ఈ నెల 13న ఏపీలో జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో హింస చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వీటిలోనూ మాచర్ల నియోజకవర్గంలో మరింత హింసచోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన ఆడియోలు.. వీడియోలు కూడా బయటకు వచ్చాయి. నేరుగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నా రెడ్డి పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లోకి వెళ్లి. ఈవీఎంలను ధ్వంసం చేయడం.. అడ్డు వచ్చిన వారిని ఆయన బెదిరించడం తెలిసిందే.
అయితే.. ఇక్కడ ఒక్క చోట మాత్రమే కాదు.. నియోజవర్గంలో చాలా చోట్ల పిన్నెల్లి సోదరులు.. అరాచకాలు సృష్టించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పాల్వాయి గేటు వ్యవహారం మాత్రమే ప్రస్తుతం అందుబా టులోకి వచ్చిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో అసలు మాచర్ల ఎన్నికలను ఏకగ్రీవంగా ప్రకటించాలనే వాదన వినిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ వాదనను ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక్కడ అరాచకాలు చేసిన.. పిన్నెల్లిని పక్కన పెట్టాలని కోరారు.
ఇదే సమయంలో తనను గెలుపొందిన అభ్యర్థిగా ప్రకటించాలని కూడా బ్రహ్మారెడ్డి కోరుతున్నారు. ఇక, ఈ విషయంపై మాజీ ఐఏఎస్ అధికారులు కూడా రియాక్ట్ అయ్యారు.
ఇక్కడ ఏకగీవ్రంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు ఎందుకంటే.. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. స్వయంగా ఈవీఎంను ధ్వంసం చేయడంతోపాటు.. అధికారులను కూడా బెదిరించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ తగు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
వారు చెబుతున్న కఠిన చర్యల వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదేనని తెలుస్తోంది. ఇలా చేస్తే.. ఇకపై.. ఎక్క డా ఈవీఎంలను ధ్వంసం చేసే పరిస్థితి ఉండదన్నది అధికారులు చెబుతున్న వాదన.
ఈవీఎంలు ధ్వంసం చేసే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించి.. రెండో స్థానంలో ఉన్నవారిని ఎమ్మెల్యేలుగా ప్రకటిస్తే.. ఇక, ఇలాంటివి అడ్డుకోవచ్చని చెబుతున్నారు. అయితే.. దీనికి నిబంధనలు ఒప్పుకొంటాయా? న్యాయపరమైన చిక్కులు రావా? అనేది ప్రశ్న. ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా.. ఈ విషయంపైనే చర్చిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మరిఏం చేస్తారో చూడాలి.
This post was last modified on May 23, 2024 6:21 pm
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…