ఒకవైపు ఏపీ పోలీసులు బృందాలుగా ఏర్పడి వెతుకులాట. మరోవైపు.. ఎక్కడున్నాడో కూడా.. తెలియని మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డి. వరుగా నాలుగు రోజుల నుంచి కూడా.. పోలీసులు వివిధ ప్రాంతాల్లో వెతుకుతూనే ఉన్నారు. అయినా రామకృష్ణారెడ్డి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సంచలనం చోటు చేసుకుంది.. తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ.. పిన్నెల్లి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాదులు.. హైకోర్టును ఆశ్రయించారు.
వీరు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మరోవైపు.. పిన్నెల్లి ఆచూకీ వ్యవహారంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఎవరూ ఆయన ఎక్కడ ఉన్నదీ తెలుసుకోలక పోతున్నారు. కొందరు తెలంగాణలోనే ఉన్నారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం పొరుగు దేశానికి వెళ్లిపోయారని చెబు తున్నారు. దీంతో నాలుగు బృందాల పోలీసులు.. పిన్నెల్లి ఆచూకీ కోసం.. గాలిస్తుండడం గమనార్హం. అయితే.. ఆయన ఎక్కడ ఉన్నదీ ఎవరికీ అంతు చిక్కకపోవడం గమనార్హం.
ఈపరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా పిన్నెల్లి తరఫున న్యాయవాదులు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పోలీసులు తిరుగుతున్నారని.. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాల ని కోర్టును అభ్యర్థించారు. అయితే.. ఈ విషయాన్ని ముందుగానే ఊహించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ముందస్తు బెయిల్ ఇచ్చే ముందు.. తమవాదనలు కూడా వినిపించుకోవాలని కోరుతూ.. రాష్ట్ర పోలీసుల తోనే పిటిషన్ వేయించింది.
సో.. ఎలా చూసుకున్నా.. పిన్నెల్లి కి బెయిల్ ఇచ్చేందుకు పోలీసులు చెప్పే వాదనను ఎన్నికల సంఘం చెప్పే వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోవైపు.. పోలీసులు.. తీవ్రస్తాయిలో గాలిస్తున్నారు. ఆయనను ఏక్షణమైనా అరెస్టు చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో పిన్నెల్లి వ్యవహారం.. ఆసక్తిగా మారింది. ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 23, 2024 5:21 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…