Political News

క‌డ‌ప‌లో రికార్డు స్థాయి పోలింగ్‌.. అక్క చెల్లెళ్ల ఎఫెక్టేనా?

ఏపీలో జ‌రుగుతున్న పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక‌టి రెండు జిల్లాలు మిన‌హా.. మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ప్ర‌క్రియ ఆశాజ‌న‌కంగానే సాగుతోంది. ఉద‌యం 5-6 మ‌ధ్యే పోలింగ్ బూతుల ముందు ఓట‌ర్లు బారులు తీరారు. నిర్దేశిత స‌మ‌యం ప్ర‌కారం ఉద‌యం 7 గంట‌ల‌కు.. పోలింగ్ ప్రారంభ‌మైంది. కొన్ని కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మిగిలిన చోట ఇబ్బందులు లేకుండానే ప్ర‌క్రియ సాగిపోయింది.

అయితే.. చిత్రంగా గ‌త 2019 ఎన్నిక‌ల స‌మయంలో ఉద‌యం 9 గంట‌ల స‌మ‌యానికి అంటే.. పోలింగ్ ప్రారంభ‌మైన రెండుగంట‌ల వ్య‌వ‌ధిలో 5-6 శాతం మాత్ర‌మే న‌మోదైన ఓట్లు.. తాజా ఎన్నిక‌ల్లో దాదాపు 10 శాతానికి రీచ్ అయ్యాయి. అల్లూరి సీతారామ‌రాజు మ‌న్యం వంటి మారు మూల జిల్లాల్లో కూడా.. ఉద‌యం 9 గంట‌ల‌కు 6.77 శాతంన‌మోదైంది. ఇక‌, బాప‌ట్ల‌లో 11.36 శాతం, చిత్తూరులో 11.84 శాతం పోలింగ్ న‌మోదైం ది. గుంటూరులో య‌ధావిధిగా ఘ‌ర్ష‌ణ‌లు, గొడ‌వ‌ల‌తో పోలింగ్‌కు ఆహ్వానం ప‌లికిన విష‌యం తెలిసిందే. దీంతో ఇక్క‌డ అత్యంత త‌క్కువ‌గా 6.17 శాతం మాత్ర‌మే పోలింగ్ న‌మోదైంది.

అయితే.. ఇక్క‌డ చెప్పుకోవాల్సింది.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌. ఇక్క‌డ రాష్ట్రంలోనే అత్య‌ధికంగా.. తొలి రెండు గంట‌ల్లో 12.09 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌ర్ రికార్డ్‌గా అధికారులు చెబుతున్నారు. అయితే.. ఇక్క‌డ వైఎస్ కుటుంబానికి చెందిన ఆడ‌ప‌డుచులు వైఎస్ ష‌ర్మిల‌, వివేకా కుమార్తె సునీత‌లు భారీ ఎత్తున ప్ర‌చారం చేయ‌డం , కొంగు చాపి అడుగుతున్నా.. అంటూ ష‌ర్మిల ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం తెలిసిందే.

కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ రికార్డు స్థాయిలో ఓట్లు ప‌డుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి సాయంత్రం వ‌ర‌కు స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో 99 శాతం వ‌ర‌కు పోలింగ్ న‌మోదైనా ఆశ్చ‌ర్యం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో 82 శాతం ఇక్క‌డ ఓట్లు పోల‌య్యాయి.

This post was last modified on May 13, 2024 11:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

26 minutes ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

1 hour ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

1 hour ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

3 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

4 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

5 hours ago