Political News

బాల‌య్య హ్యాట్రిక్ ప‌క్కా.. కానీ చీలే ఓట్లెన్ని?

హిందూపురం.. టీడీపీ కంచుకోట‌ల్లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదొక‌టి. ఇక్క‌డ టీడీపీకి ఎదురేలేదు. వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన నంద‌మూరి బాల‌కృష్ణ ఈ సారి హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మ‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న విజ‌యాన్ని అడ్డుకునే నాయ‌కుడే లేర‌ని అంటున్నారు. గెలుపు అయితే ప‌క్కా కానీ ఈ సారి మాత్రం బాల‌య్య మెజారిటీ త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అందుకు స్వంతంత్ర అభ్య‌ర్థి ప‌రిపూర్ణానంద స్వామి పోటీలో ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.

ఈ సారి హిందూపురంలో బాల‌య్య‌కు చెక్ పెట్టాల‌ని వైసీపీ తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. బీసీ వ‌ర్గానికి చెందిన తిప్పేగౌడ నారాయ‌ణ్ దీపిక‌ను ఆ పార్టీ బ‌రిలో దించింది. వైసీపీ ఓటు బ్యాంకు మొత్తం అటు వైపే మ‌ళ్లింద‌నే టాక్ ఉంది. అయినా బాల‌య్య‌కు వ‌చ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ టీడీపీ ఓటు బ్యాంకులో కొంత‌మంది స్వ‌తంత్ర అభ్య‌ర్థి అయిన ప‌రిపూర్ణానంద స్వామి వైపు మొగ్గుచూప‌డం మాత్రం కాస్త దెబ్బ‌తీసేదే. బాల‌య్యకు ప‌డే ఓట్ల‌ను స్వామిజీ చీల్చార‌నే చెప్పాలి. 2019లో బాల‌య్య సుమారు 28 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ సారి కూడా గెలుపు ఆయ‌న‌దే కానీ ఆ మెజారిటీ మాత్రం త‌గ్గొచ్చ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.

కానీ మ‌రోవైపు వైసీపీ అభ్య‌ర్థిపై స్థానిక నాయ‌కుల్లో విభేదాలు వ్య‌క్త‌మ‌య్యాయ‌ని తెలిసింది. దీంతో వైసీపీ క్యాడ‌ర్‌లోని కొంత‌మంది కూడా బాల‌య్య‌కే జై కొట్టార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బాల‌య్య ఎంత మెజారిటీ సాధిస్తార‌న్న‌ది ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింది. మ‌రి అది తేలాలంటే జూన్ 4 వ‌ర‌కు ఆగాల్సిందే.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

2 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

2 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

5 hours ago