Political News

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు వేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా ఆయా జిల్లాల‌కు కొత్త అదికారుల‌ను నియ‌మించింది. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్ రెడ్డి పంపించిన పేర్ల నుంచి వారిని ఎంపిక చేసి.. తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీని ప్ర‌కారం.. ప‌ల్నాడు జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఉన్న లోతోటి శివ‌శంక‌ర్‌ను బ‌దిలీ చేసిన ఎన్నిక‌ల సంఘం కొత్త క‌లెక్ట‌ర్ శ్రీకేష్ బాలాజీని నియ‌మించింది.

అదేవిధంగా ప‌ల్నాడు ఎస్పీగా ఉన్న బిందు మాధ‌వ్‌ను స‌స్పెండ్ చేసి.. ఈ స్థానంలో మ‌ల్లికా గార్గ్‌ను నియ‌మించింది. అలాగే తిరుపతి జిల్లా ఎస్పీగా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని ఎన్నిక‌ల సంఘం ఎంపిక చేసింది. వీరిని త‌క్ష‌ణ‌మే ఆయా పోస్టుల్లో చేరాల‌ని ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. ఆదివారం ఉద‌యానికి త‌మ‌కు మ‌ళ్లీ నివేదిక పంపించాల‌ని కోరింది. ఇదిలా వుంటే.. ప‌ల్నాడులో చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై ఇప్ప‌టికే వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 13 మంది అధికారుల‌తో కూడిన ఉన్న‌త‌స్థాయి ప్ర‌త్యేక‌ద‌ర్యాప్తు బృందాన్ని కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన విష‌యం తెలిసిందే.

ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ఇప్ప‌టికే ప‌ని ప్రారంభించింది. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి.. వాస్త‌వాలు వెలికితీయ‌డంతోపాటు.. ఘ‌ట‌న ల‌ను ఎందుకు అడ్డుకోలేక పోయారు..? దీనివెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? వంటి కీల‌క అంశాల‌పై దృష్టి పెట్టింది. ఇప్ప‌టికే ప్రాథ‌మిక ద‌ర్యాప్తును కూడా ఈ బృందం పూర్తి చేసి.. క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితిని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి నివేదిక రూపంలో అందించింది. మ‌రో రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక‌ను ఈ సిట్ అందించ‌నుంది. మ‌రోవైపు.. దాడికి కార‌ణ‌మైన కొంద‌రు రాజ‌కీయ పార్టీల నాయ‌కులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో వారి వివ‌రాల‌ను కూడా రాబ‌డుతున్నారు.

This post was last modified on May 18, 2024 10:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

2 hours ago

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

4 hours ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

4 hours ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

5 hours ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

5 hours ago

ఈ నలుగురు కొడితే 10 వేల కోట్లా?

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…

6 hours ago