Political News

ప‌ల్నాడులో ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు హాట్ హాట్‌!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వ‌ర‌కు కూడా.. అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నా రు. అధికారుల‌ను మార్చేశారు. అంతేకాదు.. చీమ చిటుక్కుమ‌న్నా ప‌ట్టేసేలా వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చారు. అన్ని పోలింగ్ బూతుల‌ను వెబ్ క్యాస్టింగ్ చేశారు. అంటే.. ఇక్క‌డ ప్ర‌తిదీ రికార్డు చేశారు. అయినా.. ఆగ‌డాలు.. ఆగ‌లేదు. దాడులకు బ్రేక్ ప‌డ‌లేదు. అదే.. ఎప్పుడూ.. హాట్ టాపిక్‌గా ఉండే.. ప‌ల్నాడు ప్రాంతం. ఇక్క‌డి నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌ను కేంద్ర ఎన్నికల సంఘం స‌మ‌స్యాత్మ‌కం కాదు.. అత్యంత స‌మ‌స్యాత్మ‌కంగా తేల్చింది.

మాచ‌ర్ల‌లో టీడీపీ ఏజెంట్ల‌ను పోలింగ్ బూతుల‌కు వెళ్ల‌కుండా.. వైసీపీ నాయ‌కులు అడ్డుకున్నార‌ని.. టీడీపీ ఏజెంట్లు ఆరోపించారు. అంతేకాదు.. చెప్పులు, క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడులు చేశార‌ని వారు ఆరోపించారు. ఇక్క‌డ పోలీసులు ఉన్నా కూడా.. దాడి చేస్తున్న‌వారిని అడ్డుకోలేద‌ని వ్యాఖ్యానించారు.

గుర‌జాల‌లో టీడీపీ, వైసీపీ నేత‌లు ప‌ర‌స్పరం దాడులు చేసుకున్నారు. ఏజెంట్లుగా కూర్చోవ‌డానికి వీల్లేద‌ని.. ఇరు ప‌క్షాల కార్య‌కర్త‌లు ప‌ర‌స్ప‌రం దాడులకు దిగారు.

పెద‌కూర‌పాడులో మ‌రింత ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. వాస్త‌వానికి ఇది ప్ర‌శాంత‌మైన నియోజ‌క‌వ‌ర్గం. కానీ.. ఈ సారి మాత్రం ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని అత్యంత స‌మ‌స్యాత్మ‌క నియోజ‌క‌వ‌ర్గంగా పేర్కొంది. అనుకున్న‌ట్టుగా.. ఇక్క‌డ కూడా రెచ్చ‌గొట్టేవిధంగా నాయ‌కులు కామెంట్లు చేసుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు.

వినుకొండ‌లోనూ వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ నేత‌ల మ‌ధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలింగ్ బూతుల్లో ప్ర‌చారం చేస్తున్నార‌ని వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నాయ‌కులు, టీడీపీ నేత‌ల‌పై వైసీపీ నేత‌లు దాడులు చేసుకున్నారు. అయితే.. ఇక్క‌డ ప‌టిష్ట భ‌ద్ర‌త‌, భారీ ఎత్తున బ‌ల‌గాల‌ను ఏర్పాటు చేసినా.. ప‌రిస్థితిలో మార్పు లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 13, 2024 11:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

29 minutes ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

1 hour ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

1 hour ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

3 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

4 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

5 hours ago