Political News

పంతంగి ప్యాక్ అయింది !

సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి మీద ఉన్న ఈ టోల్ గేట్ వద్ద రద్దీ ఏర్పడి ప్రతి సారి గంటల తరబడి వేల వాహనాలు జామ్ అవుతుంటాయి. ఇప్పుడు ఆంధ్రాలో ఓట్ల పండుగ నేపథ్యంలో పంతంగి టోల్ ప్లాజా మరోసారి ప్యాక్ అయింది.

ఈ నెల 13 న ఏపీలో అసెంబ్లీ ,లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున ఆంధ్రా ఓటర్లు తమ సొంత ప్రాంతాలకు తరలి వెళ్తుండడంతో టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండటంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా ఓట్లేయడానికి బయల్దేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి.

టోల్‌ గేట్ చెల్లింపునకు వాహనాలు బారులు తీరడంతో పంతంగి నుంచి చౌటుప్పల్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుకుండటంతో హైదరాబాద్‌ శివార్లలోని హయత్‌నగర్‌ నుంచి అబ్దుల్లాపూర్‌ మెట్‌ వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నది. శుక్రవారం రాత్రి నుంచే విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతున్నది.

ఎన్నికల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఏపీకి 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 500 ప్రత్యేక బస్సులు, జేబీఎస్ బస్టాండ్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. దీంతో పాటు 58 ప్రత్యేక రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్నది.

This post was last modified on May 11, 2024 10:24 pm

Share

Recent Posts

బాలయ్య దాదా… మాస్ జనాలు ఫిదా

గత ఏడాది డిసెంబర్ లో అఖండ 2 తాండవం తర్వాత బాలకృష్ణ నుంచి కొత్త సినిమా రాలేదు. ముందు పీరియాడిక్…

48 minutes ago

అరుదైన జాబితాలో రవితేజ

వరుసగా ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్న రవితేజకు.. ‘ఇరుముడి’ రూపంలో ఒక మోస్తరు విజయం దక్కినా చాలని చూశారు అభిమానులు. కానీ…

1 hour ago

మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

ఇటీవ‌ల ఇద్ద‌రు ఫోక్ డ్యాన్స‌ర్ల‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త వివాదం సోష‌ల్ మీడియాలో, మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే…

2 hours ago

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్… శిథిలాల కింద 50 మంది?

ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం హఠాత్తుగా కుప్పుకూలిన ఘటన షాకింగ్…

3 hours ago

అనస్వరకు అంత డిమాండ్ ఉందా?

మలయాళం నుంచి కథానాయికలను తెలుగులోకి తీసుకురావడం కొత్త కాదు. నయనతార, మమత మోహన్ దాస్, కీర్తి సురేష్ లాంటి చాలామంది…

4 hours ago

‘రాకా’ లెవెలే వేరంటున్న నటుడు

పుష్ప, పుష్ప-2 సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమాల తర్వాత బన్నీ…

4 hours ago