మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బెయిల్ మీద బయటకు రావడం ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నది. ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదరవుతాయి అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు.
ఇండియా కూటమి పార్టీల అభ్యర్థులకు మద్దతుగా కేజ్రివాల్ ఈ రోజు లక్నో, 16న జమ్షెడ్పూర్, 17న ముంబైలలో పర్యటించనున్నారు. ఢిల్లీలో ఏడు లోక్ సభ స్థానాలకు గాను ఆప్ నాలుగుచోట్ల పోటీ చేస్తోంది. కాంగ్రె్స్ మూడు స్థానాలలో పోటీ చేస్తుంది. ఢిల్లీలో ఆరో విడతలో భాగంగా ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్ పార్టీలు పంజాబ్ లో విడివిడిగా పోటి చేస్తుండడం గమనార్హం.
గత రెండు లోక్ సభ ఎన్నికలలో ఢిల్లీని బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రివాల్ 50 రోజులు జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆప్ శ్రేణులు ప్రచారంలో ఢీలాపడ్డాయి. కేజ్రివాల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆయన రాకతో ఆప్ శ్రేణులలో ఉత్సాహం నింపింది. సుదీర్ఘ కాలం నుంచి ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల మధ్య రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎంతవరకు జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పంజాబ్ లో సీఎం భగవంత్సింగ్ మాన్ అన్నీ తానై ప్రచారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడికి కేజ్రివాల్ ప్రచారానికి రాకపోవడమే మంచిది అని భావిస్తున్నారు. ఖదూర్ సాహిబ్ నుంచి స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది అమృత్ పాల్సింగ్కు బెయిల్ రాకపోవడం, కేజ్రీవాల్కు ప్రచారం కోసం బెయిల్ దొరకడం ఆప్కు ఇబ్బందికరం అని భావిస్తున్నారు.
This post was last modified on May 15, 2024 12:08 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…