Political News

‘చంద్ర‌బాబు ఆత్మ‌క‌థ‌లో నాకు ఒక పేజీ ఖాయం’

టీడీపీ అధినేత చంద్రబాబు క‌నుక త‌న ఆత్మ‌క‌థ‌ను పుస్త‌కం రూపంలో తీసుకువ‌స్తే.. దానిలో త‌న‌కు ఒక పేజీని ఖ‌చ్చితంగా కేటాయిస్తార‌ని.. పార్టీసీనియ‌ర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు ఆత్మ‌కథ‌ను పుస్తకం రూపంలో తీసుకురావా లని తాను కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. చంద్ర‌బాబుకు తాను పెద్ద‌కొడుకు వంటి వాడిన‌ని చెప్పారు పార్టీ కోసంచంద్ర‌బాబు రాష్ట్రంలో క‌ష్ట‌ప‌డ్డార‌ని.. తాను విజ‌య‌వాడ‌లో పార్టీకోసం ప‌నిచేశాన‌ని అన్నారు.

పార్టీ క‌ష్ట కాలంలో ఉన్న‌ప్పుడు.. తాను కేసులు కూడా పెట్టుకుని పార్టీ కోసం ప‌నిచేసిన‌ట్టు బుద్దా వెంక‌న్న అన్నారు. అందుకే చంద్ర‌బాబు ఆత్మ‌క‌థ పుస్త‌కంలో త‌న‌కంటూ.. ఒక పేజీని ఖ‌చ్చితంగా ఉంచుతార‌ని.. దానిలో త‌న‌కు-చంద్ర‌బాబుకు మ‌ధ్య ఉన్న ఆత్మీయ సంబంధాన్ని వివ‌రిస్తార‌ని చెప్పారు. ఇదిలావుంటే.. చంద్రబాబు ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ కోసం ఒంటి చేత్తో పోరాటం చేశార‌ని.. కానీ, ఇప్పుడు పార్టీకి ముగ్గురు జ‌మా జ‌ట్టీల్లాంటి నాయ‌కులు ల‌భించార‌ని తెలిపారు.

నారా భువ‌నేశ్వ‌రి, నారా లోకేష్‌, నారా బ్రాహ్మ‌ణిలు ఇక నుంచి పార్టీని కాపాడుకునేందుకు ముందుకు రాను న్న‌ట్టు చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ వీరు ప్ర‌చారం చేశార‌ని అన్నారు. వ‌చ్చే ఫ‌లితాలు కేవ‌లం టెక్ని క‌ల్ మాత్ర‌మేన‌ని.. కూట‌మికి 130 సీట్లు ఖ‌చ్చితంగా వ‌స్తాయ‌ని.. వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కే అవ‌కాశం లేద‌ని బుద్ధా చెప్పుకొచ్చారు.

చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు.. ఉచిత ర‌వాణా.. గ్యాస్ బండ‌లు వంటివాటికి మ‌హిళ‌లు ముగ్ధుల‌య్యార‌ని.. అందుకే అర్ధ‌రాత్రి వ‌ర‌కు కూడా క్యూ క‌ట్టిమ‌రీ పోలింగ్ బూత్‌ల‌లో కూట‌మికి ఓటేశార‌ని ఆయ‌న వివ‌రించారు. వైసీపీ అరాచ‌కాలు ఇక‌పై సాగ‌బోనివ్వ‌మ‌ని.. వైసీపీలో ఉన్న రౌడీలు రాష్ట్రం వ‌ద‌లి పారిపోవాల‌ని.. ఆయ‌న హెచ్చ‌రించారు. జూన్ 4 త‌ర్వాత‌.. వేటాడ‌తామ‌ని చెప్పారు.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

2 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

3 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

3 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

3 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

4 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

6 hours ago