ఏపీలో ఎన్నికల తర్వాత.. చెలరేగిన హింసపై జాతీయ స్థాయిలో చర్చసాగుతోంది. ఇప్పటి వరకు మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. దీనిలో కీలకమైన అత్యంత సమస్యాత్మకమైన జిల్లాలు, నగరాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కరడుగట్టిన మావోయిస్టుల అడ్డాల్లోనూ ఎన్నికల పోలింగ్ జరిగింది. అదేవిధంగా జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్(అత్యంత సమస్యాత్మక ప్రాంతం)లోనూ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక, పశ్చిమ బెంగాల్లో నాలుగో దశలో జరిగిన పోలింగ్లో 3 వేల పైచిలుకు పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
అయితే.. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఎక్కడా చిన్న బొట్టు రక్తం కూడా కారలేదు. రాళ్లు రువ్వుకోలేదు.. పోలీసులను కూడా కొట్టలేదు. కనీసం లాఠీ చార్జి ఘటనలు కూడా వెలుగు చూడలేదు. మరి అంత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోనే అంత ప్రశాంతంగా ఎన్నికలుజరిగినప్పుడు.. ఏపీలో ఎందుకు.. నాలుగోదశ పోలింగ్ తర్వాత.. ఇంత హింస చెలరేగింది? అనేది జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ. పల్నాడు ప్రాంతంలోని మూడు కీలక నియోజకవర్గాల్లో్ (మాచర్ల, పెదకూరపాడు, సత్తెనపల్లి) ఎందుకు విధ్వంసాలు జరుగుతున్నాయనేది ప్రశ్న. ఇదే విషయం జాతీయ స్థాయిలోనూ చర్చకు వచ్చింది.
జాతీయ మీడియా పెద్ద ఎత్తున ఏపీపై ఫోకస్ చేసింది. చిత్తూరులో జరిగిన ఘటనను పదే పదే ప్రసారం చేశాయి. అదేవిధంగా అనంతపురంలో ఏకంగా సీఐపైనే దాడి జరగడం.. రక్తమోడుతూనే ఆయన విధులు నిర్వహించడం వంటివి జాతీయస్థాయిలో చర్చకు వచ్చాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎందుకు అంచనా వేయలేక పోయారని సీఎస్, డీజీపీలను నిలదీసింది. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ హింసను నిలువరించాలని కోరారు. చంద్రబాబు అయితే.. పదే పదే ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు.
This post was last modified on May 16, 2024 3:21 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…