Political News

వైసీపీలో మౌనం.. కూట‌మి శిబిరంలో జోష్‌..

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల సమ‌రం దాదాపు ముగిసింది. ఈ వార్త రాసే స‌మ‌యానికి ఇంకా కొన్ని చోట్ల మాత్ర‌మే పోలింగ్ జ‌రుగుతోంది. అయితే.. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన పోలింగ్‌లో్ రాత్రి 8 గంట‌ల స‌మ‌యానికి మొత్తం 72 శాతానికి పైగా పోలింగ్ న‌మోదైంది. ఇది కొద్దిగా అటు ఇటు మారే అవ‌కాశం ఉంది. అంటే మొత్తంగా 75 శాతానికి చేరే చాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కూడా స్ప‌ష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో రాజ‌కీయ అంచ‌నాలు మారుతున్నాయ‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. అధికార పార్టీ మార్పు త‌ప్ప‌ద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇదిలావుంటే.. ప్ర‌స్తుత ఓటింగ్ స‌ర‌ళి, పోలింగ్ శాతం పెర‌గ‌డంపై అధికార ప‌క్షం వైసీపీలో మౌనం ఆవ‌హించింది. ఒక‌రిద్ద‌రు నాయ కులు మాట్లాడుతున్నా.. వారిలో సంతోషం సన్న‌గిల్లింది. అంతేకాదు.. ముఖంలోనూ క‌ళ లేన‌ట్టే ఉంది. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, పేర్ని నాని వంటివారు మీడియాతో మాట్లాడినా… పెద్ద‌గా ఉత్సాహం అయితే.. క‌నిపించ‌లేదు. అంతేకాదు.. ధైర్యంగా కూడా వారు ఏమీ చెప్ప‌లేని ప‌రిస్థితిలో ఉన్నారు. మ‌రోవైపు ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం 2019లో 79 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది .. అప్ప‌టి ప్ర‌తిప‌క్షానికి క‌లిసి వ‌చ్చింది. దీంతో వైసీపీలో మ‌రింత డీలా క‌నిపించింది.

ఎందుకంటే 70 శాతానికి మించి పోలింగ్ న‌మోదైతే.. అది ప్ర‌తిప‌క్షానికి క‌లిసి వ‌స్తుంద‌నే లెక్క‌లు వ‌స్తుండ‌డ‌మే. మ‌రోవైపు.. యువ‌త పోటెత్తారు. కొత్త‌గా ఓటు హ‌క్కు ద‌క్కించుకున్న‌వారు కూడా ఈ ద‌ఫా ఓటేశారు. అందుకే పోలింగ్ కేంద్రాల్లో ఆల‌స్యం జ‌రిగింద‌ని ఎన్నిక‌ల సంఘం కూడా పేర్కొంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీలో జోష్ క‌నిపించ‌డం లేదు. ఇదిలా వుంటే.. మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష కూట‌మి పార్టీ టీడీపీలో మాత్రం జోష్ క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు, నారా లోకేష్‌లు.. విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేస్తూ.. ఓట‌ర్ల‌కు అప్పుడే శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు కూడా తెలిపారు.

ఇక‌, కూట‌మిలో మ‌రో పార్టీ జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా.. ఇదే వ్యాఖ్య చేశారు. ఓటింగ్ శాతం పెరుగుతుండ‌డం సంతోష‌మ‌ని.. ఇది కూట‌మి విజ‌యానికి ప్ర‌జ‌లు ఇస్తున్న ఆశీర్వాద‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. సో.. మొత్తంలో ఏపీలో అధికార పార్టీ డీలా ప‌డ‌డం, విప‌క్షంలో జోష్ క‌నిపించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. అయితే..వాస్త‌వ ఫ‌లితం కోసం 21 రోజులు అంటే జూన్ 4వ తేదీ వ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

This post was last modified on May 14, 2024 7:16 am

Share

Recent Posts

న‌మ్మ‌కం లేన‌ప్పుడు.. బాబు చేసిన‌ట్టు చేయొచ్చుగా జ‌గ‌న్‌!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ త‌ర‌చుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల నిర్వహ‌ణ…

6 minutes ago

కసబ్ కు వాళ్లకు తేడా లేదు

స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…

12 minutes ago

అది నిజ‌మైతే.. వైసీపీ ఖాళీ అవుతుందా?

వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాట‌లు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్న‌ట్టుగానే పార్టీ అధినేత జ‌గ‌న్…

5 hours ago

గీత గోవిందం దర్శకుడికి బ్రేక్ దొరికింది

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…

8 hours ago

మంత్రి ఎదుట జెండాలు పట్టుకుని రోబోల నిరసన..!

"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…

9 hours ago

సూర్యని ఊరిస్తున్న ట్రిపుల్ మైలురాయి

మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…

9 hours ago