Political News

రెబ‌ల్ స్టార్ స‌తీమ‌ణి.. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు విన్న‌పం

రెబ‌ల్ స్టార్, దివంగ‌త కృష్ణం రాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి అనూహ్యంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి రోజు రాజ‌కీయ ప్ర‌చారం చేశారు. కూట‌మి పార్టీల‌కు జై కొట్టారు. కూట‌మి పార్టీల అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని ఆమె ఏపీ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. గ‌తంలో కృష్ణం రాజు.. బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు శ్యామ‌లా దేవి కూడా.. ఆ కండువాతోనే క‌నిపించారు. సో.. దీనిని బ‌ట్టి ఆమె.. బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న‌ట్టు అయింది. తాజాగా చివ‌రి రోజు ప్ర‌చారంలో భాగంగా శ్యామ‌లాదేవి.. ఉమ్మడి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లి గూడేనికి వ‌చ్చారు. జ‌న‌సేన అభ్య‌ర్థి బొలిశెట్టి శ్రీనివాస్ త‌ర‌ఫున ఆమె ఇంటి నుంచే ప్ర‌చారం చేశారు.

ఈ సంద‌ర్భంగా శ్యామ‌లా దేవి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి అవినీతిలో మగ్గిపోయిన ఎమ్మెల్యే కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌ను ఓడించాల‌ని ఆమె పిలుపునిచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచినా.. గెల‌వ‌క‌పోయినా .. నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు బొలిశెట్టి సేవ చేశార‌ని.. అన్ని విష‌యాల్లోనూ అండ‌గా ఉన్నార‌ని తెలిపారు. అలాంటి నాయ‌కుడికి అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అంద‌రూ.. గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాల‌ని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూట‌మి అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని అన్నారు.

దేశాన్ని ప్ర‌గ‌తి ప‌థంలో న‌డిపిస్తున్న ప్ర‌ధాని మోడీకి అంద‌రూ అండ‌గా ఉండాల‌ని శ్యామ‌లా దేవి పిలుపునిచ్చారు. వ‌చ్చే ఐదేళ్ల‌లో దేశం ప్ర‌పంచ దేశాల స‌ర‌స‌న చేరుతుంద‌ని అన్నారు. ఇలా కావాలంటే.. మోడీకి ప‌ట్టం క‌ట్టాల‌ని.. కూట‌మికి ఓటేస్తే.. మోడీని గెలిపించిన‌ట్టేన‌ని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలోచంద్ర‌బాబును ముక్య‌మంత్రిని చేయాల‌ని పిలుపునిచ్చారు. ఇక‌, ప‌వ‌న్ గురించి మాట్లాడుతూ.. సినిమాల్లో సంపాయించుకునే అవ‌కాశం వ‌దులుకుని మ‌రీ ప్ర‌జాసేవ కోసం.. ప‌వ‌న్ కల్యాణ్ వ‌చ్చార‌ని.. ఆయ‌న‌ను గెలిపించాల‌ని శ్యామ‌లా దేవి పిలుపునిచ్చారు.

ఓటర్లంతా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా భారీ ఎత్తున ఓట్లు వేయాలని కోరారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న శ్యామ‌లా దేవి.. బొలిశెట్టిని గెలిపిస్తే.. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి తాను హామీ ఇస్తాన‌ని చెప్పారు. కాగా.. వైసీపీపై ఎలాంటి విమ‌ర్శ‌లూ చేయ‌క‌పోవ‌డం.. సీఎం జ‌గ‌న్ పేరు ఎక్క‌డా ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కాగా, ప్ర‌భాస్ ఫ్యాన్స్ కూడా కూట‌మి కే ఓటేయాల‌ని శ్యామ‌లా దేవి చెప్పుకొచ్చారు.

This post was last modified on May 11, 2024 10:15 pm

Share

Recent Posts

బాలయ్య దాదా… మాస్ జనాలు ఫిదా

గత ఏడాది డిసెంబర్ లో అఖండ 2 తాండవం తర్వాత బాలకృష్ణ నుంచి కొత్త సినిమా రాలేదు. ముందు పీరియాడిక్…

1 hour ago

అరుదైన జాబితాలో రవితేజ

వరుసగా ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్న రవితేజకు.. ‘ఇరుముడి’ రూపంలో ఒక మోస్తరు విజయం దక్కినా చాలని చూశారు అభిమానులు. కానీ…

1 hour ago

మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

ఇటీవ‌ల ఇద్ద‌రు ఫోక్ డ్యాన్స‌ర్ల‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త వివాదం సోష‌ల్ మీడియాలో, మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే…

2 hours ago

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్… శిథిలాల కింద 50 మంది?

ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం హఠాత్తుగా కుప్పుకూలిన ఘటన షాకింగ్…

3 hours ago

అనస్వరకు అంత డిమాండ్ ఉందా?

మలయాళం నుంచి కథానాయికలను తెలుగులోకి తీసుకురావడం కొత్త కాదు. నయనతార, మమత మోహన్ దాస్, కీర్తి సురేష్ లాంటి చాలామంది…

4 hours ago

‘రాకా’ లెవెలే వేరంటున్న నటుడు

పుష్ప, పుష్ప-2 సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమాల తర్వాత బన్నీ…

4 hours ago