తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారా లోకేష్కు ఇవ్వాలంటూ.. స్వరాలు ప్రారంభమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసి.. మరో పదిరోజుల్లో ఫలితం రానున్న నేపథ్యంలో వ్యూహాత్మకమో.. అనూహ్యమో తెలియదు కానీ.. ఇప్పుడు టీడీపీ జాతీయ పగ్గాలను.. నారా లోకేష్కు ఇప్పగించాలన్న డిమాండ్లు.. స్వరాలు తెర మీదికి వస్తున్నాయి. కొన్ని రోజుల కిందట.. బండారు.. కూడా ఇలానే వ్యాఖ్యానించారు. నారా లోకేష్ను జాతీయ అధ్యక్షుడిగా చూడాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఇక, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి వారు కూడా.. ఎ న్నికల ప్రచార సమయంలో ఇదే మాట చెప్పుకొచ్చారు. చం ద్రబాబును ఉన్నత పదవిలో చూడాలని ఉందని.. నారా లోకేష్కు పార్టీ పగ్గాలు ఇస్తే.. తాము చూడాలని.. ఆయన వెంట నడవాలని కోరుకుంటున్నట్టు నారా లోకేష్ సమక్షంలోనే వ్యాఖ్యానించారు. ఇటు.. కింజరాపు కుటుంబం.. కళా కుటుంబాలు కూడా. నారా లోకేష్ కోసం చూస్తున్నాయి. అయితే.. ఇతర నేతలు మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంలో బయట పడలేదు. ఎవరూ సంచలన వ్యాఖ్యలు కూడా చేయలేదు.
కానీ, ఇప్పుడు విజయవాడకు చెందిన కీలక నాయకుడు బుద్ధా వెంకన్న మాత్రం.. నారా లోకేష్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చూడాలని.. దేశం నేతలు కోరుకుంటున్నారని.. ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు. జూన్ 4న కూటమి గెలుస్తుదని.. జూన్ 9న చంద్రబాబు అమరావతిలో ఏపీముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారని.. అదే రోజు నారా లోకేష్కు పగ్గాలు అప్పగించాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. పార్టీ నాయకుడుగా తాను కూడా అదే కోరుకుంటున్నట్టు చెప్పారు.
వాస్తవానికి నాయకుల మాట ఎలా ఉన్నా.. చంద్రబాబు కూడా.. పార్టీ పగ్గాలు నారా లోకేష్కు అప్పగించాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి గత ఏడాది నిర్వహించిన మహానాడులోనే అంతర్గతంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత.. దీనిపై క్లారిటీకి కూడా వచ్చారు. అయితే.. ఇక్కడ పార్టీని అధికారంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. ఇది కనుక సక్సెస్ అయితే.. టీడీపీ పగ్గాలు.. వచ్చే రెండుమూడేళ్లలో అయినా.. నారా లోకేష్కు ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
This post was last modified on May 24, 2024 3:14 pm
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…
గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…