Political News

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌ప్పుడు దేశం త‌గ‌ల‌బ‌డుతుంటే.. నీరో చ‌క్ర‌వ‌ర్తి ఫిడేల్ వాయించుకున్నా డ‌ని.. ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా ఇలానే చేస్తున్నార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. తాజాగా విశాఖ‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో అల్ల‌ర్లు చెల‌రేగాయ‌ని.. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోందో కూడా అర్ధం కాని ప‌రిస్థితి ఏర్ప‌డిద‌ని అన్నారు.

ఇలాంటి స‌మ‌యంలో పాల‌న చేయాల్సిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. దానిని గాలికి వ‌దిలేసి విదేశాల‌కు వెళ్లిపోవడం ఏంటి? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ఆయ‌నేమ‌న్నా ప్ర‌తిప‌క్షంలో ఉన్నారా? బాధ్య‌త‌లేద‌ని అనుకున్నారా? అని ప్ర‌శ్నించారు. వివిధ ప్రాంతాల్లో గ‌త వారం రోజులుగా అల్ల‌ర్లు జ‌రుగుతున్నాయ‌ని.. నాయ‌కులు త‌ప్పించుకుని కార్య‌క‌ర్త‌ల‌ను ఇరికిస్తున్నార‌ని.. ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నాయ‌కుల వ‌ల‌లో చిక్కుకుంటే ఇలానే జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.

రాష్ట్రంలో ఒక‌వైపు వ్య‌వ‌సాయ సీజ‌న్‌.. మ‌రోవైపు.. విద్యాసంవ‌త్స‌రం ప్రారంభం అవుతున్న స‌మ‌యంలో రైతులు, విద్యార్థులకు మేలు చేయాల్సిన దిశ‌గా నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఒక‌రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా వారాల త‌ర‌బ‌డి విదేశాల్లోమ‌కాం వేయ‌డంఏంట‌ని జేడీ నిల‌దీశారు. ఇలాంటి స‌మ‌యంలోనే ముఖ్య‌మంత్రి అనే నాయ‌కుడు రాష్ట్రంలో ఉండి ప‌రిస్థితిని అదుపులోకి తీసుకురావాల‌ని.. ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇవ్వాల‌ని అన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన జ‌గ‌న్.. త‌న కుటుంబంతో స‌హా విహార యాత్ర‌కు వెళ్ల‌డంస‌రికాద‌ని పెద‌వివిరిచారు.

This post was last modified on May 19, 2024 2:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago