ఏపీలో జరుగుతున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి రెండు జిల్లాలు మినహా.. మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ ఆశాజనకంగానే సాగుతోంది. ఉదయం 5-6 మధ్యే పోలింగ్ బూతుల ముందు ఓటర్లు బారులు తీరారు. నిర్దేశిత సమయం ప్రకారం ఉదయం 7 గంటలకు.. పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మిగిలిన చోట ఇబ్బందులు లేకుండానే ప్రక్రియ సాగిపోయింది.
అయితే.. చిత్రంగా గత 2019 ఎన్నికల సమయంలో ఉదయం 9 గంటల సమయానికి అంటే.. పోలింగ్ ప్రారంభమైన రెండుగంటల వ్యవధిలో 5-6 శాతం మాత్రమే నమోదైన ఓట్లు.. తాజా ఎన్నికల్లో దాదాపు 10 శాతానికి రీచ్ అయ్యాయి. అల్లూరి సీతారామరాజు మన్యం వంటి మారు మూల జిల్లాల్లో కూడా.. ఉదయం 9 గంటలకు 6.77 శాతంనమోదైంది. ఇక, బాపట్లలో 11.36 శాతం, చిత్తూరులో 11.84 శాతం పోలింగ్ నమోదైం ది. గుంటూరులో యధావిధిగా ఘర్షణలు, గొడవలతో పోలింగ్కు ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ అత్యంత తక్కువగా 6.17 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సింది.. సీఎం జగన్ సొంత జిల్లా కడప. ఇక్కడ రాష్ట్రంలోనే అత్యధికంగా.. తొలి రెండు గంటల్లో 12.09 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవర్ రికార్డ్గా అధికారులు చెబుతున్నారు. అయితే.. ఇక్కడ వైఎస్ కుటుంబానికి చెందిన ఆడపడుచులు వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీతలు భారీ ఎత్తున ప్రచారం చేయడం , కొంగు చాపి అడుగుతున్నా.. అంటూ షర్మిల ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం తెలిసిందే.
కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రికార్డు స్థాయిలో ఓట్లు పడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి సాయంత్రం వరకు సమయం ఉన్న నేపథ్యంలో 99 శాతం వరకు పోలింగ్ నమోదైనా ఆశ్చర్యం లేదు. గత ఎన్నికల్లో 82 శాతం ఇక్కడ ఓట్లు పోలయ్యాయి.
This post was last modified on May 13, 2024 11:00 am
కెజిఎఫ్ తర్వాత చాలా పెద్ద గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఏరికోరి చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఇలాంటి…
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…