ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులను నియంత్రించడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు ట్వీట్ రూపంలో తన ఆవేదన్ని తెలిపారు. వైసీపీ రౌడీల దాడులను పోలీసులు చోద్యం చూసినట్టు చూశారని నియంత్రించలేక పోయారని పేర్కొన్నారు.
ఇప్పుడు హింసా రాజకీయాలు విశాఖపట్నానికి కూడా పాకాయని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల వేళ తాము ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా.. టీడీపీకి ఓటేశారన్న ఒకే ఒక్క కారణంగా ఉత్తర నియోజకవర్గం లోని ఓ కుటుంబంపై వైసీపీ మూకలు దాడులు చేశారని చంద్రబాబు తెలిపారు. బాధితుల్లో మహిళలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఏం జరిగినా ఏమవుతుందిలే! అన్నట్టు పోలీసులు వ్యవహరించిన తీరు కారణంగా వైసీపీ రౌడీలు రెచ్చిపోతున్నారని చంద్రబాబు తెలిపారు.
ఇక, పల్నాడు, తాడిపత్రిలో పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాకపోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. వైసీపీ రౌడీ మూకలు ఇళ్లలో బాంబులు, మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్న విషయం పోలీసులే గుర్తించినా.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్లలో మారణహోమానికి కారణమైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
అలాగే విజయవాడ భవానీపురంలో పోలింగ్ రోజు జరిగిన దాడి కేసులో నిందితుడు… పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ నేత స్టేషన్ నుంచి పారిపోవడం పోలీసులు చోద్యం చూస్తున్నారని చెప్పడానికి నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయ హింసను ప్రేరేపించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా.. మౌనంగా ఉన్న పోలీసులపై కూడా చర్యలు తీసుకుని ఆయా ఘటనలను వెంటనే నిలువరించాలని చంద్రబాబు సూచించారు.
This post was last modified on May 17, 2024 6:58 am
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…
తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…
విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…