‘సింగిల్ సింహం’ అని ఏ ముహూర్తాన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సినిమాటిక్ డైలాగుని రాజకీయాల్లో చెప్పారో, అప్పటినుంచి.. ఆయనకి ఏదీ కలిసి రావడంలేదు.! తోడబుట్టిన చెల్లి, వైసీపీకి రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయింది. చివరికి కన్న తల్లి కూడా, వైసీపీ ఓటమిని కోరుకుంటోంది.!
రాజకీయాల్లో అన్నదమ్ములు వేర్వేరు పార్టీలో వుండడం మామూలే. అన్నా చెల్లెళ్ళ మధ్య కూడా రాజకీయంగా విభేదాలు వుండొచ్చు. కానీ, చెల్లెల్ని ఏడిపించిన ‘అన్న’ని ఎక్కడైనా చూశామా.? తనయుడి నుంచి ప్రాణభయంతో పారిపోయే తల్లిని చూశామా.? అన్న చర్చ ఓటర్లలో జరిగేంత స్థాయికి కుటుంబ రాజకీయాలు రోడ్డున పడలేదెప్పుడూ.!
వైఎస్ షర్మిల, కడప లోక్ సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తన కుమార్తె షర్మిలని గెలిపించాలంటూ విజయమ్మ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోపై వైసీపీ శ్రేణులు ‘బూతుల దాడి’కి దిగాయి. ఇదే వైసీపీకి పెద్ద సమస్యగా మారుతోంది.
‘వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు వైఎస్ షర్మిల..’ అంటూ ఓ వైసీపీ ప్రజా ప్రతినిథి గతంలో విమర్శించాక, షర్మిల పొలిటికల్ మైలేజ్ కడప జిల్లాలో అనూహ్యంగా పెరిగింది. ఇప్పుడు వైఎస్ విజయమ్మపై వైసీపీ శ్రేణుల ట్రోలింగ్తో కడప జిల్లాలో షర్మిల ఇమేజ్ మరింత బలపడినట్లు కనిపిస్తోంది.
కుమార్తె కోసం వీడియో విడుదల చేసినట్లే, కుమారుడి కోసం కూడా విజయమ్మ ఓ వీడియో విడుదల చేయడానికి అవకాశమైతే వుండేది. కానీ, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు వైఎస్ జగన్.
‘నా పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా, నా ఫొటో చూసే ఓటు వేస్తారు తప్ప.. మా పార్టీ అభ్యర్థుల్ని చూసి ఎవరూ ఓటు వెయ్యరు..’ అని ఓ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ చెప్పడం, వైఎస్ జగన్ ‘సింగిల్ సింహం’ మనస్తత్వాన్ని చెప్పకనే చెబుతోంది.
2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయమ్మ, షర్మిల ‘బలం’గా నిలిచారు.! ఇప్పుడు ఆ కుటుంబం జగన్ వెంట లేదు. జగన్ ఒంటరి.. అనే సింపతీ లేదెక్కడా. కుటుంబాన్ని దూరం చేసుకున్నాడన్న అపప్రధ మాత్రమే మిగిలింది.
This post was last modified on May 12, 2024 4:18 pm
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…