ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక ఫలితాల కోసం నిరీక్షణే ముగిసింది. ఎవరికి వారు రిజల్ట్పై నమ్మకంతో ఉన్నారు. అధికార వైసీపీ మరోసారి గద్దెనెక్కుతుందా? లేదా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందా? అన్నది జూన్ 4న తేలుతుంది. ఈ లోగా నాయకులు రిలాక్స్ అవుతున్నారు. కానీ బీజేపీలోని కొంతమంది లీడర్లు మాత్రం ఎన్నికల ప్రచారంలోనూ అట్టిముట్టనట్లుగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత వీళ్ల ప్లాన్ ఏమిటన్నది కూడా సస్పెన్స్గానే ఉంది. ఆ నాయకులే సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు.
బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు అయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో సోము వీర్రాజు ఎక్కువగా కనిపించలేదు. మొదటి నుంచి టీడీపీతో పొత్తును ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేక మిన్నకుండిపోయారు. అంతే కాకుండా ఎన్నిలక నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాలను ఎంచుకున్న తీరు తదితర పరిణామాలు వీర్రాజుకు నచ్చలేదని తెలిసింది. దీంతో ఆయన సైలెంట్గానే ఉండిపోయారు. రాజమండ్రి నుంచి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పోటీ చేసినా వీర్రాజు పెద్దగా యాక్టివ్గా కనిపించలేదు.
ఇక కదిరి నియోజకవర్గానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి మౌనం కూడా హాట్ టాపిక్గా మారింది. ఈ ఎన్నికల్లో ఆయన హిందూపురం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా టికెట్ దక్కే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన మ్యానిఫెస్టోతో తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పారు. మరోవైపు మొన్నటివరకూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జీవీఎల్ నరసింహారావు కూడా అంతే. విశాఖ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన కేవలం ఒక నియోజకవర్గంలో ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపించారు.
This post was last modified on May 22, 2024 2:37 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…