టీడీపీ అధినేత చంద్రబాబు కనుక తన ఆత్మకథను పుస్తకం రూపంలో తీసుకువస్తే.. దానిలో తనకు ఒక పేజీని ఖచ్చితంగా కేటాయిస్తారని.. పార్టీసీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆత్మకథను పుస్తకం రూపంలో తీసుకురావా లని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. చంద్రబాబుకు తాను పెద్దకొడుకు వంటి వాడినని చెప్పారు పార్టీ కోసంచంద్రబాబు రాష్ట్రంలో కష్టపడ్డారని.. తాను విజయవాడలో పార్టీకోసం పనిచేశానని అన్నారు.
పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. తాను కేసులు కూడా పెట్టుకుని పార్టీ కోసం పనిచేసినట్టు బుద్దా వెంకన్న అన్నారు. అందుకే చంద్రబాబు ఆత్మకథ పుస్తకంలో తనకంటూ.. ఒక పేజీని ఖచ్చితంగా ఉంచుతారని.. దానిలో తనకు-చంద్రబాబుకు మధ్య ఉన్న ఆత్మీయ సంబంధాన్ని వివరిస్తారని చెప్పారు. ఇదిలావుంటే.. చంద్రబాబు ఇప్పటి వరకు పార్టీ కోసం ఒంటి చేత్తో పోరాటం చేశారని.. కానీ, ఇప్పుడు పార్టీకి ముగ్గురు జమా జట్టీల్లాంటి నాయకులు లభించారని తెలిపారు.
నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలు ఇక నుంచి పార్టీని కాపాడుకునేందుకు ముందుకు రాను న్నట్టు చెప్పారు. ఎన్నికల సమయంలోనూ వీరు ప్రచారం చేశారని అన్నారు. వచ్చే ఫలితాలు కేవలం టెక్ని కల్ మాత్రమేనని.. కూటమికి 130 సీట్లు ఖచ్చితంగా వస్తాయని.. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదని బుద్ధా చెప్పుకొచ్చారు.
చంద్రబాబు ఇచ్చిన హామీలు.. ఉచిత రవాణా.. గ్యాస్ బండలు వంటివాటికి మహిళలు ముగ్ధులయ్యారని.. అందుకే అర్ధరాత్రి వరకు కూడా క్యూ కట్టిమరీ పోలింగ్ బూత్లలో కూటమికి ఓటేశారని ఆయన వివరించారు. వైసీపీ అరాచకాలు ఇకపై సాగబోనివ్వమని.. వైసీపీలో ఉన్న రౌడీలు రాష్ట్రం వదలి పారిపోవాలని.. ఆయన హెచ్చరించారు. జూన్ 4 తర్వాత.. వేటాడతామని చెప్పారు.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…