ఏపీలో ఎన్నికల తర్వాత.. చెలరేగిన హింసపై జాతీయ స్థాయిలో చర్చసాగుతోంది. ఇప్పటి వరకు మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. దీనిలో కీలకమైన అత్యంత సమస్యాత్మకమైన జిల్లాలు, నగరాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కరడుగట్టిన మావోయిస్టుల అడ్డాల్లోనూ ఎన్నికల పోలింగ్ జరిగింది. అదేవిధంగా జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్(అత్యంత సమస్యాత్మక ప్రాంతం)లోనూ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక, పశ్చిమ బెంగాల్లో నాలుగో దశలో జరిగిన పోలింగ్లో 3 వేల పైచిలుకు పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
అయితే.. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఎక్కడా చిన్న బొట్టు రక్తం కూడా కారలేదు. రాళ్లు రువ్వుకోలేదు.. పోలీసులను కూడా కొట్టలేదు. కనీసం లాఠీ చార్జి ఘటనలు కూడా వెలుగు చూడలేదు. మరి అంత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోనే అంత ప్రశాంతంగా ఎన్నికలుజరిగినప్పుడు.. ఏపీలో ఎందుకు.. నాలుగోదశ పోలింగ్ తర్వాత.. ఇంత హింస చెలరేగింది? అనేది జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ. పల్నాడు ప్రాంతంలోని మూడు కీలక నియోజకవర్గాల్లో్ (మాచర్ల, పెదకూరపాడు, సత్తెనపల్లి) ఎందుకు విధ్వంసాలు జరుగుతున్నాయనేది ప్రశ్న. ఇదే విషయం జాతీయ స్థాయిలోనూ చర్చకు వచ్చింది.
జాతీయ మీడియా పెద్ద ఎత్తున ఏపీపై ఫోకస్ చేసింది. చిత్తూరులో జరిగిన ఘటనను పదే పదే ప్రసారం చేశాయి. అదేవిధంగా అనంతపురంలో ఏకంగా సీఐపైనే దాడి జరగడం.. రక్తమోడుతూనే ఆయన విధులు నిర్వహించడం వంటివి జాతీయస్థాయిలో చర్చకు వచ్చాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎందుకు అంచనా వేయలేక పోయారని సీఎస్, డీజీపీలను నిలదీసింది. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ హింసను నిలువరించాలని కోరారు. చంద్రబాబు అయితే.. పదే పదే ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు.
This post was last modified on May 16, 2024 3:21 pm
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…
అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…
ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…
యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…