Political News

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: ఫ‌స్ట్ టైం మోడీ.. రాజీవ్ జ‌పం!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నోటి వెంట కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కుడు, దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీ జపం వినిపించింది. నిజానికి గ‌త ప‌దేళ్ల కాలంలో గాంధీ ల కుటుంబాన్ని తిట్ట‌డ‌మే త‌ప్ప‌.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసింది.. సాధించింది.. ఏమీ లేదని ఆ పార్టీ నాయ‌కులు త‌ర‌చుగా విమ‌ర్శిస్తుంటారు. ఎన్నిక‌ల వేళ అయితే.. నెహ్రూ హ‌యాం నుంచి గాంధీల హ‌యాం వ‌ర‌కు కూడా.. మోడీ విరుచుకుప‌డుతూనే ఉన్నారు. ఇటీవ‌ల కూడా.. తాము అధికారంలోకి వ‌స్తే.. పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌(పీవోకే)ను సొంతం చేసుకుంటామ‌న్నారు.

అంతేకాదు… పీవోకేను పాక్ ఆక్ర‌మించ‌డానికి నెహ్రూ, గాంధీల కుటుంబ‌మే కార‌ణ‌మ‌ని మోడీ స‌హా బీజేపీ నేత‌లు చెప్పుకొచ్చారు. గాంధీల కుటుంబం 60 ఏళ్ల‌పా టు ఈ దేశాన్ని ఏలినా.. ఏ నాడూ పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ను వెన‌క్కి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌న్నారు. ఇక‌, మ‌త ప‌రంగా.. కూడా కాంగ్రెస్ ముస్లింల‌కు ద‌న్నుగా ఉందంటూ.. గాంధీల కుటుంబంపై మోడీ విరుచుకుప‌డుతూనే ఉన్నారు. అయితే.. అనూహ్యంగా ఆయ‌న నోటి నుంచి రాజీవ్ గాంధీపై ప్ర‌శంస‌లు.. ఆవేద‌న‌, ఆందోళ‌న అన్నీ ఒక్క‌సారిగా వ‌చ్చాయి.

మంగ‌ళ‌వారం(మే 21) రాజీవ్ గాంధీ వ‌ర్దంతి. ఆయ‌న 1991లో ఎన్నికల ప్ర‌చారానికి తమిళ‌నాడులోని పెరుంబ‌దూర్‌కు వెళ్లిన‌ప్పుడు మాన‌వబాంబు ఆయ‌న‌ను పొట్ట‌న పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని మోడీ.. తొలిసారి రాజీవ్‌కు ఎక్స్ వేదిక‌గా నివాళుల‌ర్పించారు. గ‌తంలో అంటే.. ఈ 9 సంవ‌త్స‌రాల కాలంలో ఏనాడూ ఆయ‌న రాజీవ్ స్మ‌ర‌ణ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మ‌రి ఇప్పుడు ఎందుకు చేశారంటే.. కీల‌క‌మైన ఆరు, ఏడోద‌శ‌ల్లో ఎన్నిక‌లు మిగిలి ఉన్నాయి. పైగా.. ఇంతో అంతో గాంధీలు పుంజుకుంటున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆ హ‌వాను త‌న వైపు తిప్పు కోవ‌డం కోసం.. మోడీ ఈ వ‌ర్ధంతిని వినియోగించుకున్నార‌ని.. కాంగ్రెస్ నేత‌లు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. దేశంలో ఐటీ విప్ల‌వానికి పునాదులు వేసింది.. రాజీవ్ గాంధీ. అప్ప‌టి పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళికలో ఆయ‌న‌.. వీటిని ప్ర‌ధానంగా చేర్చారు. అందుకే.. ఇప్ప‌టికీ.. ఐఐటీల‌కు.. ఐఐఎంల‌కు.. ఐటీ వంటి సంస్థ‌ల‌కు.. జాతీయ స్థాయిలో ఆయ‌న పేరునే కొన‌సాగిస్తున్నారు.

This post was last modified on May 21, 2024 3:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

11 minutes ago

ఒంట‌రి పోరు వెనుక `విజ‌య్‌` ర‌హ‌స్యం బయటపడిందా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…

30 minutes ago

బైకర్ స్పీడ్ ఇంకా పెరగాలి

శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…

42 minutes ago

‘రాధాకృష్ణకు పోలీసు భద్రత ఎల్లప్పుడూ ఉండదు’

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది.…

50 minutes ago

బీజేపీ ఎమ్మెల్యే నోట రాజీమానా మాట

ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా…

2 hours ago

పెద్ది… పెద్ద మనసు చేసుకుని చెప్పేసెయ్

ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం…

2 hours ago