రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఏమైనా కావొచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలోనూ ఇదే చర్చ సాగుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత.. కూటమి అధికారంలోకి వస్తుందన్న టాక్ జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉండి నియోజకవర్గంలో ఆసక్తికర విషయం చర్చగా మారింది. కూటమి గెలిచి.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే.. తన మంత్రివర్గంలో రఘురామ కృష్ణరాజుకు అవకాశం కల్పిస్తారని ఇక్కడ చర్చ సాగుతుండడం గమనార్హం.
రఘురామ తరఫున ఉన్న అనుచర వర్గం కూడా ఇదే చెబుతోంది. ఇక, నియోజకవర్గంలోనూ జోరుగా ఇదే విషయంపై చర్చ సాగుతోంది. వైసీపీని ఎదిరించడంతోపాటు.. ఐదేళ్లపాటు.. వైసీపీని ఇరుకున పెట్టి.. టీడీపీ తరఫున ప్రత్యక్షంగా, పరోక్షంగా వాయిస్ వినిపించారు రఘురామ. అందుకే..ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోయినా.. చంద్రబాబు పట్టుబట్టి.. తన వారిని ఒప్పించి మరీ ఉండి నుంచి రఘురామకు అవకాశం కల్పించారు. ఇక్కడ రఘురామ కూడా బాగానే ప్రచారం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో అటు కూటమి సర్కారు ఏర్పాటు, ఇటు రఘరామ గెలుపు ఖాయమని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో చంద్రబాబుకు అండగా ఉండేలా.. ముఖ్యంగా ప్రతిపక్షంగా మారే వైసీపీని మరింత ఇరుకున పెట్టేలా.. ఊపిరి సలపకుండా చేయాలంటే.. రఘురామ వంటి ఫైర్బ్రాండ్ను తన మంత్రివర్గంలో పెట్టుకుంటే చంద్రబాబుకు కలిసి వస్తుందని.. ఆయన స్వేచ్ఛగా పాలనపై దృష్టి పెడితే.. ప్రతిపక్షం సంగతిని రఘురామ చూసుకుంటారని.. ఆయన వర్గం చెబుతోంది.
అందుకే రఘురామకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ఆయన అనుచరులు విశ్వసిస్తున్నారు. నియోజకవర్గంలోని క్షత్రియ సామాజిక వర్గంలోనూ ఎన్నికలకు ముందు నాలుగు రోజులు కూడా ఇదే తరహా ప్రచారం జరిగింది. దీంతో రఘురామ మంత్రి కావడం ఖాయమనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. అయితే.. ఇక్కడ మరో చిక్కు ఉంది. పిఠాపురంలో సీటు త్యాగం చేసిన సత్యనారాయణ వర్మకు కూడా.. చంద్రబాబు మంత్రిపదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టు ప్రచారం ఉంది. మరి ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తారా? అనేది కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…