తెలంగాణ ఇచ్చామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ అగ్రనేత, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ వచ్చే నెల 2న(పోలింగ్ ఫలితానికి రెండు రోజుల ముందు) తెలంగాణకు రానున్నారు. ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించే కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు.
2013-14 మధ్య యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణ ఇచ్చినప్పటికీ.. సుదీర్ఘ పోరాటాల అనంతరం.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినప్పటికీ.. తొలి దశాబ్దం మాత్రం కాంగ్రెస్కు ఇక్కడి ప్రజలు జై కొట్టలేదు.
దాదాపు 10 ఏళ్త తర్వాత గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు జై కొట్టారు. దీంతో కాంగ్రెస్కు ఒకింత ఊపు వచ్చింది. ఒకవైపు ఉత్తరాదిని పార్టీ ఇబ్బందులు పడినప్పటికీ.. దక్షిణాదిలో తెలంగాణ ఆ పార్టీకి ఊపిరి పోసింది. ఈ నేపథ్యంలో జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆవిర్భావ దినోత్సవం రోజున సోనియాగాంధీ చేత తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతాన్ని విడుదల చేయనుంది. “జయ జయ హే తెలంగాణ” అనే గీతాన్ని ప్రముఖ కవి అందె శ్రీ రచించారు. ఈ గీతాన్ని ఫిబ్రవరి 4న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ అధికారికంగా ఆమోదించింది. ప్రస్తుత సందర్భాన్ని ప్రతిబింబించేలా గీతంలో స్వల్ప మార్పులను మంత్రి వర్గం సూచించింది. దాదాపు 1.5 నిమిషాల నిడివి గల తుది వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.
జయజయ హే తెలంగాణ.. గీతానికి సంగీతాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచారు. ఈ గీతాన్ని సోనియా గాంధీ ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా తెలంగాణ తల్లి ప్రతిమలోనూ మార్పులు చేశారు. దీనిని కూడా సోనియా చేతుల మీదే ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే.. సోనియా తన ప్రసంగంలో రాష్ట్ర ఏర్పాటు.. నాటి ఆకాంక్షలు.. ఇప్పటికీ తీరని సమస్యలను ప్రస్తావిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సోనియా రాకతో.. తెలంగాణలో కాంగ్రెస్కు మరింత ప్రాభవం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on May 22, 2024 10:35 pm
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…