Political News

రాష్ట్రానికి చ‌రిత్రాత్మ‌క రోజు:  చంద్ర‌బాబు

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రాష్ట్రానికి ఇది చ‌రిత్రాత్మ‌క రోజు అని అభివ‌ర్ణించారు. ప్ర‌జ‌ల ప‌ట్టుద‌ల‌, నిర్ణ‌యాత్మ‌క శైలి వంటివి పోలింగ్ స‌మ‌యంలో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని.. ఇవి స్ఫూర్తిదాయ‌క‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు బారులు తీరిన క్యూల‌లో ఎంతో ఓపిక‌గా వేచి ఉన్నార‌ని.. తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘం ఆయా పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌక‌ర్యం ఏర్పాటు చేయ‌డంతోపాటు త‌గిన వ‌స‌తులు క‌ల్పించాల‌ని ఆయ‌న విన్న‌వించారు. ఈ మేర‌కు చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.

కాగా, రాష్ట్రంలో సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ అన్ని ప్రాంతాల్లోనూ సాయంత్రం ఆరు త‌ర్వాత కూడా కొన‌సాగింది. ఉద‌యం కొంత ఎండ ఉండ‌డంతో ఓట‌ర్లు వెనుకాడినా.. 11 గంట‌ల‌కే విజృంభించారు. ఆ త‌ర్వాత‌.. ఒక గంట కొంత మేర‌కు మంద‌కొడిగా సాగింది. అయితే.. వాతావ‌ర‌ణం అనుకూలించ‌డంతో(ఒక‌టి రెండు ప్రాంతాల్లో ఈదురు గాలులు వ‌ర్షాలు కురిశాయి. బాప‌ట్ల‌, తిరుప‌తిలాంటి చోట‌) మ‌ళ్లీ ఓట‌ర్లు పోలింగ్ కేంద్రాల‌కు క్యూ క‌ట్టారు. దీంతో సాయంత్రం ఆరు త‌ర్వాత‌.. కూడా పెద్ద ఎత్తున క్యూలైన్ల‌లో ఉన్నారు.

వాస్త‌వానికి షెడ్యూల్ ప్ర‌కారం సాయంత్రం 6గంట‌ల‌కే పోలింగ్ స‌మ‌యం అయిపోతుంది.అయినా.. ఓటర్ల ఉత్సాహం నేప‌థ్యంలో ఈ స‌మ‌యాన్ని పొడిగిస్తున్న‌ట్టురాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు సైతం పేర్కొన్నారు. క్యూలైన్ల‌లో వేచి ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ ఓటు హ‌క్కు వినియోగించుకునే అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు. ఈ నేప‌థ్యంలో నే చంద్ర‌బాబు పైవిధంగా విన్న‌వించారు. గ‌త 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఇలానే తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పోటెత్తారు. అప్ప‌ట్లో రాత్రం 9-10 గంట‌ల వ‌ర‌కు కూడా పోలింగ్ జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. 

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

33 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

1 hour ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago