బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే విషయంపై తర్జన భర్జనలు ఉన్నా..ఎవరికి వారు అంచనాలు వేసుకున్నా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. 92 స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉందనే లెక్కలు అందుతున్నాయి. ప్రాంతాల వారీగా చూసినా.. అభ్యర్థుల పరంగా అంచనా వేసినా.. ఈ లెక్క ఖచ్చితమనే తెలుస్తోందని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
వీటిలో కీలకమైన ఉండి, మంగళగిరి, టెక్కలి, పలాస, కుప్పం, ఎచ్చెర్ల, విజయవాడ సెంట్రల్, తూర్పు, విశాఖ తూర్పు, దక్షిణం సహా 92 నియోజకవర్గాలు ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో కంటే కూడా ఇక్కడ ఎక్కువగా పోలింగ్ జరిగిన నేపథ్యంలో తమ గెలుపు ఖాయమని వారు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ పొత్తులో భాగంగా 144 స్థానాల్లో పోటీ చేసింది. అయితే.. ఎంతలేదన్నా.. తమకు 92 స్థానాల్లో పక్కా విజయం ఖాయమని చెబుతున్నారు. ఆయా స్థానాల్లో ఉన్న నాయకుల పనితీరును కూడా అంచనా వేసుకుంటున్నారు.
అంటే కేవలం టీడీపీ ఒక్కటే 92 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని టీడీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సారి పుంగనూరు కూడా గెలిచే అవకాశం ఉండడం గమనార్హం. అదేవిధంగా కుప్పంతోపాటు.. చిత్తూరు, పీలేరు నియోజకవర్గాల్లోనూ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని తెలుస్తోంది. ఇక, మరో అంశం.. పార్టీలో సమన్వయం టికెట్ల విషయంలో కొంత రగడ జరిగినా.. పెనమలూరు, నూజివీడు, గుడివాడ వంటి కీలక స్థానాలపై ముందు నుంచి కూడా.. చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
చివరి నిముషంలో చంద్రబాబు.. తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆయా నియోజకవర్గాల్లోనూ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని , అధికారంలోకి రావడం పక్కా అని లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 18, 2024 12:29 pm
మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. ఎల్-2: ఎంపురాన్. ఆ ఇండస్ట్రీలో అత్యధిక హైప్ తెచ్చుకున్న సినిమా కూడా…
విశాఖపట్టణంలోని సుందర తీరం రిషికొండ బీచ్ కు తిరిగి బ్లూఫాగ్ గుర్తింపు దక్కింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఈ…
ఏపీలోని కూటమి ప్రభుత్వం.. త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన చేస్తుందా? లేక.. మంత్రివర్గంలో కూర్పు వరకు పరిమితం అవుతుందా? అంటే..…
అగ్ర రాజ్యం అమెరికాలో డబ్బులిచ్చి పౌరసత్వం కొనుక్కొనే వెసులుబాటు అప్పుడే మొదలైపోయింది. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే... గోల్డ్ కార్డ్…
పీకే.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటి. 2014లో వచ్చిన ఈ చిత్రం ఆల్ టైం బ్లాక్…
కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల రాజకీయాలు చేస్తున్నారా? లేక ఎండ వేడిమి తట్టుకోలేక.. ఇంటి పట్టునే ఉంటున్నారా? అంటే..…