టీడీపీ అధినేత చంద్రబాబు కనుక తన ఆత్మకథను పుస్తకం రూపంలో తీసుకువస్తే.. దానిలో తనకు ఒక పేజీని ఖచ్చితంగా కేటాయిస్తారని.. పార్టీసీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆత్మకథను పుస్తకం రూపంలో తీసుకురావా లని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. చంద్రబాబుకు తాను పెద్దకొడుకు వంటి వాడినని చెప్పారు పార్టీ కోసంచంద్రబాబు రాష్ట్రంలో కష్టపడ్డారని.. తాను విజయవాడలో పార్టీకోసం పనిచేశానని అన్నారు.
పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. తాను కేసులు కూడా పెట్టుకుని పార్టీ కోసం పనిచేసినట్టు బుద్దా వెంకన్న అన్నారు. అందుకే చంద్రబాబు ఆత్మకథ పుస్తకంలో తనకంటూ.. ఒక పేజీని ఖచ్చితంగా ఉంచుతారని.. దానిలో తనకు-చంద్రబాబుకు మధ్య ఉన్న ఆత్మీయ సంబంధాన్ని వివరిస్తారని చెప్పారు. ఇదిలావుంటే.. చంద్రబాబు ఇప్పటి వరకు పార్టీ కోసం ఒంటి చేత్తో పోరాటం చేశారని.. కానీ, ఇప్పుడు పార్టీకి ముగ్గురు జమా జట్టీల్లాంటి నాయకులు లభించారని తెలిపారు.
నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలు ఇక నుంచి పార్టీని కాపాడుకునేందుకు ముందుకు రాను న్నట్టు చెప్పారు. ఎన్నికల సమయంలోనూ వీరు ప్రచారం చేశారని అన్నారు. వచ్చే ఫలితాలు కేవలం టెక్ని కల్ మాత్రమేనని.. కూటమికి 130 సీట్లు ఖచ్చితంగా వస్తాయని.. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదని బుద్ధా చెప్పుకొచ్చారు.
చంద్రబాబు ఇచ్చిన హామీలు.. ఉచిత రవాణా.. గ్యాస్ బండలు వంటివాటికి మహిళలు ముగ్ధులయ్యారని.. అందుకే అర్ధరాత్రి వరకు కూడా క్యూ కట్టిమరీ పోలింగ్ బూత్లలో కూటమికి ఓటేశారని ఆయన వివరించారు. వైసీపీ అరాచకాలు ఇకపై సాగబోనివ్వమని.. వైసీపీలో ఉన్న రౌడీలు రాష్ట్రం వదలి పారిపోవాలని.. ఆయన హెచ్చరించారు. జూన్ 4 తర్వాత.. వేటాడతామని చెప్పారు.
This post was last modified on May 24, 2024 12:27 pm
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…