ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడో సారి కూడా వారణాసి నియోజకవర్గం నుంచి తన నామినేషన్ సమర్పించారు. సొంత రాష్ట్రం గుజరాత్ను కాదని.. ఆయన యూపీలోని వారణాసిని 2014లో ఎంచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన వరుసగా రెండు సార్లు విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా అక్కడ నుంచే మూడో సారి పోటీకి రెడీ అయ్యారు. ఐదో దశ ఎన్నికల్లో ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మోడీ నామినేషన్ మంగళవారం దాఖలు చేశారు.
దీనికి సంబంధించి.. ఎప్పటి లాగానే మోడీ సెంటిమెంటు అస్త్రం ప్రయోగించారు. ఎంపీ అభ్యర్థులను నలుగురు బలపరచాల్సి ఉంటుంది. అయితే.. మోడీ ఎప్పుడూ.. ఆ నలుగురిని వివిధ కులాలకు చెందిన వారి నుంచి ఎంచుకుంటారు. అలానే ఇప్పుడు కూడా.. ఓబీసీ, ఎస్సీ, ఓసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని ఆయన ప్రతిపాదించేలా చేసుకున్నారు. ఇక, మోడీ నామినేషన్ ఘట్టం ముందుగానే నిర్ణయించుకున్నట్టు అంగరంగ వైభవంగా జరిగింది.
బీజేపీ సహా ఎన్టీయే పక్షాలకు చెందిన 100 మంది నాయకులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు మద్దతుగా నిలిచారు.
చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మోడీ నామినేషన్ వేయడాన్ని ఒక చరిత్రాత్మక సందర్భంగా బాబు అభివర్ణించారు. వారణాసిని పవిత్ర ప్రదేశంగా పేర్కొన్న ఆయన.. మూడో సారి మోడీ ఇక్కడ నుంచి గెలవడం ఖాయమని చెప్పారు. గత పదేళ్లలో వారణాసి నియోజకవర్గం రూపు రేఖలను మోడీ ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దారని చెప్పారు. ఎన్డీయే కూటమి మోడీ నేతృత్వంలో 400 సీట్లను గెలుచుకోవడం పెద్ద కష్టం కాదని ఆయన పేర్కొన్నారు.
This post was last modified on May 14, 2024 4:22 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…