Political News

చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌… ఎవ‌రిని ఉద్దేశించి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఉండ‌వ‌ల్లిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన త‌ర్వాత‌.. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లాలోని ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాలు స‌హా.. క‌డ‌ప‌లోని క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. స్వ‌ల్ప ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రెంటచింత‌ల‌(ప‌ల్నాడు)లో వైసీపీ, టీడీపీ పోలింగ్ ఏజంట్లు గాయ‌ప‌డ్డారు. ఇక్క‌డ స్వ‌ల్ప ఉద్రిక్త‌త‌లు కూడా చోటుచేసుకున్నాయి.

ఈ ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాడులు స‌రికాద‌ని.. ప్ర‌జాస్వామ్య పండుగ‌ను ధ్వంసం చేయ‌రాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. రౌడీయిజం, గూండాయిజం చేస్తే.. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు చూస్తూ ఊరుకోబోర‌ని తెలిపారు. అవాంచ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా.. పోలీసులు, ఎన్నిక‌ల సంఘం అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఎన్నిక‌ల పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు బాగానే ఉన్నాయ‌ని తెలిపారు.

ఏం జ‌రిగింది?

గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతంలోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న రెంట‌చింత‌ల మండ‌లం లో సోమ‌వారం ఉద‌యం కొంద‌రు హ‌ల్చ‌ల్ చేశారు. దీనిని ఇరు పార్టీ నాయ‌కులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో ఇరు పార్టీల‌కు చెందిన వారు గాయ‌ప‌డ్డారు. వీరిలో వైసీపీ, టీడీపీ ఏజెంట్లు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ దాడిపై ప‌ర‌స్ప‌రంఆరోప‌ణ‌లు చేసుకున్నారు.

సీఎం జ‌గ‌న్ మేన‌మామ పోటీలో ఉన్న క‌డ‌ప జిల్లాలోని క‌మ‌లాపురంలోనూ.. ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఇక్క‌డ కూడా న‌కిలీ ఓట్లు వేసేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నించారు. అయితే.. వీరు టీడీపీ వారేన‌ని వైసీపీ, కాదువైసీపీ ముఠాయేన‌ని టీడీపీ ఆరోపించుకుని.. ప‌ర‌స్ప‌రందాడులకు దిగాయి. దీంతో పోలీసులు వారిని చెద‌రగొట్టారు.

This post was last modified on May 13, 2024 11:23 am

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

2 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

2 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

2 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

5 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

5 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

7 hours ago