Political News

పిఠాపురంలో వంగా గీత పరిస్థితేంటి.?

సిట్టింగ్ ఎంపీ ఎందుకు అసెంబ్లీకి పోటీ చెయ్యాల్సి వచ్చింది.? ఈ ప్రశ్న కాకినాడ లోక్ సభ నియోజకవర్గంలో, అందునా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకింత ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది.

‘వైఎస్ జగన్ తప్పు చేశారు. వంగా గీతను బలి పశువుని చేశారు. అంతా అయిపోయాక, ఇప్పుడేమో వంగా గీతని ఉప ముఖ్యమంత్రిని చేస్తానంటున్నారు. ఇదేం పద్ధతి.?’ అంటూ వైసీపీకి చెందిన కాపు నేతలు కొందరు గుస్సా అవుతున్నారట.

డే వన్ నుంచీ పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం విషయమై వంగా గీత వెనుకంజలోనే వున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి పిఠాపురం నియోజకవర్గం మొదటి నుంచీ అనుకూలంగానే వుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నుంచి కొంత పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకత వుండొచ్చన్న ప్రచారం జరిగినా, ఆ వర్మ మొదటి నుంచీ చివరి వరకూ పవన్ కళ్యాణ్‌కి వెన్ను దన్నుగా నిలిచారు.

పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీతకు మద్దతుగా మొదట్లో కనిపించిన ఎంపీ మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు, ఆ తర్వాత చేతులెత్తేశారు. చివరి రోజు ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్, పిఠాపురంలో నిర్వహించినా, అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది.. అదీ అనూహ్యమైన స్థాయిలో.

పరిస్థితి అర్థమయ్యిందో ఏమో, వంగా గీత చివరి రాగం పాడేశారు.. అదీ, ఏడుపు రాగం.! ఆమె అలా ఏడుస్తోంటే, పక్కనే వైఎస్ జగన్ నవ్వుతూ కనిపించడం వైసీపీ శ్రేణుల్నే ఆశ్చర్యానికి గురిచేసింది.

వైసీపీ తరఫున పిఠాపురం నియోజకవర్గంలో 5 వేల రూపాయల వరకు నగదు, దానికి అదనంగా చీర, మద్యం బాటిళ్ళు.. ఇలాంటివి పంపకాలు జోరుగా సాగుతున్నాయ్. ఏం చేసినా, వంగా గీత పిఠాపురంలో గెలిచే అవకాశం కనిపించడంలేదు.

This post was last modified on May 12, 2024 4:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

2 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

3 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

6 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago