ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోటి వెంట కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జపం వినిపించింది. నిజానికి గత పదేళ్ల కాలంలో గాంధీ ల కుటుంబాన్ని తిట్టడమే తప్ప.. ప్రధాని నరేంద్ర మోడీ చేసింది.. సాధించింది.. ఏమీ లేదని ఆ పార్టీ నాయకులు తరచుగా విమర్శిస్తుంటారు. ఎన్నికల వేళ అయితే.. నెహ్రూ హయాం నుంచి గాంధీల హయాం వరకు కూడా.. మోడీ విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇటీవల కూడా.. తాము అధికారంలోకి వస్తే.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను సొంతం చేసుకుంటామన్నారు.
అంతేకాదు… పీవోకేను పాక్ ఆక్రమించడానికి నెహ్రూ, గాంధీల కుటుంబమే కారణమని మోడీ సహా బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. గాంధీల కుటుంబం 60 ఏళ్లపా టు ఈ దేశాన్ని ఏలినా.. ఏ నాడూ పాక్ ఆక్రమిత కశ్మీర్ను వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. ఇక, మత పరంగా.. కూడా కాంగ్రెస్ ముస్లింలకు దన్నుగా ఉందంటూ.. గాంధీల కుటుంబంపై మోడీ విరుచుకుపడుతూనే ఉన్నారు. అయితే.. అనూహ్యంగా ఆయన నోటి నుంచి రాజీవ్ గాంధీపై ప్రశంసలు.. ఆవేదన, ఆందోళన అన్నీ ఒక్కసారిగా వచ్చాయి.
మంగళవారం(మే 21) రాజీవ్ గాంధీ వర్దంతి. ఆయన 1991లో ఎన్నికల ప్రచారానికి తమిళనాడులోని పెరుంబదూర్కు వెళ్లినప్పుడు మానవబాంబు ఆయనను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ వర్ధంతిని పురస్కరించుకుని మోడీ.. తొలిసారి రాజీవ్కు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. గతంలో అంటే.. ఈ 9 సంవత్సరాల కాలంలో ఏనాడూ ఆయన రాజీవ్ స్మరణ చేయకపోవడం గమనార్హం.
మరి ఇప్పుడు ఎందుకు చేశారంటే.. కీలకమైన ఆరు, ఏడోదశల్లో ఎన్నికలు మిగిలి ఉన్నాయి. పైగా.. ఇంతో అంతో గాంధీలు పుంజుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ హవాను తన వైపు తిప్పు కోవడం కోసం.. మోడీ ఈ వర్ధంతిని వినియోగించుకున్నారని.. కాంగ్రెస్ నేతలు చెబుతుండడం గమనార్హం. ఇదిలావుంటే.. దేశంలో ఐటీ విప్లవానికి పునాదులు వేసింది.. రాజీవ్ గాంధీ. అప్పటి పంచవర్ష ప్రణాళికలో ఆయన.. వీటిని ప్రధానంగా చేర్చారు. అందుకే.. ఇప్పటికీ.. ఐఐటీలకు.. ఐఐఎంలకు.. ఐటీ వంటి సంస్థలకు.. జాతీయ స్థాయిలో ఆయన పేరునే కొనసాగిస్తున్నారు.
This post was last modified on May 21, 2024 3:59 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…