ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు, మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలివికి పోలీసులే షాకయ్యారు. అవును.. తెలివి ఉపయోగించి పోలీసుల కళ్లు గప్పి ఆయన తప్పించుకుని పారిపోయారని చెప్పాలి.
పోలింగ్ తేదీన మాచర్లలో గొడవల కారణంగా పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడిని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. కానీ వీళ్లు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇప్పుడేమో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. పిన్నెల్లి అరెస్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన దొరకడం లేదు.
హైదరాబాద్లోని నివాసంలో పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు వెళ్లారు. కానీ ఆయన అక్కడ లేరు. ఆయన ఫోన్ సిగ్నల్స్ను ట్రేస్ చేస్తూ పోలీసులు కారును వెంబడించారు. తీరా కారు దగ్గరికి చేరుకుని చూస్తే పిన్నెల్లి గన్మెన్, డ్రైవర్ మాత్రమే అందులో ఉన్నారు.
మరి సెల్ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని పరీక్షించగా కారులో ఫోన్ దొరికిందని తెలిసింది. కారులో ఫోన్ పంపించి పిన్నెల్లి పోలీసులను బోల్తా కొట్టించారు. ఆయన మరో మార్గంలో హైదరాబాద్ నుంచి తప్పించుకున్నారని సమాచారం.
పిన్నెల్లి విదేశాలకు పారిపోకుండా ఉండేలా పోలీసులు లూకౌట్ నోటీసులు జారీచేశారు. అన్ని విమానాశ్రయాలను అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి దేశంలోని ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్లు తెలుస్తోంది.
తమిళనాడుకు వెళ్లారని లేదు కేరళకు వెళ్లారనే విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఈ మ్యాటర్ను సీరియస్గా తీసుకోవడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగిపోతోంది. వెంటనే పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన పిన్నెల్లి కొన్ని రోజుల గ్యాప్ తర్వాత వచ్చి లొంగిపోతానని అనుచరులతో చెప్పినట్లు తెలిసింది.
This post was last modified on May 23, 2024 3:42 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…