బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే విషయంపై తర్జన భర్జనలు ఉన్నా..ఎవరికి వారు అంచనాలు వేసుకున్నా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. 92 స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉందనే లెక్కలు అందుతున్నాయి. ప్రాంతాల వారీగా చూసినా.. అభ్యర్థుల పరంగా అంచనా వేసినా.. ఈ లెక్క ఖచ్చితమనే తెలుస్తోందని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
వీటిలో కీలకమైన ఉండి, మంగళగిరి, టెక్కలి, పలాస, కుప్పం, ఎచ్చెర్ల, విజయవాడ సెంట్రల్, తూర్పు, విశాఖ తూర్పు, దక్షిణం సహా 92 నియోజకవర్గాలు ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో కంటే కూడా ఇక్కడ ఎక్కువగా పోలింగ్ జరిగిన నేపథ్యంలో తమ గెలుపు ఖాయమని వారు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ పొత్తులో భాగంగా 144 స్థానాల్లో పోటీ చేసింది. అయితే.. ఎంతలేదన్నా.. తమకు 92 స్థానాల్లో పక్కా విజయం ఖాయమని చెబుతున్నారు. ఆయా స్థానాల్లో ఉన్న నాయకుల పనితీరును కూడా అంచనా వేసుకుంటున్నారు.
అంటే కేవలం టీడీపీ ఒక్కటే 92 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని టీడీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సారి పుంగనూరు కూడా గెలిచే అవకాశం ఉండడం గమనార్హం. అదేవిధంగా కుప్పంతోపాటు.. చిత్తూరు, పీలేరు నియోజకవర్గాల్లోనూ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని తెలుస్తోంది. ఇక, మరో అంశం.. పార్టీలో సమన్వయం టికెట్ల విషయంలో కొంత రగడ జరిగినా.. పెనమలూరు, నూజివీడు, గుడివాడ వంటి కీలక స్థానాలపై ముందు నుంచి కూడా.. చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
చివరి నిముషంలో చంద్రబాబు.. తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆయా నియోజకవర్గాల్లోనూ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని , అధికారంలోకి రావడం పక్కా అని లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 18, 2024 12:29 pm
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…
అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…
ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…
యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…