Political News

మీ శ్రేయోభిలాషి.. ఏపీ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు లేఖ‌..!

“మీ శ్రేయోభిలాషి..” అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన మ‌రుక్ష‌ణం చంద్ర‌బాబు రాసిన లేఖ‌ను పార్టీ కార్యాల‌యం మీడియాకు విడుద‌ల చేసింది.

దీనిలో ఆయ‌న ఓటు గురించి, గ‌త టీడీపీ పాల‌న గురించి సుదీర్ఘంగా వివ‌రించారు. 2014లో రాష్ట్ర విభ‌జ‌న తర్వాత అధికారం చేప‌ట్టిన టీడీపీ సుదీర్ఘ ల‌క్ష్యాలు పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు సాగిన‌ట్టు తెలిపారు.

అమ‌రావ‌తి రాజ‌ధాని స‌హా.. సాగునీటి ప్రాజెక్టులు.. సంక్షేమానికి పెద్ద‌పీట వేశామ‌న్నారు. 100కు పైగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశామ‌ని పేర్కొన్నారు.

2019లోనూ అధికారంలోకి వ‌చ్చి ఉంటే.. దేశంలోనే ఏపీ అగ్ర‌స్థానంలో ఉండేద‌ని చంద్ర‌బాబు తెలిపారు. కానీ, అబ‌ద్ధాలు, దుర్మా ర్గాలు, క‌ట్టుక‌థ‌లు, మోసాల‌తో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని విమ‌ర్శించారు.

ప్ర‌జ‌లు త‌మ సంక్షేమం కోసం వైసీపీకి అధికారం అప్ప‌గిస్తే.. వైసీపీ నాయ‌కులు భ‌స్మాసురులుగా మారి రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశారని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ల్యాండ్‌, శ్యాండ్‌, మైనింగ్‌, లిక్క‌ర్ మాఫియాల‌తో రాష్ట్రాన్ని దోచుకున్నార‌ని తెలిపారు. వ్య‌వ‌స్థ‌ల‌ను చెర‌బ‌ట్టి ప్ర‌శ్నించేవారిని.. జైలు పాలు చేస్తు న్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను కూడా అణ‌గ‌దొక్కార‌ని పేర్కొన్నారు.

ఈ నెల 13న జ‌రిగేఎన్నిక‌ల్లో వైసీపీ భ‌స్మాసురుల‌ను అంతం చేసేందుకు ఓటుతో వేటు వేయాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. క‌బ్జాల‌కు, బాదుడుకు, అరాచ‌కాల‌కు ముగింపు ప‌లికేలా ఈ నెల 13న జ‌రిగే పోలింగ్ లో ఓటేయాల‌ని సూచించారు.

సంక్షేమం, అభివృద్ధి, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ హామీల‌తో ప్ర‌జల ముందుకు వ‌చ్చిన కూట‌మిని గెలిపించాల‌ని చంద్ర‌బాబు విన్న‌వించారు.

రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాల‌నే విష‌యంపై కూట‌మి ద‌గ్గ‌ర స్ప‌ష్ట‌మైన విజ‌న్ ఉంద‌ని తెలిపారు. అందుకే క‌ట‌మి అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. నిర్భ‌యంగా, నిజాయితీగా ఓటేయాల‌ని సూచించారు.

This post was last modified on May 11, 2024 10:12 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

2 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

3 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

6 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago