ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడో సారి కూడా వారణాసి నియోజకవర్గం నుంచి తన నామినేషన్ సమర్పించారు. సొంత రాష్ట్రం గుజరాత్ను కాదని.. ఆయన యూపీలోని వారణాసిని 2014లో ఎంచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన వరుసగా రెండు సార్లు విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా అక్కడ నుంచే మూడో సారి పోటీకి రెడీ అయ్యారు. ఐదో దశ ఎన్నికల్లో ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మోడీ నామినేషన్ మంగళవారం దాఖలు చేశారు.
దీనికి సంబంధించి.. ఎప్పటి లాగానే మోడీ సెంటిమెంటు అస్త్రం ప్రయోగించారు. ఎంపీ అభ్యర్థులను నలుగురు బలపరచాల్సి ఉంటుంది. అయితే.. మోడీ ఎప్పుడూ.. ఆ నలుగురిని వివిధ కులాలకు చెందిన వారి నుంచి ఎంచుకుంటారు. అలానే ఇప్పుడు కూడా.. ఓబీసీ, ఎస్సీ, ఓసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని ఆయన ప్రతిపాదించేలా చేసుకున్నారు. ఇక, మోడీ నామినేషన్ ఘట్టం ముందుగానే నిర్ణయించుకున్నట్టు అంగరంగ వైభవంగా జరిగింది.
బీజేపీ సహా ఎన్టీయే పక్షాలకు చెందిన 100 మంది నాయకులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు మద్దతుగా నిలిచారు.
చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మోడీ నామినేషన్ వేయడాన్ని ఒక చరిత్రాత్మక సందర్భంగా బాబు అభివర్ణించారు. వారణాసిని పవిత్ర ప్రదేశంగా పేర్కొన్న ఆయన.. మూడో సారి మోడీ ఇక్కడ నుంచి గెలవడం ఖాయమని చెప్పారు. గత పదేళ్లలో వారణాసి నియోజకవర్గం రూపు రేఖలను మోడీ ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దారని చెప్పారు. ఎన్డీయే కూటమి మోడీ నేతృత్వంలో 400 సీట్లను గెలుచుకోవడం పెద్ద కష్టం కాదని ఆయన పేర్కొన్నారు.
This post was last modified on May 14, 2024 4:22 pm
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…