Political News

వీళ్లు గెలిస్తే మ‌ళ్లీ ఎన్నిక‌లు

తెలంగాణ‌లో గ‌తేడాది చివ‌ర్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇటీవ‌ల లోక్‌స‌భ ఎన్నిక‌లూ ముగిశాయి. త్వ‌ర‌లో స‌ర్పంచ్ త‌దిత‌ర స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఇవే కాకుండా త్వ‌ర‌లోనే మ‌రోసారి ఎమ్మెల్యే ఎన్నిక‌లూ జ‌రిగే అవ‌కాశం ఉంది. అవును.. ఈ సారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కొంత‌మంది ఎమ్మెల్యేలూ పోటీ చేశారు. వీళ్లు ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తే అప్పుడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయా స్థానాల్లో ఎమ్మెల్యేల‌ను ఎన్నుకునేందుకు ఉప ఎన్నిక అనివార్య‌మ‌వుతోంది.

సికింద్రాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి ట‌ఫ్ ఫైట్ న‌డిచింది. బీజేపీ త‌ర‌పున కిష‌న్ రెడ్డి పోటీ చేయ‌గా.. కాంగ్రెస్ నుంచి దానం నాగేంద‌ర్‌, బీఆర్ఎస్ నుంచి ప‌ద్మారావు గౌడ్ బ‌రిలో దిగారు. దానం నాగేంద‌ర్‌, ప‌ద్మారావు గౌడ్ ఇద్ద‌రూ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఖైర‌తాబాద్ నుంచి నాగేంద‌ర్‌, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప‌ద్మారావు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. వీళ్లిద్ద‌రిలో ఎవ‌రు ఎంపీగా గెలిచినా ఆయా శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక త‌ప్ప‌దు.

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీగా పోటీ చేసిన ఎమ్మెల్యేలు గెలిచి లోక్‌స‌భ వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంటే అప్పుడు శాస‌న‌స‌భ‌కు రాజీనామా చేయాలి. దీంతో ఆరు నెల‌ల్లోపు ఆ శాస‌న‌భ స్థానానికి ఉప ఎన్నిక నిర్వ‌హించాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ సిటింగ్ ఎంపీగా ఉన్న కిష‌న్‌రెడ్డి విజ‌యంపై ధీమాతో ఉన్నారు. పైగా బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు కూడా కావ‌డంతో ఆయ‌న‌కు ఈ గెలుపు అత్య‌వ‌స‌రం. మ‌రోవైపు తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండ‌టంతో క‌చ్చితంగా విజ‌యం త‌న‌దేన‌ని నాగేంద‌ర్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

This post was last modified on May 24, 2024 3:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

17 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago