ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోటి వెంట కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జపం వినిపించింది. నిజానికి గత పదేళ్ల కాలంలో గాంధీ ల కుటుంబాన్ని తిట్టడమే తప్ప.. ప్రధాని నరేంద్ర మోడీ చేసింది.. సాధించింది.. ఏమీ లేదని ఆ పార్టీ నాయకులు తరచుగా విమర్శిస్తుంటారు. ఎన్నికల వేళ అయితే.. నెహ్రూ హయాం నుంచి గాంధీల హయాం వరకు కూడా.. మోడీ విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇటీవల కూడా.. తాము అధికారంలోకి వస్తే.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను సొంతం చేసుకుంటామన్నారు.
అంతేకాదు… పీవోకేను పాక్ ఆక్రమించడానికి నెహ్రూ, గాంధీల కుటుంబమే కారణమని మోడీ సహా బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. గాంధీల కుటుంబం 60 ఏళ్లపా టు ఈ దేశాన్ని ఏలినా.. ఏ నాడూ పాక్ ఆక్రమిత కశ్మీర్ను వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. ఇక, మత పరంగా.. కూడా కాంగ్రెస్ ముస్లింలకు దన్నుగా ఉందంటూ.. గాంధీల కుటుంబంపై మోడీ విరుచుకుపడుతూనే ఉన్నారు. అయితే.. అనూహ్యంగా ఆయన నోటి నుంచి రాజీవ్ గాంధీపై ప్రశంసలు.. ఆవేదన, ఆందోళన అన్నీ ఒక్కసారిగా వచ్చాయి.
మంగళవారం(మే 21) రాజీవ్ గాంధీ వర్దంతి. ఆయన 1991లో ఎన్నికల ప్రచారానికి తమిళనాడులోని పెరుంబదూర్కు వెళ్లినప్పుడు మానవబాంబు ఆయనను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ వర్ధంతిని పురస్కరించుకుని మోడీ.. తొలిసారి రాజీవ్కు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. గతంలో అంటే.. ఈ 9 సంవత్సరాల కాలంలో ఏనాడూ ఆయన రాజీవ్ స్మరణ చేయకపోవడం గమనార్హం.
మరి ఇప్పుడు ఎందుకు చేశారంటే.. కీలకమైన ఆరు, ఏడోదశల్లో ఎన్నికలు మిగిలి ఉన్నాయి. పైగా.. ఇంతో అంతో గాంధీలు పుంజుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ హవాను తన వైపు తిప్పు కోవడం కోసం.. మోడీ ఈ వర్ధంతిని వినియోగించుకున్నారని.. కాంగ్రెస్ నేతలు చెబుతుండడం గమనార్హం. ఇదిలావుంటే.. దేశంలో ఐటీ విప్లవానికి పునాదులు వేసింది.. రాజీవ్ గాంధీ. అప్పటి పంచవర్ష ప్రణాళికలో ఆయన.. వీటిని ప్రధానంగా చేర్చారు. అందుకే.. ఇప్పటికీ.. ఐఐటీలకు.. ఐఐఎంలకు.. ఐటీ వంటి సంస్థలకు.. జాతీయ స్థాయిలో ఆయన పేరునే కొనసాగిస్తున్నారు.
This post was last modified on May 21, 2024 3:59 pm
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…