ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు దేశం తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నా డని.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా ఇలానే చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తాజాగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్ అనంతరం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయని.. దీంతో అసలు ఏం జరుగుతోందో కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడిదని అన్నారు.
ఇలాంటి సమయంలో పాలన చేయాల్సిన ముఖ్యమంత్రి జగన్.. దానిని గాలికి వదిలేసి విదేశాలకు వెళ్లిపోవడం ఏంటి? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఆయనేమన్నా ప్రతిపక్షంలో ఉన్నారా? బాధ్యతలేదని అనుకున్నారా? అని ప్రశ్నించారు. వివిధ ప్రాంతాల్లో గత వారం రోజులుగా అల్లర్లు జరుగుతున్నాయని.. నాయకులు తప్పించుకుని కార్యకర్తలను ఇరికిస్తున్నారని.. ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల వలలో చిక్కుకుంటే ఇలానే జరుగుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఒకవైపు వ్యవసాయ సీజన్.. మరోవైపు.. విద్యాసంవత్సరం ప్రారంభం అవుతున్న సమయంలో రైతులు, విద్యార్థులకు మేలు చేయాల్సిన దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా వారాల తరబడి విదేశాల్లోమకాం వేయడంఏంటని జేడీ నిలదీశారు. ఇలాంటి సమయంలోనే ముఖ్యమంత్రి అనే నాయకుడు రాష్ట్రంలో ఉండి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని.. ప్రజలకు భరోసా ఇవ్వాలని అన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన జగన్.. తన కుటుంబంతో సహా విహార యాత్రకు వెళ్లడంసరికాదని పెదవివిరిచారు.
This post was last modified on May 19, 2024 2:49 pm
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…