పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోటీకి దిగిన వైసీపీ ఎంపీ (కాకినాడ) వంగా గీత, జనసేన పార్టీలోకి జంప్ చేయబోతున్నారా.? పోలింగుకి ముందే వంగా గీత, జనసేనలోకి జంప్ చేస్తారన్న పుకార్లు ఎలా పుట్టాయి.? ఓటమి ఖాయమవడంతో వంగా గీత, జనసేనలోకి చేరతారన్న ప్రచారంలో నిజమెంత.?
వంగా గీత విషయంలోనే కాదు, చాలామంది వైసీపీ అభ్యర్థుల విషయంలో ఈ ప్రచారం చాలా గట్టిగా జరుగుతోంది. 151 కంటే ఎక్కువ సీట్లను గెలవబోతున్నాం.. అని ఇటీవల ఐ-ప్యాక్ టీమ్తో ముచ్చట్ల సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
వైఎస్ జగన్ చెప్పేదే నిజమైతే, వైసీపీ అభ్యర్థులెందుకు ఇతర పార్టీల వైపు చూస్తారు.? వైఎస్ జగన్ ఏమైనా చెప్పొచ్చుగాక. కానీ, గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు వేరేలా వున్నాయ్. వైసీపీ శ్రేణుల ఆశ ఏంటంటే, బొటాబొటి మెజార్టీతో అయినా, అధికారంలోకి వస్తే, ఆ తర్వాత విపక్షాల్ని నిర్వీర్యం చేసెయ్యొచ్చు.. అసలంటూ విపక్షాలే లేకుండా చేసెయయ్యడానికి వీలవుతుందని.
కానీ, గెలుపుపై కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) చాలా ధీమాగా వున్నాయి. 120 ప్లస్ సీట్లతో అధికారం కైవసం చేసుకుంటామని కూటమి నేతలంటున్నారు. 160 ప్లస్ రావొచ్చునని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెబుతున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల ముందరే చాలామంది వైసీపీ నేతలు, అందునా ప్రజా ప్రతినిథులు వైసీపీని వీడి, టీడీపీలో చేరిపోయారు. ఎన్నికలయ్యాక, వైసీపీ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోతే, వైసీపీ ఖాళీ అయిపోవడానికి పెద్దగా సమయం కూడా పట్టదు.
ఎటూ గెలిచే అవకాశం లేదన్న భావనతో వున్నారేమో, వంగా గీత ఒకింత తొందరపడుతున్నారు. చిరంజీవి పట్ల అభిమానాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చాటుకోవడం వైసీపీ శ్రేణులకు అస్సలు మింగుడుపడ్డంలేదు. పైగా, పవన్ కళ్యాణ్ మీద తానెక్కడా విమర్శలు చేయలేదని చెబుతుండడం వైసీపీని బాగా ఇబ్బంది పెడుతోంది.
This post was last modified on May 19, 2024 6:45 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…