Political News

అప్పుడు కూడా ఇంతే.. ఈ ఓట‌ర్లు మ‌హా ముదుర్లు బ్రో!

“సేమ్ టు సేమ్‌..! అప్పుడు కూడా ఇంతే.. ఈ ఓట‌ర్లు మ‌హా ముదుర్లు బ్రో”- ఇదీ.. ఇప్పుడు ఏపీ పోలింగ్ స‌ర‌ళిపై ఏ ఇద్ద‌రు మాట్లాడుకుంటున్నా వినిపిస్తున్న మాట‌. 2019లోనూ ఇదే త‌ర‌హా పోలింగ్ ప్ర‌క్రియ జ‌రిగింది. అర్ధ‌రాత్రి 12 నుంచి 1 గంట వ‌ర‌కు కూడా పోలింగ్ జ‌రిగింది. క్యూలైన్ల‌లో మ‌హిళ‌లు వేచి ఉన్నారు. పైగా 2014తో పోల్చుకుంటే ఓటింగ్ శాతం కూడా పెరిగింది. 2014లో 77 శాతం పోలైతే.. 2019 నాటికి ఇది 79.04 శాతానికి ఎగ‌బాకింది. అంటే.. సుమారు 2 శాతం ఎక్కువ‌గానే పోలైంది.

ఇక‌, ఇప్పుడు కూడా అలాంటి ప‌రిస్థితే క‌ళ్ల‌కు క‌ట్టింది. అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత కూడా.. 3500 పోలింగ్ బూతుల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగింది. నెల్లూరు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని పోలింగ్ బూతుల్లో మ‌హిళ‌లు.. క్యూలైన్ల‌లో క‌నిపించారు. మొత్తంగా మంగ‌ళ‌వారం ఉద‌యానికి ర‌మార‌మి 81 శాతానికి పైగానే ఓట్లు పోల‌య్యాయ‌ని అంచనా(పూర్తి ఫ‌లితం బుధ‌వారం నాటికి వ‌స్తుంది). అంటే.. గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల‌కు మ‌ధ్య 2 శాతం ఎక్కువ‌గా పోలింగ్ న‌మోదైంది.

దీంతో ఇప్పుడు ఏం జ‌రుగుతుంది. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌బుత్వాన్ని మార్చే ఉద్దేశంతో ఓట‌ర్లు పోటెత్తార‌ని వైసీపీ నేత‌లు అనుకున్నారు.కానీ, తాము ఇచ్చిన ప‌సుపు-కుంకుమ కింద రూ.10 వేల‌ ప్ర‌భావంతోనే ఓటింగ్ శాతం పెరిగింద‌ని టీడీపీ చెప్పింది.చంద్ర‌బాబు అయితే.. పోలింగ్ జ‌రిగిన అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌కు సీఎం హోదాలో ప్రెస్ మీట్ పెట్టి 1 గంట వ‌రకు జిల్లాల వారీగా స‌ర‌ళిని వివ‌రించారు. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుంది? ఇదీ.. ఇప్పుడు న‌రాలు తెగే టెన్ష‌న్ పుట్టేలా చేసింది.

దీనిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే. గ‌త ఎన్నిక‌ల పోలింగ్‌తో పోల్చుకుని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. కూట‌మి ఎన్నిక‌ల ప్ర‌చారం.. జ‌న‌సేన దూకుడు, బీజేపీ క‌ల‌యిక వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఇదేస‌మ‌యంలో వైసీపీ అనుకూల వ‌ర్గంలో విశ్వ‌స‌నీయ‌త‌, జ‌గ‌న్‌పై న‌మ్మ‌కం వంటివాటిని తెర‌మీదికి తెస్తున్నారు. కానీ, ఓటేసిన ప్ర‌జ‌లు మాత్రం సైలెంట్‌గా ఎవ‌రి ప‌ని వారు చేసుకుంటున్నారు. మొత్తంగా ఈవీఎంలు మాట్లాడితే త‌ప్ప‌.. నిజాలు బ‌య‌ట‌కురావు. అప్ప‌టి వ‌ర‌కు ఈ టెన్ష‌న్ అనేక మ‌లుపులు తిరుగుతూనే ఉంటుంది.

This post was last modified on May 15, 2024 10:18 am

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

17 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

1 hour ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

2 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

2 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

3 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

5 hours ago