Political News

కేసీఆర్‌కు ఆహ్వానం.. మార్కులు కొట్టేసిన రేవంత్‌!

రాజ‌కీయాల్లో నాయ‌కులు ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం కామ‌నే. అధికారంలో ఉన్న పార్టీపై విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటాయి. పొద్దున లేచిన‌ప్ప‌టి నుంచి నేత‌ల‌కు ఇదే ప‌ని.

కానీ రాజ‌కీయాల‌ను రాజ‌కీయాలుగానే చూస్తూ ఇత‌ర విష‌యాల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కుల‌ను గౌర‌వించ‌డం ముఖ్యం. అలా అయితేనే పాలిటిక్స్ క్లీన్ అండ్ నీట్‌గా ఉంటాయి.

ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో సాగుతున్న‌ట్లే క‌నిపిస్తున్నారు. రాజ‌కీయాల‌ను ఓ ద‌శ వ‌ర‌కే ప‌రిమితం చేస్తూ ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల‌తో స‌త్సంబంధాలు కొన‌సాగించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ జూన్ 2తో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించి ప‌దేళ్లు పూర్త‌వుతుంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని రేవంత్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఈ వేడుక‌ల‌ను ధూంధాంగా చేయాల‌ని రేవంత్ ఇప్ప‌టికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ వేడుక‌ల‌ను ప‌రేడ్ గ్రౌండ్‌లో ఘ‌నంగా చేసేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో సోనియా గాంధీని ఘ‌నంగా స‌న్మానించ‌నున్నారు.

ఇప్పుడీ వేడుక‌ల‌కు తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌ను ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా ఆహ్వానించ‌నుంది. తెలంగాణ ఉద్య‌మంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు రేవంత్ ఇప్పుడు ప్ర‌త్యేక ఆహ్వానం పంప‌డం హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఉద్య‌మించిన కేసీఆర్‌ను ప్ర‌త్యేకంగా గౌర‌వించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్పుడు ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు, ప్ర‌త్య‌ర్థి పార్టీ అని అనుకోకుండా కేసీఆర్‌ను ఈ వేడుక‌ల‌కు రేవంత్ ఆహ్వానించ‌డం విశేషం. దీంతో రేవంత్ మార్కులు కొట్టేశార‌నే చెప్పాలి.

రాజ‌కీయాల‌ను ఓ ద‌శ వ‌ర‌కే ప‌రిమ‌తం చేసి, ఇలా ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌ను ప్ర‌త్యేకంగా చూడటంతో రేవంత్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

This post was last modified on May 23, 2024 2:33 pm

Share
Show comments
Published by
Satya
Tags: Revanth

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

27 minutes ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

1 hour ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

1 hour ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

3 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

4 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

5 hours ago