ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగుల జోరు ఎక్కువ.! నెల్లూరు జిల్లాలో అయితే ఓ ప్రజా ప్రతినిథి నేతృత్వంలోనే బెట్టింగులు జరుగుతుంటాయ్. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ, చిత్తూరు జిల్లాలోనూ, విశాఖ, కర్నూలు జిల్లాల్లోనూ బెట్టింగులు తక్కువేం కాదు.
ఐపీఎల్ బెట్టింగుల కంటే జోరుగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా జోరుగా పొలిటికల్ బెట్టింగులు జరిగాయి. పిఠాపురం, మంగళగిరి, కుప్పం నియోజకవర్గాలకు సంబంధించి పొలిటికల్ బెట్టింగులు అనూహ్యమైన రీతిలో జరిగినట్లు తెలుస్తోంది.
ఇక, తాజాగా జనసేన పార్టీకి సంబంధించిన స్ట్రైక్ రేట్ మీద బెట్టింగులు ఊపందుకున్నాయి. 98 శాతం స్ట్రైక్ రేట్.. అనే మాట, టీడీపీ – జనసేన మధ్య పొత్తుల సందర్భంగా సీట్ల పంపకాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చింది.
రాజకీయాల్లో స్ట్రైక్ రేట్ అనే మాట చాలా చాలా అరుదుగా వాడుతుంటారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణే తొలిసారిగా వాడారేమో కూడా.! చాలామంది మొదట ఈ 98 శాతం స్ట్రైక్ రేట్ వ్యవహారంపై నవ్వుకున్నారు. కానీ, ఆ స్ట్రైక్ రేట్ మీదనే బెట్టింగులు జరుగుతున్నాయిప్పుడు.
80 నుంచి 85 శాతం స్ట్రైక్ రేట్ చుట్టూ ఎక్కువ బెట్టింగులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. పిఠాపురంలో జనసేనాని సాధించబోయే మెజార్టీ మీద బెట్టింగుల కంటే కూడా ఈ స్ట్రైక్ రేట్ చుట్టూనే బెట్టింగులు జరుగుతున్నాయి. ఆ స్ట్రైక్ రేట్ ప్రకారం జనసేన పార్టీకి 15 నుంచి 18 అసెంబ్లీ సీట్లు రావాల్సి వుంది.
వైసీపీ అంతర్గత సర్వేల్లో కూడా జనసేన గెలవబోయే సీట్ల సంఖ్య ఇదేనని తేలుతుండడం ఆసక్తికరమైన అంశం.
This post was last modified on May 14, 2024 4:45 pm
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…