Political News

జనసేన స్ట్రైక్ రేట్ మీద జోరుగా బెట్టింగులు.!

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగుల జోరు ఎక్కువ.! నెల్లూరు జిల్లాలో అయితే ఓ ప్రజా ప్రతినిథి నేతృత్వంలోనే బెట్టింగులు జరుగుతుంటాయ్. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ, చిత్తూరు జిల్లాలోనూ, విశాఖ, కర్నూలు జిల్లాల్లోనూ బెట్టింగులు తక్కువేం కాదు.

ఐపీఎల్ బెట్టింగుల కంటే జోరుగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా జోరుగా పొలిటికల్ బెట్టింగులు జరిగాయి. పిఠాపురం, మంగళగిరి, కుప్పం నియోజకవర్గాలకు సంబంధించి పొలిటికల్ బెట్టింగులు అనూహ్యమైన రీతిలో జరిగినట్లు తెలుస్తోంది.

ఇక, తాజాగా జనసేన పార్టీకి సంబంధించిన స్ట్రైక్ రేట్ మీద బెట్టింగులు ఊపందుకున్నాయి. 98 శాతం స్ట్రైక్ రేట్.. అనే మాట, టీడీపీ – జనసేన మధ్య పొత్తుల సందర్భంగా సీట్ల పంపకాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చింది.

రాజకీయాల్లో స్ట్రైక్ రేట్ అనే మాట చాలా చాలా అరుదుగా వాడుతుంటారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణే తొలిసారిగా వాడారేమో కూడా.! చాలామంది మొదట ఈ 98 శాతం స్ట్రైక్ రేట్ వ్యవహారంపై నవ్వుకున్నారు. కానీ, ఆ స్ట్రైక్ రేట్ మీదనే బెట్టింగులు జరుగుతున్నాయిప్పుడు.

80 నుంచి 85 శాతం స్ట్రైక్ రేట్ చుట్టూ ఎక్కువ బెట్టింగులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. పిఠాపురంలో జనసేనాని సాధించబోయే మెజార్టీ మీద బెట్టింగుల కంటే కూడా ఈ స్ట్రైక్ రేట్ చుట్టూనే బెట్టింగులు జరుగుతున్నాయి. ఆ స్ట్రైక్ రేట్ ప్రకారం జనసేన పార్టీకి 15 నుంచి 18 అసెంబ్లీ సీట్లు రావాల్సి వుంది.

వైసీపీ అంతర్గత సర్వేల్లో కూడా జనసేన గెలవబోయే సీట్ల సంఖ్య ఇదేనని తేలుతుండడం ఆసక్తికరమైన అంశం.

This post was last modified on May 14, 2024 4:45 pm

Share
Show comments
Published by
Satya
Tags: Janasena

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

2 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

3 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

6 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago