Political News

మీ శ్రేయోభిలాషి.. ఏపీ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు లేఖ‌..!

“మీ శ్రేయోభిలాషి..” అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన మ‌రుక్ష‌ణం చంద్ర‌బాబు రాసిన లేఖ‌ను పార్టీ కార్యాల‌యం మీడియాకు విడుద‌ల చేసింది.

దీనిలో ఆయ‌న ఓటు గురించి, గ‌త టీడీపీ పాల‌న గురించి సుదీర్ఘంగా వివ‌రించారు. 2014లో రాష్ట్ర విభ‌జ‌న తర్వాత అధికారం చేప‌ట్టిన టీడీపీ సుదీర్ఘ ల‌క్ష్యాలు పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు సాగిన‌ట్టు తెలిపారు.

అమ‌రావ‌తి రాజ‌ధాని స‌హా.. సాగునీటి ప్రాజెక్టులు.. సంక్షేమానికి పెద్ద‌పీట వేశామ‌న్నారు. 100కు పైగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశామ‌ని పేర్కొన్నారు.

2019లోనూ అధికారంలోకి వ‌చ్చి ఉంటే.. దేశంలోనే ఏపీ అగ్ర‌స్థానంలో ఉండేద‌ని చంద్ర‌బాబు తెలిపారు. కానీ, అబ‌ద్ధాలు, దుర్మా ర్గాలు, క‌ట్టుక‌థ‌లు, మోసాల‌తో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని విమ‌ర్శించారు.

ప్ర‌జ‌లు త‌మ సంక్షేమం కోసం వైసీపీకి అధికారం అప్ప‌గిస్తే.. వైసీపీ నాయ‌కులు భ‌స్మాసురులుగా మారి రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశారని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ల్యాండ్‌, శ్యాండ్‌, మైనింగ్‌, లిక్క‌ర్ మాఫియాల‌తో రాష్ట్రాన్ని దోచుకున్నార‌ని తెలిపారు. వ్య‌వ‌స్థ‌ల‌ను చెర‌బ‌ట్టి ప్ర‌శ్నించేవారిని.. జైలు పాలు చేస్తు న్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను కూడా అణ‌గ‌దొక్కార‌ని పేర్కొన్నారు.

ఈ నెల 13న జ‌రిగేఎన్నిక‌ల్లో వైసీపీ భ‌స్మాసురుల‌ను అంతం చేసేందుకు ఓటుతో వేటు వేయాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. క‌బ్జాల‌కు, బాదుడుకు, అరాచ‌కాల‌కు ముగింపు ప‌లికేలా ఈ నెల 13న జ‌రిగే పోలింగ్ లో ఓటేయాల‌ని సూచించారు.

సంక్షేమం, అభివృద్ధి, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ హామీల‌తో ప్ర‌జల ముందుకు వ‌చ్చిన కూట‌మిని గెలిపించాల‌ని చంద్ర‌బాబు విన్న‌వించారు.

రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాల‌నే విష‌యంపై కూట‌మి ద‌గ్గ‌ర స్ప‌ష్ట‌మైన విజ‌న్ ఉంద‌ని తెలిపారు. అందుకే క‌ట‌మి అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. నిర్భ‌యంగా, నిజాయితీగా ఓటేయాల‌ని సూచించారు.

This post was last modified on May 11, 2024 10:12 pm

Share

Recent Posts

బాలయ్య దాదా… మాస్ జనాలు ఫిదా

గత ఏడాది డిసెంబర్ లో అఖండ 2 తాండవం తర్వాత బాలకృష్ణ నుంచి కొత్త సినిమా రాలేదు. ముందు పీరియాడిక్…

34 minutes ago

అరుదైన జాబితాలో రవితేజ

వరుసగా ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్న రవితేజకు.. ‘ఇరుముడి’ రూపంలో ఒక మోస్తరు విజయం దక్కినా చాలని చూశారు అభిమానులు. కానీ…

53 minutes ago

మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

ఇటీవ‌ల ఇద్ద‌రు ఫోక్ డ్యాన్స‌ర్ల‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త వివాదం సోష‌ల్ మీడియాలో, మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే…

1 hour ago

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్… శిథిలాల కింద 50 మంది?

ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం హఠాత్తుగా కుప్పుకూలిన ఘటన షాకింగ్…

2 hours ago

అనస్వరకు అంత డిమాండ్ ఉందా?

మలయాళం నుంచి కథానాయికలను తెలుగులోకి తీసుకురావడం కొత్త కాదు. నయనతార, మమత మోహన్ దాస్, కీర్తి సురేష్ లాంటి చాలామంది…

4 hours ago

‘రాకా’ లెవెలే వేరంటున్న నటుడు

పుష్ప, పుష్ప-2 సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమాల తర్వాత బన్నీ…

4 hours ago