హైదరాబాదు నుంచి మండపేట వైపు కెమికల్ ఫౌడర్ బస్తాలను తరలిస్తున్న వ్యాన్ ను లారీ ఢీ కొట్టడంతో తిరగబడింది. అందులో ఉన్న బస్తాల కింద 7 అట్ట పెట్టెలు లభ్యం అయ్యాయి. వాటిల్లో పెద్ద ఎత్తున నగదు ఉండటం కలకలం రేపుతున్నది.
వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని టోల్ ప్లాజా అడ్మినిస్ట్రేటివ్ భవనం వద్దకు తరలించారు. అధికారుల సమక్షంలో అన్ని పెట్టెలను తెరిచి చూడగా వాటిలో 7 కోట్ల రూపాయల నగదు కనిపించింది. ఇది ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్న నగదుగా అధికారులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో దొరికిన ఈ డబ్బు ఎవరిది ?ఎక్కడికి తరలిస్తున్నారనే కోరణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ?
యాక్సిడెంట్ జరిగిందని తెలుసుకున్న కానిస్టేబుల్ ప్రమాదఘటన వద్దకు వచ్చి చూశాడు. అక్కడ కెమికల్ పౌడర్ బస్తాల నడుమ అట్టపెట్టెలు కనిపించగా అనుమానం వచ్చి చూడగా భారీ ఎత్తున నగదు కనిపించింది. దీంతో భయపడి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు.
This post was last modified on May 11, 2024 10:30 pm
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…
ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…