ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగుల జోరు ఎక్కువ.! నెల్లూరు జిల్లాలో అయితే ఓ ప్రజా ప్రతినిథి నేతృత్వంలోనే బెట్టింగులు జరుగుతుంటాయ్. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ, చిత్తూరు జిల్లాలోనూ, విశాఖ, కర్నూలు జిల్లాల్లోనూ బెట్టింగులు తక్కువేం కాదు.
ఐపీఎల్ బెట్టింగుల కంటే జోరుగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా జోరుగా పొలిటికల్ బెట్టింగులు జరిగాయి. పిఠాపురం, మంగళగిరి, కుప్పం నియోజకవర్గాలకు సంబంధించి పొలిటికల్ బెట్టింగులు అనూహ్యమైన రీతిలో జరిగినట్లు తెలుస్తోంది.
ఇక, తాజాగా జనసేన పార్టీకి సంబంధించిన స్ట్రైక్ రేట్ మీద బెట్టింగులు ఊపందుకున్నాయి. 98 శాతం స్ట్రైక్ రేట్.. అనే మాట, టీడీపీ – జనసేన మధ్య పొత్తుల సందర్భంగా సీట్ల పంపకాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చింది.
రాజకీయాల్లో స్ట్రైక్ రేట్ అనే మాట చాలా చాలా అరుదుగా వాడుతుంటారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణే తొలిసారిగా వాడారేమో కూడా.! చాలామంది మొదట ఈ 98 శాతం స్ట్రైక్ రేట్ వ్యవహారంపై నవ్వుకున్నారు. కానీ, ఆ స్ట్రైక్ రేట్ మీదనే బెట్టింగులు జరుగుతున్నాయిప్పుడు.
80 నుంచి 85 శాతం స్ట్రైక్ రేట్ చుట్టూ ఎక్కువ బెట్టింగులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. పిఠాపురంలో జనసేనాని సాధించబోయే మెజార్టీ మీద బెట్టింగుల కంటే కూడా ఈ స్ట్రైక్ రేట్ చుట్టూనే బెట్టింగులు జరుగుతున్నాయి. ఆ స్ట్రైక్ రేట్ ప్రకారం జనసేన పార్టీకి 15 నుంచి 18 అసెంబ్లీ సీట్లు రావాల్సి వుంది.
వైసీపీ అంతర్గత సర్వేల్లో కూడా జనసేన గెలవబోయే సీట్ల సంఖ్య ఇదేనని తేలుతుండడం ఆసక్తికరమైన అంశం.
This post was last modified on May 14, 2024 4:45 pm
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…