బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే విషయంపై తర్జన భర్జనలు ఉన్నా..ఎవరికి వారు అంచనాలు వేసుకున్నా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. 92 స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉందనే లెక్కలు అందుతున్నాయి. ప్రాంతాల వారీగా చూసినా.. అభ్యర్థుల పరంగా అంచనా వేసినా.. ఈ లెక్క ఖచ్చితమనే తెలుస్తోందని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
వీటిలో కీలకమైన ఉండి, మంగళగిరి, టెక్కలి, పలాస, కుప్పం, ఎచ్చెర్ల, విజయవాడ సెంట్రల్, తూర్పు, విశాఖ తూర్పు, దక్షిణం సహా 92 నియోజకవర్గాలు ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో కంటే కూడా ఇక్కడ ఎక్కువగా పోలింగ్ జరిగిన నేపథ్యంలో తమ గెలుపు ఖాయమని వారు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ పొత్తులో భాగంగా 144 స్థానాల్లో పోటీ చేసింది. అయితే.. ఎంతలేదన్నా.. తమకు 92 స్థానాల్లో పక్కా విజయం ఖాయమని చెబుతున్నారు. ఆయా స్థానాల్లో ఉన్న నాయకుల పనితీరును కూడా అంచనా వేసుకుంటున్నారు.
అంటే కేవలం టీడీపీ ఒక్కటే 92 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని టీడీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సారి పుంగనూరు కూడా గెలిచే అవకాశం ఉండడం గమనార్హం. అదేవిధంగా కుప్పంతోపాటు.. చిత్తూరు, పీలేరు నియోజకవర్గాల్లోనూ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని తెలుస్తోంది. ఇక, మరో అంశం.. పార్టీలో సమన్వయం టికెట్ల విషయంలో కొంత రగడ జరిగినా.. పెనమలూరు, నూజివీడు, గుడివాడ వంటి కీలక స్థానాలపై ముందు నుంచి కూడా.. చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
చివరి నిముషంలో చంద్రబాబు.. తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆయా నియోజకవర్గాల్లోనూ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని , అధికారంలోకి రావడం పక్కా అని లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 18, 2024 12:29 pm
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…