ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. కొన్ని జిల్లాల్లో మాత్రం అశాంతి రేపింది.
ఈవీఎంల ధ్వంసం నుంచి కార్లను తగల బెట్టడం.. నాయకులపైనా.. పోలింగ్ ఏజెంట్లపైనా కూడా దాడులు చేయడం.. కర్రలు, కత్తులు ఇతరత్రా ఆయుధాలను ప్రయోగించడం వంటివి ఏపీ ఎన్నికల్లో కనిపించింది.
గుంటూరు జిల్లా పల్నాడులోని నాలుగు నియోజకవర్గాలు, అనంతపురం జిల్లా తాడిపత్రి, బాపట్ల జిల్లాలోనికొండపి ఎస్సీ నియోజకవర్గం, ఉమ్మడి కృష్నాజిల్లాలోని పెడన నియోజకవర్గాల్లో అశాంతి రేపింది. ఇతర చోట్ల కూడా.. కొన్ని చెదుమొదురు ఘటనలు జరిగాయి.
ముప్పాళ్ల మండలం నార్నేపాడులో జనసేన నేత కారుకు దుండగులు నిప్పు పెట్ఆరు. రెంటచింతలలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి కారును ధ్వంసంచేశారు. ఎన్టీఆర్ జిల్లా నవాబు పేట పోలింగ్ బూత్లో ఏజెంట్ల మధ్య గొడవ జరిగి.. పోలింగ్ రసాభాస గా మారింది. ఓటర్లు భయంతో పరుగులు తీశారు.
అనంతపురం జిల్లాలోని జేసీ వర్గానికి పట్టున్న తాడిపత్రి నియోజకవర్గంలో తీవ్ర ఘర్షన చోటు చేసుకుంది. ఏకంగా ఎస్పీ ప్రయాణిస్తున్న కారుపైనే దుండగులు రాళ్లువేశారు. ఇక, ప్రత్యర్థి పక్షం దాడుల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కారు ధ్వంసమైంది.
అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట మండలం దళావాయిపల్లి గ్రామంలో ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు.. రెచ్చిపోయారు. ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత.. అధికారులు మరికొన్ని ఈవీఎంలను తెప్పించారు.
జనసేన ఏజెంట్ ను వైసీపీ వర్గీయులు లాగిపడేయడమే కారణమని ఇరు వర్గాలు ఆరోపించుకున్నా యి. మొత్తంగా చూస్తే.. అనేక ఘటనలు.. అనేక వివాదాల మధ్యే 2024 సార్వత్రిక సమరం ముగిసింది. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.
This post was last modified on May 13, 2024 8:08 pm
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని 'బర్చ్ బై రోమియో లేన్' అనే నైట్ క్లబ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…