Political News

అప్పుడు కూడా ఇంతే.. ఈ ఓట‌ర్లు మ‌హా ముదుర్లు బ్రో!

“సేమ్ టు సేమ్‌..! అప్పుడు కూడా ఇంతే.. ఈ ఓట‌ర్లు మ‌హా ముదుర్లు బ్రో”- ఇదీ.. ఇప్పుడు ఏపీ పోలింగ్ స‌ర‌ళిపై ఏ ఇద్ద‌రు మాట్లాడుకుంటున్నా వినిపిస్తున్న మాట‌. 2019లోనూ ఇదే త‌ర‌హా పోలింగ్ ప్ర‌క్రియ జ‌రిగింది. అర్ధ‌రాత్రి 12 నుంచి 1 గంట వ‌ర‌కు కూడా పోలింగ్ జ‌రిగింది. క్యూలైన్ల‌లో మ‌హిళ‌లు వేచి ఉన్నారు. పైగా 2014తో పోల్చుకుంటే ఓటింగ్ శాతం కూడా పెరిగింది. 2014లో 77 శాతం పోలైతే.. 2019 నాటికి ఇది 79.04 శాతానికి ఎగ‌బాకింది. అంటే.. సుమారు 2 శాతం ఎక్కువ‌గానే పోలైంది.

ఇక‌, ఇప్పుడు కూడా అలాంటి ప‌రిస్థితే క‌ళ్ల‌కు క‌ట్టింది. అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత కూడా.. 3500 పోలింగ్ బూతుల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగింది. నెల్లూరు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని పోలింగ్ బూతుల్లో మ‌హిళ‌లు.. క్యూలైన్ల‌లో క‌నిపించారు. మొత్తంగా మంగ‌ళ‌వారం ఉద‌యానికి ర‌మార‌మి 81 శాతానికి పైగానే ఓట్లు పోల‌య్యాయ‌ని అంచనా(పూర్తి ఫ‌లితం బుధ‌వారం నాటికి వ‌స్తుంది). అంటే.. గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల‌కు మ‌ధ్య 2 శాతం ఎక్కువ‌గా పోలింగ్ న‌మోదైంది.

దీంతో ఇప్పుడు ఏం జ‌రుగుతుంది. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌బుత్వాన్ని మార్చే ఉద్దేశంతో ఓట‌ర్లు పోటెత్తార‌ని వైసీపీ నేత‌లు అనుకున్నారు.కానీ, తాము ఇచ్చిన ప‌సుపు-కుంకుమ కింద రూ.10 వేల‌ ప్ర‌భావంతోనే ఓటింగ్ శాతం పెరిగింద‌ని టీడీపీ చెప్పింది.చంద్ర‌బాబు అయితే.. పోలింగ్ జ‌రిగిన అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌కు సీఎం హోదాలో ప్రెస్ మీట్ పెట్టి 1 గంట వ‌రకు జిల్లాల వారీగా స‌ర‌ళిని వివ‌రించారు. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుంది? ఇదీ.. ఇప్పుడు న‌రాలు తెగే టెన్ష‌న్ పుట్టేలా చేసింది.

దీనిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే. గ‌త ఎన్నిక‌ల పోలింగ్‌తో పోల్చుకుని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. కూట‌మి ఎన్నిక‌ల ప్ర‌చారం.. జ‌న‌సేన దూకుడు, బీజేపీ క‌ల‌యిక వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఇదేస‌మ‌యంలో వైసీపీ అనుకూల వ‌ర్గంలో విశ్వ‌స‌నీయ‌త‌, జ‌గ‌న్‌పై న‌మ్మ‌కం వంటివాటిని తెర‌మీదికి తెస్తున్నారు. కానీ, ఓటేసిన ప్ర‌జ‌లు మాత్రం సైలెంట్‌గా ఎవ‌రి ప‌ని వారు చేసుకుంటున్నారు. మొత్తంగా ఈవీఎంలు మాట్లాడితే త‌ప్ప‌.. నిజాలు బ‌య‌ట‌కురావు. అప్ప‌టి వ‌ర‌కు ఈ టెన్ష‌న్ అనేక మ‌లుపులు తిరుగుతూనే ఉంటుంది.

This post was last modified on May 15, 2024 10:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

42 minutes ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

5 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

7 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

11 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

13 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

13 hours ago