Political News

చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌… ఎవ‌రిని ఉద్దేశించి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఉండ‌వ‌ల్లిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన త‌ర్వాత‌.. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లాలోని ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాలు స‌హా.. క‌డ‌ప‌లోని క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. స్వ‌ల్ప ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రెంటచింత‌ల‌(ప‌ల్నాడు)లో వైసీపీ, టీడీపీ పోలింగ్ ఏజంట్లు గాయ‌ప‌డ్డారు. ఇక్క‌డ స్వ‌ల్ప ఉద్రిక్త‌త‌లు కూడా చోటుచేసుకున్నాయి.

ఈ ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాడులు స‌రికాద‌ని.. ప్ర‌జాస్వామ్య పండుగ‌ను ధ్వంసం చేయ‌రాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. రౌడీయిజం, గూండాయిజం చేస్తే.. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు చూస్తూ ఊరుకోబోర‌ని తెలిపారు. అవాంచ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా.. పోలీసులు, ఎన్నిక‌ల సంఘం అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఎన్నిక‌ల పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు బాగానే ఉన్నాయ‌ని తెలిపారు.

ఏం జ‌రిగింది?

గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతంలోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న రెంట‌చింత‌ల మండ‌లం లో సోమ‌వారం ఉద‌యం కొంద‌రు హ‌ల్చ‌ల్ చేశారు. దీనిని ఇరు పార్టీ నాయ‌కులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో ఇరు పార్టీల‌కు చెందిన వారు గాయ‌ప‌డ్డారు. వీరిలో వైసీపీ, టీడీపీ ఏజెంట్లు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ దాడిపై ప‌ర‌స్ప‌రంఆరోప‌ణ‌లు చేసుకున్నారు.

సీఎం జ‌గ‌న్ మేన‌మామ పోటీలో ఉన్న క‌డ‌ప జిల్లాలోని క‌మ‌లాపురంలోనూ.. ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఇక్క‌డ కూడా న‌కిలీ ఓట్లు వేసేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నించారు. అయితే.. వీరు టీడీపీ వారేన‌ని వైసీపీ, కాదువైసీపీ ముఠాయేన‌ని టీడీపీ ఆరోపించుకుని.. ప‌ర‌స్ప‌రందాడులకు దిగాయి. దీంతో పోలీసులు వారిని చెద‌రగొట్టారు.

This post was last modified on May 13, 2024 11:23 am

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

56 minutes ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

2 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

2 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

5 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago