ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. కొన్ని జిల్లాల్లో మాత్రం అశాంతి రేపింది.
ఈవీఎంల ధ్వంసం నుంచి కార్లను తగల బెట్టడం.. నాయకులపైనా.. పోలింగ్ ఏజెంట్లపైనా కూడా దాడులు చేయడం.. కర్రలు, కత్తులు ఇతరత్రా ఆయుధాలను ప్రయోగించడం వంటివి ఏపీ ఎన్నికల్లో కనిపించింది.
గుంటూరు జిల్లా పల్నాడులోని నాలుగు నియోజకవర్గాలు, అనంతపురం జిల్లా తాడిపత్రి, బాపట్ల జిల్లాలోనికొండపి ఎస్సీ నియోజకవర్గం, ఉమ్మడి కృష్నాజిల్లాలోని పెడన నియోజకవర్గాల్లో అశాంతి రేపింది. ఇతర చోట్ల కూడా.. కొన్ని చెదుమొదురు ఘటనలు జరిగాయి.
ముప్పాళ్ల మండలం నార్నేపాడులో జనసేన నేత కారుకు దుండగులు నిప్పు పెట్ఆరు. రెంటచింతలలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి కారును ధ్వంసంచేశారు. ఎన్టీఆర్ జిల్లా నవాబు పేట పోలింగ్ బూత్లో ఏజెంట్ల మధ్య గొడవ జరిగి.. పోలింగ్ రసాభాస గా మారింది. ఓటర్లు భయంతో పరుగులు తీశారు.
అనంతపురం జిల్లాలోని జేసీ వర్గానికి పట్టున్న తాడిపత్రి నియోజకవర్గంలో తీవ్ర ఘర్షన చోటు చేసుకుంది. ఏకంగా ఎస్పీ ప్రయాణిస్తున్న కారుపైనే దుండగులు రాళ్లువేశారు. ఇక, ప్రత్యర్థి పక్షం దాడుల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కారు ధ్వంసమైంది.
అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట మండలం దళావాయిపల్లి గ్రామంలో ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు.. రెచ్చిపోయారు. ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత.. అధికారులు మరికొన్ని ఈవీఎంలను తెప్పించారు.
జనసేన ఏజెంట్ ను వైసీపీ వర్గీయులు లాగిపడేయడమే కారణమని ఇరు వర్గాలు ఆరోపించుకున్నా యి. మొత్తంగా చూస్తే.. అనేక ఘటనలు.. అనేక వివాదాల మధ్యే 2024 సార్వత్రిక సమరం ముగిసింది. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.
This post was last modified on May 13, 2024 8:08 pm
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…