కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వరకు కూడా.. అనేక జాగ్రత్తలు తీసుకున్నా రు. అధికారులను మార్చేశారు. అంతేకాదు.. చీమ చిటుక్కుమన్నా పట్టేసేలా వ్యవస్థను తీసుకువచ్చారు. అన్ని పోలింగ్ బూతులను వెబ్ క్యాస్టింగ్ చేశారు. అంటే.. ఇక్కడ ప్రతిదీ రికార్డు చేశారు. అయినా.. ఆగడాలు.. ఆగలేదు. దాడులకు బ్రేక్ పడలేదు. అదే.. ఎప్పుడూ.. హాట్ టాపిక్గా ఉండే.. పల్నాడు ప్రాంతం. ఇక్కడి నాలుగు నియోజకవర్గాలను కేంద్ర ఎన్నికల సంఘం సమస్యాత్మకం కాదు.. అత్యంత సమస్యాత్మకంగా తేల్చింది.
మాచర్లలో టీడీపీ ఏజెంట్లను పోలింగ్ బూతులకు వెళ్లకుండా.. వైసీపీ నాయకులు అడ్డుకున్నారని.. టీడీపీ ఏజెంట్లు ఆరోపించారు. అంతేకాదు.. చెప్పులు, కర్రలు, రాళ్లతో దాడులు చేశారని వారు ఆరోపించారు. ఇక్కడ పోలీసులు ఉన్నా కూడా.. దాడి చేస్తున్నవారిని అడ్డుకోలేదని వ్యాఖ్యానించారు.
గురజాలలో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఏజెంట్లుగా కూర్చోవడానికి వీల్లేదని.. ఇరు పక్షాల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు.
పెదకూరపాడులో మరింత ఉద్రిక్తత ఏర్పడింది. వాస్తవానికి ఇది ప్రశాంతమైన నియోజకవర్గం. కానీ.. ఈ సారి మాత్రం ఈ నియోజకవర్గాన్ని అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా పేర్కొంది. అనుకున్నట్టుగా.. ఇక్కడ కూడా రెచ్చగొట్టేవిధంగా నాయకులు కామెంట్లు చేసుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు.
వినుకొండలోనూ వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలింగ్ బూతుల్లో ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు, టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడులు చేసుకున్నారు. అయితే.. ఇక్కడ పటిష్ట భద్రత, భారీ ఎత్తున బలగాలను ఏర్పాటు చేసినా.. పరిస్థితిలో మార్పు లేక పోవడం గమనార్హం.
This post was last modified on May 13, 2024 11:35 am
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…