ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడో సారి కూడా వారణాసి నియోజకవర్గం నుంచి తన నామినేషన్ సమర్పించారు. సొంత రాష్ట్రం గుజరాత్ను కాదని.. ఆయన యూపీలోని వారణాసిని 2014లో ఎంచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన వరుసగా రెండు సార్లు విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా అక్కడ నుంచే మూడో సారి పోటీకి రెడీ అయ్యారు. ఐదో దశ ఎన్నికల్లో ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మోడీ నామినేషన్ మంగళవారం దాఖలు చేశారు.
దీనికి సంబంధించి.. ఎప్పటి లాగానే మోడీ సెంటిమెంటు అస్త్రం ప్రయోగించారు. ఎంపీ అభ్యర్థులను నలుగురు బలపరచాల్సి ఉంటుంది. అయితే.. మోడీ ఎప్పుడూ.. ఆ నలుగురిని వివిధ కులాలకు చెందిన వారి నుంచి ఎంచుకుంటారు. అలానే ఇప్పుడు కూడా.. ఓబీసీ, ఎస్సీ, ఓసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని ఆయన ప్రతిపాదించేలా చేసుకున్నారు. ఇక, మోడీ నామినేషన్ ఘట్టం ముందుగానే నిర్ణయించుకున్నట్టు అంగరంగ వైభవంగా జరిగింది.
బీజేపీ సహా ఎన్టీయే పక్షాలకు చెందిన 100 మంది నాయకులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు మద్దతుగా నిలిచారు.
చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మోడీ నామినేషన్ వేయడాన్ని ఒక చరిత్రాత్మక సందర్భంగా బాబు అభివర్ణించారు. వారణాసిని పవిత్ర ప్రదేశంగా పేర్కొన్న ఆయన.. మూడో సారి మోడీ ఇక్కడ నుంచి గెలవడం ఖాయమని చెప్పారు. గత పదేళ్లలో వారణాసి నియోజకవర్గం రూపు రేఖలను మోడీ ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దారని చెప్పారు. ఎన్డీయే కూటమి మోడీ నేతృత్వంలో 400 సీట్లను గెలుచుకోవడం పెద్ద కష్టం కాదని ఆయన పేర్కొన్నారు.
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…