Political News

వీళ్లు గెలిస్తే మ‌ళ్లీ ఎన్నిక‌లు

తెలంగాణ‌లో గ‌తేడాది చివ‌ర్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇటీవ‌ల లోక్‌స‌భ ఎన్నిక‌లూ ముగిశాయి. త్వ‌ర‌లో స‌ర్పంచ్ త‌దిత‌ర స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఇవే కాకుండా త్వ‌ర‌లోనే మ‌రోసారి ఎమ్మెల్యే ఎన్నిక‌లూ జ‌రిగే అవ‌కాశం ఉంది. అవును.. ఈ సారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కొంత‌మంది ఎమ్మెల్యేలూ పోటీ చేశారు. వీళ్లు ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తే అప్పుడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయా స్థానాల్లో ఎమ్మెల్యేల‌ను ఎన్నుకునేందుకు ఉప ఎన్నిక అనివార్య‌మ‌వుతోంది.

సికింద్రాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి ట‌ఫ్ ఫైట్ న‌డిచింది. బీజేపీ త‌ర‌పున కిష‌న్ రెడ్డి పోటీ చేయ‌గా.. కాంగ్రెస్ నుంచి దానం నాగేంద‌ర్‌, బీఆర్ఎస్ నుంచి ప‌ద్మారావు గౌడ్ బ‌రిలో దిగారు. దానం నాగేంద‌ర్‌, ప‌ద్మారావు గౌడ్ ఇద్ద‌రూ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఖైర‌తాబాద్ నుంచి నాగేంద‌ర్‌, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప‌ద్మారావు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. వీళ్లిద్ద‌రిలో ఎవ‌రు ఎంపీగా గెలిచినా ఆయా శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక త‌ప్ప‌దు.

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీగా పోటీ చేసిన ఎమ్మెల్యేలు గెలిచి లోక్‌స‌భ వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంటే అప్పుడు శాస‌న‌స‌భ‌కు రాజీనామా చేయాలి. దీంతో ఆరు నెల‌ల్లోపు ఆ శాస‌న‌భ స్థానానికి ఉప ఎన్నిక నిర్వ‌హించాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ సిటింగ్ ఎంపీగా ఉన్న కిష‌న్‌రెడ్డి విజ‌యంపై ధీమాతో ఉన్నారు. పైగా బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు కూడా కావ‌డంతో ఆయ‌న‌కు ఈ గెలుపు అత్య‌వ‌స‌రం. మ‌రోవైపు తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండ‌టంతో క‌చ్చితంగా విజ‌యం త‌న‌దేన‌ని నాగేంద‌ర్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

This post was last modified on May 24, 2024 3:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

13 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago