Political News

ఏపీ గురించి దేశం బాధ‌ప‌డుతోంది..

ఏపీలో ఎన్నిక‌ల త‌ర్వాత‌.. చెల‌రేగిన హింస‌పై జాతీయ స్థాయిలో చ‌ర్చ‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ద‌శ‌ల్లో ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. దీనిలో కీల‌క‌మైన అత్యంత స‌మ‌స్యాత్మ‌క‌మైన జిల్లాలు, న‌గ‌రాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు కూడా ఉన్నాయి. క‌ర‌డుగ‌ట్టిన మావోయిస్టుల అడ్డాల్లోనూ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. అదేవిధంగా జ‌మ్ము క‌శ్మీర్‌లోని శ్రీన‌గ‌ర్‌(అత్యంత స‌మ‌స్యాత్మ‌క ప్రాంతం)లోనూ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్‌లో నాలుగో ద‌శ‌లో జ‌రిగిన పోలింగ్లో 3 వేల పైచిలుకు పోలింగ్ కేంద్రాల‌ను అత్యంత స‌మస్యాత్మ‌క కేంద్రాలుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది.

అయితే.. అక్క‌డ ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేదు. ఎక్క‌డా చిన్న బొట్టు ర‌క్తం కూడా కార‌లేదు. రాళ్లు రువ్వుకోలేదు.. పోలీసుల‌ను కూడా కొట్ట‌లేదు. క‌నీసం లాఠీ చార్జి ఘ‌ట‌న‌లు కూడా వెలుగు చూడ‌లేదు. మ‌రి అంత్యంత స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లోనే అంత ప్ర‌శాంతంగా ఎన్నిక‌లుజ‌రిగిన‌ప్పుడు.. ఏపీలో ఎందుకు.. నాలుగోద‌శ పోలింగ్ త‌ర్వాత‌.. ఇంత హింస చెల‌రేగింది? అనేది జాతీయ స్థాయిలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ప‌ల్నాడు ప్రాంతంలోని మూడు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో్ (మాచ‌ర్ల‌, పెద‌కూర‌పాడు, స‌త్తెన‌పల్లి) ఎందుకు విధ్వంసాలు జ‌రుగుతున్నాయ‌నేది ప్ర‌శ్న‌. ఇదే విష‌యం జాతీయ స్థాయిలోనూ చ‌ర్చ‌కు వ‌చ్చింది.

జాతీయ మీడియా పెద్ద ఎత్తున ఏపీపై ఫోక‌స్ చేసింది. చిత్తూరులో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ప‌దే ప‌దే ప్ర‌సారం చేశాయి. అదేవిధంగా అనంత‌పురంలో ఏకంగా సీఐపైనే దాడి జ‌ర‌గడం.. ర‌క్త‌మోడుతూనే ఆయ‌న విధులు నిర్వ‌హించ‌డం వంటివి జాతీయ‌స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ అయింది. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ఎందుకు అంచ‌నా వేయ‌లేక పోయార‌ని సీఎస్‌, డీజీపీల‌ను నిల‌దీసింది. అదేవిధంగా ప్ర‌తిప‌క్షాలు కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ.. ఈ హింస‌ను నిలువ‌రించాల‌ని కోరారు. చంద్ర‌బాబు అయితే.. ప‌దే ప‌దే ఈ విష‌యంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు చేశారు.

This post was last modified on May 16, 2024 3:21 pm

Share

Recent Posts

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

26 minutes ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

48 minutes ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

2 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

3 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

3 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

4 hours ago