2019 లోక్సభ ఎన్నికల్లో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచి, ఆ తర్వాత రెబెల్గా మారిన రఘురామ కృష్ణంరాజు జగన్ను విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు టీడీపీలోకి చేరి ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన విజయం ఖాయమనే అభిప్రాయాలున్నాయి. దీంతో కూటమి అధికారంలోకి రాగానే రఘురామ జగన్కు మరింత డేంజర్గా మారే అవకాశాలున్నాయి. రఘురామ హోం మినిస్టర్ అవుతారని లేదా స్పీకర్ పదవిని చేపడతారనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ రెండింట్లో ఏ పదవి చేపట్టినా అది వైసీపీకి, జగన్కు ప్రమాదకరంగా మారే ఆస్కారముందనే చెప్పాలి.
జగన్పై పీకల్లోతు కోపంలో ఉన్న రఘురామ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. వైసీపీ రెబల్గా రఘురామ మారడంతో వైసీపీ నాయకులు, జగన్ ఆయనపై ప్రతీకారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎంపీగా సస్పెన్షన్ విధించేలా చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ను ఎన్నోసార్లు కోరారు. మరోవైపు రాష్ట్రంలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తన అవకాశం కోసం ఇప్పుడు రఘురామ వెయిట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమవడంతో రఘురామ తన వాయిస్ను మరింత పెంచారు. మే 13న పోలింగ్ రోజున వైసీపీకి జనాలు సమాధి కట్టారని జూన్ 4న ఫలితాలు వెలువడే రోజున పెద్ద కర్మ అంటూ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పని అయిపోయిందని పేర్కొన్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక రఘురామకే హోం మంత్రి పదవి ఇస్తారని ఆయన అభిమానులు, అనుచరులు ముందే సంబరాల్లో మునిగిపోతున్నారు. మరోవైపు స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారమూ ఊపందుకుంది. మరి బాబు మనసులో ఏముందో చూడాలి.
This post was last modified on May 24, 2024 9:43 am
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…