రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం చేశారు. కూటమి పార్టీలకు జై కొట్టారు. కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఆమె ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో కృష్ణం రాజు.. బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు శ్యామలా దేవి కూడా.. ఆ కండువాతోనే కనిపించారు. సో.. దీనిని బట్టి ఆమె.. బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నట్టు అయింది. తాజాగా చివరి రోజు ప్రచారంలో భాగంగా శ్యామలాదేవి.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడేనికి వచ్చారు. జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తరఫున ఆమె ఇంటి నుంచే ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా శ్యామలా దేవి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి అవినీతిలో మగ్గిపోయిన ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో గెలిచినా.. గెలవకపోయినా .. నియోజకవర్గం ప్రజలకు బొలిశెట్టి సేవ చేశారని.. అన్ని విషయాల్లోనూ అండగా ఉన్నారని తెలిపారు. అలాంటి నాయకుడికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ.. గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు.
దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోడీకి అందరూ అండగా ఉండాలని శ్యామలా దేవి పిలుపునిచ్చారు. వచ్చే ఐదేళ్లలో దేశం ప్రపంచ దేశాల సరసన చేరుతుందని అన్నారు. ఇలా కావాలంటే.. మోడీకి పట్టం కట్టాలని.. కూటమికి ఓటేస్తే.. మోడీని గెలిపించినట్టేనని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలోచంద్రబాబును ముక్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఇక, పవన్ గురించి మాట్లాడుతూ.. సినిమాల్లో సంపాయించుకునే అవకాశం వదులుకుని మరీ ప్రజాసేవ కోసం.. పవన్ కల్యాణ్ వచ్చారని.. ఆయనను గెలిపించాలని శ్యామలా దేవి పిలుపునిచ్చారు.
ఓటర్లంతా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా భారీ ఎత్తున ఓట్లు వేయాలని కోరారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న శ్యామలా దేవి.. బొలిశెట్టిని గెలిపిస్తే.. నియోజకవర్గం అభివృద్ధికి తాను హామీ ఇస్తానని చెప్పారు. కాగా.. వైసీపీపై ఎలాంటి విమర్శలూ చేయకపోవడం.. సీఎం జగన్ పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కూటమి కే ఓటేయాలని శ్యామలా దేవి చెప్పుకొచ్చారు.
This post was last modified on May 11, 2024 10:15 pm
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…