భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన మాజీ ప్రధాని మనవడి కోసం బ్లూ కార్నర్ నోటీసులు సహా అరెస్టు వారెంటు జారీ చేయడం.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఆయనే మాజీ ప్రధాని దేవెగౌడ.. ఆయన మనవడే.. సెక్స్ ర్యాకెట్ కుంభకోణంలో చిక్కుకున్న పార్లమెంటు(హాసన్) సభ్యుడు 36 ఏళ్ల ప్రజ్వల్. తాజాగా ఈయనపై అరెస్టు వారెంటు జారీ అయింది.
రెండు రోజుల కిందటే బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. దీనిని సహజంగా అత్యంత దారుణమైన నేరాలు చేసిన వారిని ఉద్దేశించి.. ఇతర దేశాల్లో ఆచూకీ తెలిస్తే.. తమకు చెప్పాలని జారీ చేసే నోటీసు. రెడ్ కార్నర్ అంటే.. ఎక్కడ కనిపించినా.. అదుపులో ఉంచుకుని.. తమకు సమాచారం ఇవ్వాలని జారీ చేస్తారు. ప్రజ్వల్పై తాజాగా భారత ప్రభుత్వం బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు దేవె గౌడ మనవడిపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.
అంతేకాదు.. ప్రజా ప్రతినిధుల కోర్టు తాజాగా ఆయనను అరెస్టు చేయాలని.. వారెంట్ జారీ చేసింది. సుమారు 3 వేల మందికిపైగాఉద్యోగినులు, యువతులపై అత్యాచారం చేయడంతోపాటు.. వాటిని వీడియోలు తీయడం.. వంటి ఘటనలు వెలుగు చూడడంతో ప్రజ్వల్ను జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక, ఈ విషయం తెలిసి కూడా దాచిపెట్టారని.. ఇంట్లో పని మనిషిని నిజం చెప్పకుండా అపహరించారన్న నేరంపై ప్రజ్వల్ తండ్రి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే రేవణ్ణను కూడా అరెస్టు చేయడం.. తర్వాత ఆయన బెయిల్పై బయటకు రావడం తెలిసిందే.
ఇక, ప్రజ్వల్ప్రస్తుతం బ్రిటన్కువెళ్లారని ప్రచారంలో ఉన్నా.. నిఘా అధికారులు మాత్రం.. ఆయన పలు దేశాలకు తిరుగుతూ.. ఎక్కడా చిక్కకుండా తప్పించుకుంటున్నాడనితెలిపారు. దీంతో ప్రజ్వల్ పేరుతో ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి.. నిధులు అందకుండా చూసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే.. ఈ పరిణామాలు.. కేవలం జేడీఎస్నే కాదు.. దేవెగౌడ కుటుంబాన్ని మాత్రమే కాదు.. యావత్ దేశం మొత్తాన్ని కూడా కలవరపరుస్తున్నాయి. దీనికి కారణం.. “మాజీ ప్రధాని మనవడి కోసం… బ్లూ కార్నర్ నోటీసు.. అరెస్టు వారెంటు!” అంటూ.. అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడమే!!
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…