Political News

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ దాడుల‌ను నియంత్రించ‌డంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ మేర‌కు ఏపీ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డికి చంద్ర‌బాబు ట్వీట్ రూపంలో త‌న ఆవేద‌న్ని తెలిపారు. వైసీపీ రౌడీల దాడుల‌ను పోలీసులు చోద్యం చూసిన‌ట్టు చూశార‌ని నియంత్రించ‌లేక పోయార‌ని పేర్కొన్నారు.

ఇప్పుడు హింసా రాజ‌కీయాలు విశాఖ‌ప‌ట్నానికి కూడా పాకాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఎన్నిక‌ల వేళ తాము ఇచ్చిన డ‌బ్బులు తీసుకోకుండా.. టీడీపీకి ఓటేశార‌న్న ఒకే ఒక్క కార‌ణంగా ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం లోని ఓ కుటుంబంపై వైసీపీ మూక‌లు దాడులు చేశార‌ని చంద్ర‌బాబు తెలిపారు. బాధితుల్లో మ‌హిళ‌లు కూడా ఉన్నార‌ని పేర్కొన్నారు. ఏం జ‌రిగినా ఏమ‌వుతుందిలే! అన్న‌ట్టు పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు కార‌ణంగా వైసీపీ రౌడీలు రెచ్చిపోతున్నార‌ని చంద్ర‌బాబు తెలిపారు.

ఇక‌, ప‌ల్నాడు, తాడిప‌త్రిలో ప‌రిస్థితి ఇప్ప‌టికీ అదుపులోకి రాక‌పోవ‌డాన్ని చంద్ర‌బాబు తీవ్రంగా త‌ప్పుబట్టారు. వైసీపీ రౌడీ మూకలు ఇళ్లలో బాంబులు, మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్న విష‌యం పోలీసులే గుర్తించినా.. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మాచర్లలో మారణహోమానికి కారణ‌మైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని ఎందుకు అరెస్టు చేయ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

అలాగే విజయవాడ భవానీపురంలో పోలింగ్ రోజు జరిగిన దాడి కేసులో నిందితుడు… పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ నేత స్టేషన్ నుంచి పారిపోవడం పోలీసులు చోద్యం చూస్తున్నార‌ని చెప్ప‌డానికి నిదర్శనమ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. రాజ‌కీయ హింస‌ను ప్రేరేపించిన వారిపైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. ఇంత జ‌రుగుతున్నా.. మౌనంగా ఉన్న పోలీసుల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకుని ఆయా ఘ‌ట‌న‌ల‌ను వెంట‌నే నిలువ‌రించాల‌ని చంద్ర‌బాబు సూచించారు.

Satya

Recent Posts

రామ్ చరణ్ 17… లాంగ్ వెయిటింగ్ తప్పదు

పెద్ది విజయాన్ని ఆస్వాదిస్తున్న రామ్ చరణ్ త్వరలోనే చేతికి కీలకమైన సర్జరీ చేయించుకోబోతున్నాడు. ప్రమోషన్ల కోసమే దాన్ని బ్రేక్ వేస్తూ…

51 minutes ago

వరలక్ష్మి మీద మళ్ళీ ఆరోపణలు

ఆ మధ్య ఎస్ సరస్వతి సినిమా విడుదల టైంలో దర్శక నిర్మాత వరలక్ష్మి శరత్ కుమార్, రచయిత సాయి మాధవ్…

1 hour ago

బొంబాయి మాఫియాలో ‘బాలయ్య’ మాస్

వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని మళ్ళీ చేతులు కలిపారు. ప్రారంభం కావడంలో కొంత…

1 hour ago

‘దురంధర్’ చూసిన కళ్ళకు ‘ఆల్ఫా’ నచ్చేనా

ఎవరు ఔనన్నా కాదన్నా బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాగా దురంధర్ పేరు…

3 hours ago

అమరావతిలో రూ.2.5 వేల కోట్ల కేంద్ర ప్రాజెక్టు

అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి…

5 hours ago

మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్‌.. వైసీపీకి ఇర‌కాటం.. !

నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి.…

6 hours ago