టీడీపీ అధినేత చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఉండవల్లిలోని పోలింగ్ బూత్లో ఓటు వేసిన తర్వాత.. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లాలోని ఒకటి రెండు నియోజకవర్గాలు సహా.. కడపలోని కమలాపురం నియోజకవర్గంలోనూ.. స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రెంటచింతల(పల్నాడు)లో వైసీపీ, టీడీపీ పోలింగ్ ఏజంట్లు గాయపడ్డారు. ఇక్కడ స్వల్ప ఉద్రిక్తతలు కూడా చోటుచేసుకున్నాయి.
ఈ పరిణామాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు సరికాదని.. ప్రజాస్వామ్య పండుగను ధ్వంసం చేయరాదని ఆయన పేర్కొన్నారు. రౌడీయిజం, గూండాయిజం చేస్తే.. తమ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోబోరని తెలిపారు. అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు బాగానే ఉన్నాయని తెలిపారు.
ఏం జరిగింది?
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న రెంటచింతల మండలం లో సోమవారం ఉదయం కొందరు హల్చల్ చేశారు. దీనిని ఇరు పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన వారు గాయపడ్డారు. వీరిలో వైసీపీ, టీడీపీ ఏజెంట్లు కూడా ఉండడం గమనార్హం. అయితే.. ఈ దాడిపై పరస్పరంఆరోపణలు చేసుకున్నారు.
సీఎం జగన్ మేనమామ పోటీలో ఉన్న కడప జిల్లాలోని కమలాపురంలోనూ.. ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ కూడా నకిలీ ఓట్లు వేసేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే.. వీరు టీడీపీ వారేనని వైసీపీ, కాదువైసీపీ ముఠాయేనని టీడీపీ ఆరోపించుకుని.. పరస్పరందాడులకు దిగాయి. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
This post was last modified on May 13, 2024 11:23 am
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని 'బర్చ్ బై రోమియో లేన్' అనే నైట్ క్లబ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…