మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బెయిల్ మీద బయటకు రావడం ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నది. ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదరవుతాయి అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు.
ఇండియా కూటమి పార్టీల అభ్యర్థులకు మద్దతుగా కేజ్రివాల్ ఈ రోజు లక్నో, 16న జమ్షెడ్పూర్, 17న ముంబైలలో పర్యటించనున్నారు. ఢిల్లీలో ఏడు లోక్ సభ స్థానాలకు గాను ఆప్ నాలుగుచోట్ల పోటీ చేస్తోంది. కాంగ్రె్స్ మూడు స్థానాలలో పోటీ చేస్తుంది. ఢిల్లీలో ఆరో విడతలో భాగంగా ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్ పార్టీలు పంజాబ్ లో విడివిడిగా పోటి చేస్తుండడం గమనార్హం.
గత రెండు లోక్ సభ ఎన్నికలలో ఢిల్లీని బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రివాల్ 50 రోజులు జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆప్ శ్రేణులు ప్రచారంలో ఢీలాపడ్డాయి. కేజ్రివాల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆయన రాకతో ఆప్ శ్రేణులలో ఉత్సాహం నింపింది. సుదీర్ఘ కాలం నుంచి ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల మధ్య రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎంతవరకు జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పంజాబ్ లో సీఎం భగవంత్సింగ్ మాన్ అన్నీ తానై ప్రచారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడికి కేజ్రివాల్ ప్రచారానికి రాకపోవడమే మంచిది అని భావిస్తున్నారు. ఖదూర్ సాహిబ్ నుంచి స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది అమృత్ పాల్సింగ్కు బెయిల్ రాకపోవడం, కేజ్రీవాల్కు ప్రచారం కోసం బెయిల్ దొరకడం ఆప్కు ఇబ్బందికరం అని భావిస్తున్నారు.
This post was last modified on May 15, 2024 12:08 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…