ఏపీలో లోక్ సభ, శాసనసభ స్థానాలకు ఏకకాలంలో జరిగిన పోలింగ్ లో క్రాస్ ఓటింగ్ బెడద అభ్యర్థులను వణికిస్తున్నది. ఓటర్ల క్రాస్ ఫైరింగ్ కు బలయ్యే అభ్యర్థులు ఎవరు అన్న చర్చ జోరుగా నడుస్తున్నది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నంధ్యాల పార్లమెంటు స్థానాలలో ప్రధానంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తుంది.
శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడుకు, విజయనగరంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకు, విశాఖలో టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్ కు, అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కు, నంధ్యాలలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరికి ఈ క్రాస్ ఓటింగ్ కలిసి వచ్చినట్లు చెబుతున్నారు.
ఎంపీకి ఒక పార్టీకి, ఎమ్మెల్యేకు ఒకపార్టీకి ఓటు వేసి ఓటర్లు అందరికీ సమన్యాయం చేసినట్లు భావిస్తున్నారని అంటున్నారు. ఈ ఐదు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఓటర్లు భిన్నంగా వ్యవహరించారని ఈ లెక్క ప్రకారం జూన్ 4న ఫలితాలు అనూహ్యంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నంధ్యాల స్థానాల నుండి ఎంపీలుగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు బొత్స ఝాన్సీ, పేరాడ తిలక్, ముత్యాల నాయుడు, చంద్ర శేఖర్, పోచ బ్రహ్మానందరెడ్డిలు ప్రస్తుతం డైలామాలో పడినట్లు చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ విజయం ఖాయం అని అనుకుంటున్న నేపథ్యంలో ఈ క్రాస్ ఓటింగ్ అందరికి గుబులు రేపుతున్నది.
This post was last modified on May 25, 2024 1:05 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…