“మీ శ్రేయోభిలాషి..” అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం చంద్రబాబు రాసిన లేఖను పార్టీ కార్యాలయం మీడియాకు విడుదల చేసింది.
దీనిలో ఆయన ఓటు గురించి, గత టీడీపీ పాలన గురించి సుదీర్ఘంగా వివరించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన టీడీపీ సుదీర్ఘ లక్ష్యాలు పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు సాగినట్టు తెలిపారు.
అమరావతి రాజధాని సహా.. సాగునీటి ప్రాజెక్టులు.. సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. 100కు పైగా సంక్షేమ పథకాలను అమలు చేశామని పేర్కొన్నారు.
2019లోనూ అధికారంలోకి వచ్చి ఉంటే.. దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండేదని చంద్రబాబు తెలిపారు. కానీ, అబద్ధాలు, దుర్మా ర్గాలు, కట్టుకథలు, మోసాలతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
ప్రజలు తమ సంక్షేమం కోసం వైసీపీకి అధికారం అప్పగిస్తే.. వైసీపీ నాయకులు భస్మాసురులుగా మారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.
ల్యాండ్, శ్యాండ్, మైనింగ్, లిక్కర్ మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని తెలిపారు. వ్యవస్థలను చెరబట్టి ప్రశ్నించేవారిని.. జైలు పాలు చేస్తు న్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను కూడా అణగదొక్కారని పేర్కొన్నారు.
ఈ నెల 13న జరిగేఎన్నికల్లో వైసీపీ భస్మాసురులను అంతం చేసేందుకు ఓటుతో వేటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కబ్జాలకు, బాదుడుకు, అరాచకాలకు ముగింపు పలికేలా ఈ నెల 13న జరిగే పోలింగ్ లో ఓటేయాలని సూచించారు.
సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ హామీలతో ప్రజల ముందుకు వచ్చిన కూటమిని గెలిపించాలని చంద్రబాబు విన్నవించారు.
రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయంపై కూటమి దగ్గర స్పష్టమైన విజన్ ఉందని తెలిపారు. అందుకే కటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిర్భయంగా, నిజాయితీగా ఓటేయాలని సూచించారు.
This post was last modified on May 11, 2024 10:12 pm
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…