2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు షాక్ తప్పలేదు. ఆయన భీమవరం, గాజువాకలో పోటీ చేయగా రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. కానీ ఈ సారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో కూటమి జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ తో పాటు ఆయన అభిమానులు ఈ రెండు సీట్లపై పట్టుదలతో ఉన్నారు. ఈ సారి ఇక్కడ వైసీపీ కథ ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కచ్చితంగా గెలుస్తారనే టాక్ ఉంది.
2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేశాయి. దీంతో భీమవరం, గాజువాకలో ఓట్లు చీలిపోయి వైసీపీకి ఫలితాలు కలిసొచ్చాయనే అభిప్రాయం ఉంది. ఈ సారి ఈ మూడు పార్టీలు కూటమిగా బరిలో దిగడంతో ఓట్లు చీలే అవకాశం లేదు. గాజువాకలో వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బరిలో దిగారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. ఇక్కడ ఈ ఇద్దరి లీడర్ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. అయినా ఇక్కడ పల్లా గెలుపు ఖాయమైందనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఇక భీమవరంలోనూ కూటమికే జనాలు జై కొట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ పవన్పై వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ దాదాపు ఎనిమిది వేల మెజారిటీతో గెలిచారు. ఈ సారి కూడా ఆయన పోటీలో ఉన్నారు. కూటమి నుంచి జనసేన తరపున పులవర్తి ఆంజనేయులు సమరానికి సై అన్నారు. టీడీపీ నుంచి జనసేనలోకి మారి ఆయన పోటీలో నిలబడ్డారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన పులవర్తికి 55 వేల ఓట్లు వచ్చాయి. ఈ సారి కూటమి ఉండటంతో ఆయన గెలుపును ఎవరూ ఆపలేరనే అంటున్నారు.
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…