Political News

మీ శ్రేయోభిలాషి.. ఏపీ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు లేఖ‌..!

“మీ శ్రేయోభిలాషి..” అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన మ‌రుక్ష‌ణం చంద్ర‌బాబు రాసిన లేఖ‌ను పార్టీ కార్యాల‌యం మీడియాకు విడుద‌ల చేసింది.

దీనిలో ఆయ‌న ఓటు గురించి, గ‌త టీడీపీ పాల‌న గురించి సుదీర్ఘంగా వివ‌రించారు. 2014లో రాష్ట్ర విభ‌జ‌న తర్వాత అధికారం చేప‌ట్టిన టీడీపీ సుదీర్ఘ ల‌క్ష్యాలు పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు సాగిన‌ట్టు తెలిపారు.

అమ‌రావ‌తి రాజ‌ధాని స‌హా.. సాగునీటి ప్రాజెక్టులు.. సంక్షేమానికి పెద్ద‌పీట వేశామ‌న్నారు. 100కు పైగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశామ‌ని పేర్కొన్నారు.

2019లోనూ అధికారంలోకి వ‌చ్చి ఉంటే.. దేశంలోనే ఏపీ అగ్ర‌స్థానంలో ఉండేద‌ని చంద్ర‌బాబు తెలిపారు. కానీ, అబ‌ద్ధాలు, దుర్మా ర్గాలు, క‌ట్టుక‌థ‌లు, మోసాల‌తో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని విమ‌ర్శించారు.

ప్ర‌జ‌లు త‌మ సంక్షేమం కోసం వైసీపీకి అధికారం అప్ప‌గిస్తే.. వైసీపీ నాయ‌కులు భ‌స్మాసురులుగా మారి రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశారని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ల్యాండ్‌, శ్యాండ్‌, మైనింగ్‌, లిక్క‌ర్ మాఫియాల‌తో రాష్ట్రాన్ని దోచుకున్నార‌ని తెలిపారు. వ్య‌వ‌స్థ‌ల‌ను చెర‌బ‌ట్టి ప్ర‌శ్నించేవారిని.. జైలు పాలు చేస్తు న్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను కూడా అణ‌గ‌దొక్కార‌ని పేర్కొన్నారు.

ఈ నెల 13న జ‌రిగేఎన్నిక‌ల్లో వైసీపీ భ‌స్మాసురుల‌ను అంతం చేసేందుకు ఓటుతో వేటు వేయాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. క‌బ్జాల‌కు, బాదుడుకు, అరాచ‌కాల‌కు ముగింపు ప‌లికేలా ఈ నెల 13న జ‌రిగే పోలింగ్ లో ఓటేయాల‌ని సూచించారు.

సంక్షేమం, అభివృద్ధి, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ హామీల‌తో ప్ర‌జల ముందుకు వ‌చ్చిన కూట‌మిని గెలిపించాల‌ని చంద్ర‌బాబు విన్న‌వించారు.

రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాల‌నే విష‌యంపై కూట‌మి ద‌గ్గ‌ర స్ప‌ష్ట‌మైన విజ‌న్ ఉంద‌ని తెలిపారు. అందుకే క‌ట‌మి అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. నిర్భ‌యంగా, నిజాయితీగా ఓటేయాల‌ని సూచించారు.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

2 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

2 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

3 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

4 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

4 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

4 hours ago