ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. కొన్ని జిల్లాల్లో మాత్రం అశాంతి రేపింది.
ఈవీఎంల ధ్వంసం నుంచి కార్లను తగల బెట్టడం.. నాయకులపైనా.. పోలింగ్ ఏజెంట్లపైనా కూడా దాడులు చేయడం.. కర్రలు, కత్తులు ఇతరత్రా ఆయుధాలను ప్రయోగించడం వంటివి ఏపీ ఎన్నికల్లో కనిపించింది.
గుంటూరు జిల్లా పల్నాడులోని నాలుగు నియోజకవర్గాలు, అనంతపురం జిల్లా తాడిపత్రి, బాపట్ల జిల్లాలోనికొండపి ఎస్సీ నియోజకవర్గం, ఉమ్మడి కృష్నాజిల్లాలోని పెడన నియోజకవర్గాల్లో అశాంతి రేపింది. ఇతర చోట్ల కూడా.. కొన్ని చెదుమొదురు ఘటనలు జరిగాయి.
ముప్పాళ్ల మండలం నార్నేపాడులో జనసేన నేత కారుకు దుండగులు నిప్పు పెట్ఆరు. రెంటచింతలలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి కారును ధ్వంసంచేశారు. ఎన్టీఆర్ జిల్లా నవాబు పేట పోలింగ్ బూత్లో ఏజెంట్ల మధ్య గొడవ జరిగి.. పోలింగ్ రసాభాస గా మారింది. ఓటర్లు భయంతో పరుగులు తీశారు.
అనంతపురం జిల్లాలోని జేసీ వర్గానికి పట్టున్న తాడిపత్రి నియోజకవర్గంలో తీవ్ర ఘర్షన చోటు చేసుకుంది. ఏకంగా ఎస్పీ ప్రయాణిస్తున్న కారుపైనే దుండగులు రాళ్లువేశారు. ఇక, ప్రత్యర్థి పక్షం దాడుల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కారు ధ్వంసమైంది.
అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట మండలం దళావాయిపల్లి గ్రామంలో ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు.. రెచ్చిపోయారు. ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత.. అధికారులు మరికొన్ని ఈవీఎంలను తెప్పించారు.
జనసేన ఏజెంట్ ను వైసీపీ వర్గీయులు లాగిపడేయడమే కారణమని ఇరు వర్గాలు ఆరోపించుకున్నా యి. మొత్తంగా చూస్తే.. అనేక ఘటనలు.. అనేక వివాదాల మధ్యే 2024 సార్వత్రిక సమరం ముగిసింది. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…