ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడో సారి కూడా వారణాసి నియోజకవర్గం నుంచి తన నామినేషన్ సమర్పించారు. సొంత రాష్ట్రం గుజరాత్ను కాదని.. ఆయన యూపీలోని వారణాసిని 2014లో ఎంచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన వరుసగా రెండు సార్లు విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా అక్కడ నుంచే మూడో సారి పోటీకి రెడీ అయ్యారు. ఐదో దశ ఎన్నికల్లో ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మోడీ నామినేషన్ మంగళవారం దాఖలు చేశారు.
దీనికి సంబంధించి.. ఎప్పటి లాగానే మోడీ సెంటిమెంటు అస్త్రం ప్రయోగించారు. ఎంపీ అభ్యర్థులను నలుగురు బలపరచాల్సి ఉంటుంది. అయితే.. మోడీ ఎప్పుడూ.. ఆ నలుగురిని వివిధ కులాలకు చెందిన వారి నుంచి ఎంచుకుంటారు. అలానే ఇప్పుడు కూడా.. ఓబీసీ, ఎస్సీ, ఓసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని ఆయన ప్రతిపాదించేలా చేసుకున్నారు. ఇక, మోడీ నామినేషన్ ఘట్టం ముందుగానే నిర్ణయించుకున్నట్టు అంగరంగ వైభవంగా జరిగింది.
బీజేపీ సహా ఎన్టీయే పక్షాలకు చెందిన 100 మంది నాయకులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు మద్దతుగా నిలిచారు.
చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మోడీ నామినేషన్ వేయడాన్ని ఒక చరిత్రాత్మక సందర్భంగా బాబు అభివర్ణించారు. వారణాసిని పవిత్ర ప్రదేశంగా పేర్కొన్న ఆయన.. మూడో సారి మోడీ ఇక్కడ నుంచి గెలవడం ఖాయమని చెప్పారు. గత పదేళ్లలో వారణాసి నియోజకవర్గం రూపు రేఖలను మోడీ ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దారని చెప్పారు. ఎన్డీయే కూటమి మోడీ నేతృత్వంలో 400 సీట్లను గెలుచుకోవడం పెద్ద కష్టం కాదని ఆయన పేర్కొన్నారు.
This post was last modified on May 14, 2024 4:22 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…