ఏపీలో ఎన్నికల తర్వాత.. చెలరేగిన హింసపై జాతీయ స్థాయిలో చర్చసాగుతోంది. ఇప్పటి వరకు మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. దీనిలో కీలకమైన అత్యంత సమస్యాత్మకమైన జిల్లాలు, నగరాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కరడుగట్టిన మావోయిస్టుల అడ్డాల్లోనూ ఎన్నికల పోలింగ్ జరిగింది. అదేవిధంగా జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్(అత్యంత సమస్యాత్మక ప్రాంతం)లోనూ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక, పశ్చిమ బెంగాల్లో నాలుగో దశలో జరిగిన పోలింగ్లో 3 వేల పైచిలుకు పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
అయితే.. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఎక్కడా చిన్న బొట్టు రక్తం కూడా కారలేదు. రాళ్లు రువ్వుకోలేదు.. పోలీసులను కూడా కొట్టలేదు. కనీసం లాఠీ చార్జి ఘటనలు కూడా వెలుగు చూడలేదు. మరి అంత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోనే అంత ప్రశాంతంగా ఎన్నికలుజరిగినప్పుడు.. ఏపీలో ఎందుకు.. నాలుగోదశ పోలింగ్ తర్వాత.. ఇంత హింస చెలరేగింది? అనేది జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ. పల్నాడు ప్రాంతంలోని మూడు కీలక నియోజకవర్గాల్లో్ (మాచర్ల, పెదకూరపాడు, సత్తెనపల్లి) ఎందుకు విధ్వంసాలు జరుగుతున్నాయనేది ప్రశ్న. ఇదే విషయం జాతీయ స్థాయిలోనూ చర్చకు వచ్చింది.
జాతీయ మీడియా పెద్ద ఎత్తున ఏపీపై ఫోకస్ చేసింది. చిత్తూరులో జరిగిన ఘటనను పదే పదే ప్రసారం చేశాయి. అదేవిధంగా అనంతపురంలో ఏకంగా సీఐపైనే దాడి జరగడం.. రక్తమోడుతూనే ఆయన విధులు నిర్వహించడం వంటివి జాతీయస్థాయిలో చర్చకు వచ్చాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎందుకు అంచనా వేయలేక పోయారని సీఎస్, డీజీపీలను నిలదీసింది. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ హింసను నిలువరించాలని కోరారు. చంద్రబాబు అయితే.. పదే పదే ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు.
This post was last modified on May 16, 2024 3:21 pm
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…