Political News

ఏపీలో అశాంతి రేపిన ప్ర‌శాంత ఎన్నిక‌లు!

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌లు(అసెంబ్లీ+పార్ల‌మెంటు) ప్ర‌శాంతంగా జ‌రిగాయ‌ని ఎన్నిక‌లు సంఘం చెబుతోంది. అయితే.. ప్ర‌శాంతత కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు.. జిల్లాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. కొన్ని జిల్లాల్లో మాత్రం అశాంతి రేపింది.

ఈవీఎంల ధ్వంసం నుంచి కార్ల‌ను త‌గ‌ల బెట్టడం.. నాయ‌కుల‌పైనా.. పోలింగ్ ఏజెంట్ల‌పైనా కూడా దాడులు చేయ‌డం.. క‌ర్ర‌లు, క‌త్తులు ఇత‌ర‌త్రా ఆయుధాల‌ను ప్ర‌యోగించ‌డం వంటివి ఏపీ ఎన్నిక‌ల్లో క‌నిపించింది.

గుంటూరు జిల్లా ప‌ల్నాడులోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు, అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి, బాప‌ట్ల జిల్లాలోనికొండ‌పి ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం, ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని పెడ‌న నియోజ‌క‌వ‌ర్గాల్లో అశాంతి రేపింది. ఇత‌ర చోట్ల కూడా.. కొన్ని చెదుమొదురు ఘ‌ట‌న‌లు జ‌రిగాయి.

ముప్పాళ్ల మండ‌లం నార్నేపాడులో జనసేన నేత కారుకు దుండ‌గులు నిప్పు పెట్ఆరు. రెంట‌చింత‌ల‌లో టీడీపీ అభ్య‌ర్థి జూల‌కంటి బ్రహ్మారెడ్డి కారును ధ్వంసంచేశారు. ఎన్టీఆర్ జిల్లా నవాబు పేట పోలింగ్ బూత్‌లో ఏజెంట్ల మధ్య గొడ‌వ జ‌రిగి.. పోలింగ్ రసాభాస గా మారింది. ఓటర్లు భయంతో పరుగులు తీశారు.

అనంత‌పురం జిల్లాలోని జేసీ వ‌ర్గానికి ప‌ట్టున్న తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర ఘ‌ర్ష‌న చోటు చేసుకుంది. ఏకంగా ఎస్పీ ప్ర‌యాణిస్తున్న కారుపైనే దుండ‌గులు రాళ్లువేశారు. ఇక‌, ప్ర‌త్య‌ర్థి ప‌క్షం దాడుల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కారు ధ్వంస‌మైంది.

అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట మండ‌లం దళావాయిపల్లి గ్రామంలో ఓ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు.. రెచ్చిపోయారు. ఈవీఎంల‌ను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. పోలీసులు కేసు న‌మోదు చేసిన త‌ర్వాత‌.. అధికారులు మ‌రికొన్ని ఈవీఎంల‌ను తెప్పించారు.

జనసేన ఏజెంట్ ను వైసీపీ వర్గీయులు లాగిపడేయడమే కార‌ణమ‌ని ఇరు వ‌ర్గాలు ఆరోపించుకున్నా యి. మొత్తంగా చూస్తే.. అనేక ఘ‌ట‌న‌లు.. అనేక వివాదాల మ‌ధ్యే 2024 సార్వ‌త్రిక స‌మ‌రం ముగిసింది. క్యూలైన్ల‌లో ఉన్న‌వారికి ఓటు వేసేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

This post was last modified on May 13, 2024 8:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

37 minutes ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

1 hour ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

2 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

3 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

5 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

5 hours ago