ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆయా జిల్లాలకు కొత్త అదికారులను నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పంపించిన పేర్ల నుంచి వారిని ఎంపిక చేసి.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. పల్నాడు జిల్లా కలెక్టర్గా ఉన్న లోతోటి శివశంకర్ను బదిలీ చేసిన ఎన్నికల సంఘం కొత్త కలెక్టర్ శ్రీకేష్ బాలాజీని నియమించింది.
అదేవిధంగా పల్నాడు ఎస్పీగా ఉన్న బిందు మాధవ్ను సస్పెండ్ చేసి.. ఈ స్థానంలో మల్లికా గార్గ్ను నియమించింది. అలాగే తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. వీరిని తక్షణమే ఆయా పోస్టుల్లో చేరాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆదివారం ఉదయానికి తమకు మళ్లీ నివేదిక పంపించాలని కోరింది. ఇదిలా వుంటే.. పల్నాడులో చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఇప్పటికే వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో కూడిన ఉన్నతస్థాయి ప్రత్యేకదర్యాప్తు బృందాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.
ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పని ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో పర్యటించి.. వాస్తవాలు వెలికితీయడంతోపాటు.. ఘటన లను ఎందుకు అడ్డుకోలేక పోయారు..? దీనివెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తును కూడా ఈ బృందం పూర్తి చేసి.. క్షేత్రస్థాయి పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక రూపంలో అందించింది. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదికను ఈ సిట్ అందించనుంది. మరోవైపు.. దాడికి కారణమైన కొందరు రాజకీయ పార్టీల నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో వారి వివరాలను కూడా రాబడుతున్నారు.
This post was last modified on May 18, 2024 10:04 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…