ పల్లా గెలుపు ఖాయమైందనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఇక భీమవరంలోనూ కూటమికే జనాలు జై కొట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ పవన్పై వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ దాదాపు ఎనిమిది వేల మెజారిటీతో గెలిచారు. ఈ సారి కూడా ఆయన పోటీలో ఉన్నారు. కూటమి నుంచి జనసేన తరపున పులవర్తి ఆంజనేయులు సమరానికి సై అన్నారు. టీడీపీ నుంచి జనసేనలోకి మారి ఆయన పోటీలో నిలబడ్డారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన పులవర్తికి 55 వేల ఓట్లు వచ్చాయి. ఈ సారి కూటమి ఉండటంతో ఆయన గెలుపును ఎవరూ ఆపలేరనే అంటున్నారు.
This post was last modified on May 24, 2024 3:18 pm
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…