Political News

మీ శ్రేయోభిలాషి.. ఏపీ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు లేఖ‌..!

“మీ శ్రేయోభిలాషి..” అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన మ‌రుక్ష‌ణం చంద్ర‌బాబు రాసిన లేఖ‌ను పార్టీ కార్యాల‌యం మీడియాకు విడుద‌ల చేసింది.

దీనిలో ఆయ‌న ఓటు గురించి, గ‌త టీడీపీ పాల‌న గురించి సుదీర్ఘంగా వివ‌రించారు. 2014లో రాష్ట్ర విభ‌జ‌న తర్వాత అధికారం చేప‌ట్టిన టీడీపీ సుదీర్ఘ ల‌క్ష్యాలు పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు సాగిన‌ట్టు తెలిపారు.

అమ‌రావ‌తి రాజ‌ధాని స‌హా.. సాగునీటి ప్రాజెక్టులు.. సంక్షేమానికి పెద్ద‌పీట వేశామ‌న్నారు. 100కు పైగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశామ‌ని పేర్కొన్నారు.

2019లోనూ అధికారంలోకి వ‌చ్చి ఉంటే.. దేశంలోనే ఏపీ అగ్ర‌స్థానంలో ఉండేద‌ని చంద్ర‌బాబు తెలిపారు. కానీ, అబ‌ద్ధాలు, దుర్మా ర్గాలు, క‌ట్టుక‌థ‌లు, మోసాల‌తో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని విమ‌ర్శించారు.

ప్ర‌జ‌లు త‌మ సంక్షేమం కోసం వైసీపీకి అధికారం అప్ప‌గిస్తే.. వైసీపీ నాయ‌కులు భ‌స్మాసురులుగా మారి రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశారని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ల్యాండ్‌, శ్యాండ్‌, మైనింగ్‌, లిక్క‌ర్ మాఫియాల‌తో రాష్ట్రాన్ని దోచుకున్నార‌ని తెలిపారు. వ్య‌వ‌స్థ‌ల‌ను చెర‌బ‌ట్టి ప్ర‌శ్నించేవారిని.. జైలు పాలు చేస్తు న్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను కూడా అణ‌గ‌దొక్కార‌ని పేర్కొన్నారు.

ఈ నెల 13న జ‌రిగేఎన్నిక‌ల్లో వైసీపీ భ‌స్మాసురుల‌ను అంతం చేసేందుకు ఓటుతో వేటు వేయాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. క‌బ్జాల‌కు, బాదుడుకు, అరాచ‌కాల‌కు ముగింపు ప‌లికేలా ఈ నెల 13న జ‌రిగే పోలింగ్ లో ఓటేయాల‌ని సూచించారు.

సంక్షేమం, అభివృద్ధి, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ హామీల‌తో ప్ర‌జల ముందుకు వ‌చ్చిన కూట‌మిని గెలిపించాల‌ని చంద్ర‌బాబు విన్న‌వించారు.

రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాల‌నే విష‌యంపై కూట‌మి ద‌గ్గ‌ర స్ప‌ష్ట‌మైన విజ‌న్ ఉంద‌ని తెలిపారు. అందుకే క‌ట‌మి అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. నిర్భ‌యంగా, నిజాయితీగా ఓటేయాల‌ని సూచించారు.

This post was last modified on May 11, 2024 10:12 pm

Share

Recent Posts

జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే

జగన్ ఇటీవ‌ల కాలంలో స‌హ‌నం కోల్పోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న పార్టీ వారిపై కేసులు పెట్టినా.. త‌మ…

6 hours ago

అంజికి ఒడిస్సికి కనెక్షన్ ఏంటి

అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…

6 hours ago

బుట్టబొమ్మకు ఏ ప్రయోజనం లేదు

బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…

7 hours ago

ఏడున్న‌ర గంట‌ల‌పాటు నిల‌బ‌డిన లోకేష్‌

ఒక గంట నిల‌బ‌డేందుకే ఇబ్బంది ప‌డ‌తాం. అలాంటిది ఏకంగా ఏడున్న‌ర‌గంట‌ల పాటు ఏక‌బిగిన నిల‌బ‌డ‌డం అంటే మాట‌లా? ఊహించేందుకే క‌ష్ట‌మైన…

7 hours ago

కనకవర్షం కురవాల్సిందే కనకరాజూ

కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…

8 hours ago

అంబటి నోటి దురుసు తగ్గేలా లేదు

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…

9 hours ago