ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం దాదాపు ముగిసింది. ఈ వార్త రాసే సమయానికి ఇంకా కొన్ని చోట్ల మాత్రమే పోలింగ్ జరుగుతోంది. అయితే.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్లో్ రాత్రి 8 గంటల సమయానికి మొత్తం 72 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఇది కొద్దిగా అటు ఇటు మారే అవకాశం ఉంది. అంటే మొత్తంగా 75 శాతానికి చేరే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ అంచనాలు మారుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ మార్పు తప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలావుంటే.. ప్రస్తుత ఓటింగ్ సరళి, పోలింగ్ శాతం పెరగడంపై అధికార పక్షం వైసీపీలో మౌనం ఆవహించింది. ఒకరిద్దరు నాయ కులు మాట్లాడుతున్నా.. వారిలో సంతోషం సన్నగిల్లింది. అంతేకాదు.. ముఖంలోనూ కళ లేనట్టే ఉంది. సజ్జల రామకృష్నారెడ్డి, విజయసాయిరెడ్డి, పేర్ని నాని వంటివారు మీడియాతో మాట్లాడినా… పెద్దగా ఉత్సాహం అయితే.. కనిపించలేదు. అంతేకాదు.. ధైర్యంగా కూడా వారు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం 2019లో 79 శాతం పోలింగ్ నమోదైంది. ఇది .. అప్పటి ప్రతిపక్షానికి కలిసి వచ్చింది. దీంతో వైసీపీలో మరింత డీలా కనిపించింది.
ఎందుకంటే 70 శాతానికి మించి పోలింగ్ నమోదైతే.. అది ప్రతిపక్షానికి కలిసి వస్తుందనే లెక్కలు వస్తుండడమే. మరోవైపు.. యువత పోటెత్తారు. కొత్తగా ఓటు హక్కు దక్కించుకున్నవారు కూడా ఈ దఫా ఓటేశారు. అందుకే పోలింగ్ కేంద్రాల్లో ఆలస్యం జరిగిందని ఎన్నికల సంఘం కూడా పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో జోష్ కనిపించడం లేదు. ఇదిలా వుంటే.. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్ష కూటమి పార్టీ టీడీపీలో మాత్రం జోష్ కనిపిస్తోంది. చంద్రబాబు, నారా లోకేష్లు.. విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ.. ఓటర్లకు అప్పుడే శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలిపారు.
ఇక, కూటమిలో మరో పార్టీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. ఇదే వ్యాఖ్య చేశారు. ఓటింగ్ శాతం పెరుగుతుండడం సంతోషమని.. ఇది కూటమి విజయానికి ప్రజలు ఇస్తున్న ఆశీర్వాదమని ఆయన పేర్కొన్నారు. సో.. మొత్తంలో ఏపీలో అధికార పార్టీ డీలా పడడం, విపక్షంలో జోష్ కనిపించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. అయితే..వాస్తవ ఫలితం కోసం 21 రోజులు అంటే జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయక తప్పదు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…