“మీ శ్రేయోభిలాషి..” అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం చంద్రబాబు రాసిన లేఖను పార్టీ కార్యాలయం మీడియాకు విడుదల చేసింది.
దీనిలో ఆయన ఓటు గురించి, గత టీడీపీ పాలన గురించి సుదీర్ఘంగా వివరించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన టీడీపీ సుదీర్ఘ లక్ష్యాలు పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు సాగినట్టు తెలిపారు.
అమరావతి రాజధాని సహా.. సాగునీటి ప్రాజెక్టులు.. సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. 100కు పైగా సంక్షేమ పథకాలను అమలు చేశామని పేర్కొన్నారు.
2019లోనూ అధికారంలోకి వచ్చి ఉంటే.. దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండేదని చంద్రబాబు తెలిపారు. కానీ, అబద్ధాలు, దుర్మా ర్గాలు, కట్టుకథలు, మోసాలతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
ప్రజలు తమ సంక్షేమం కోసం వైసీపీకి అధికారం అప్పగిస్తే.. వైసీపీ నాయకులు భస్మాసురులుగా మారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.
ల్యాండ్, శ్యాండ్, మైనింగ్, లిక్కర్ మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని తెలిపారు. వ్యవస్థలను చెరబట్టి ప్రశ్నించేవారిని.. జైలు పాలు చేస్తు న్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను కూడా అణగదొక్కారని పేర్కొన్నారు.
ఈ నెల 13న జరిగేఎన్నికల్లో వైసీపీ భస్మాసురులను అంతం చేసేందుకు ఓటుతో వేటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కబ్జాలకు, బాదుడుకు, అరాచకాలకు ముగింపు పలికేలా ఈ నెల 13న జరిగే పోలింగ్ లో ఓటేయాలని సూచించారు.
సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ హామీలతో ప్రజల ముందుకు వచ్చిన కూటమిని గెలిపించాలని చంద్రబాబు విన్నవించారు.
రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయంపై కూటమి దగ్గర స్పష్టమైన విజన్ ఉందని తెలిపారు. అందుకే కటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిర్భయంగా, నిజాయితీగా ఓటేయాలని సూచించారు.
This post was last modified on May 11, 2024 10:12 pm
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…
అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…
ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…
యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…