Political News

మీ శ్రేయోభిలాషి.. ఏపీ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు లేఖ‌..!

“మీ శ్రేయోభిలాషి..” అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన మ‌రుక్ష‌ణం చంద్ర‌బాబు రాసిన లేఖ‌ను పార్టీ కార్యాల‌యం మీడియాకు విడుద‌ల చేసింది.

దీనిలో ఆయ‌న ఓటు గురించి, గ‌త టీడీపీ పాల‌న గురించి సుదీర్ఘంగా వివ‌రించారు. 2014లో రాష్ట్ర విభ‌జ‌న తర్వాత అధికారం చేప‌ట్టిన టీడీపీ సుదీర్ఘ ల‌క్ష్యాలు పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు సాగిన‌ట్టు తెలిపారు.

అమ‌రావ‌తి రాజ‌ధాని స‌హా.. సాగునీటి ప్రాజెక్టులు.. సంక్షేమానికి పెద్ద‌పీట వేశామ‌న్నారు. 100కు పైగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశామ‌ని పేర్కొన్నారు.

2019లోనూ అధికారంలోకి వ‌చ్చి ఉంటే.. దేశంలోనే ఏపీ అగ్ర‌స్థానంలో ఉండేద‌ని చంద్ర‌బాబు తెలిపారు. కానీ, అబ‌ద్ధాలు, దుర్మా ర్గాలు, క‌ట్టుక‌థ‌లు, మోసాల‌తో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని విమ‌ర్శించారు.

ప్ర‌జ‌లు త‌మ సంక్షేమం కోసం వైసీపీకి అధికారం అప్ప‌గిస్తే.. వైసీపీ నాయ‌కులు భ‌స్మాసురులుగా మారి రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశారని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ల్యాండ్‌, శ్యాండ్‌, మైనింగ్‌, లిక్క‌ర్ మాఫియాల‌తో రాష్ట్రాన్ని దోచుకున్నార‌ని తెలిపారు. వ్య‌వ‌స్థ‌ల‌ను చెర‌బ‌ట్టి ప్ర‌శ్నించేవారిని.. జైలు పాలు చేస్తు న్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను కూడా అణ‌గ‌దొక్కార‌ని పేర్కొన్నారు.

ఈ నెల 13న జ‌రిగేఎన్నిక‌ల్లో వైసీపీ భ‌స్మాసురుల‌ను అంతం చేసేందుకు ఓటుతో వేటు వేయాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. క‌బ్జాల‌కు, బాదుడుకు, అరాచ‌కాల‌కు ముగింపు ప‌లికేలా ఈ నెల 13న జ‌రిగే పోలింగ్ లో ఓటేయాల‌ని సూచించారు.

సంక్షేమం, అభివృద్ధి, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ హామీల‌తో ప్ర‌జల ముందుకు వ‌చ్చిన కూట‌మిని గెలిపించాల‌ని చంద్ర‌బాబు విన్న‌వించారు.

రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాల‌నే విష‌యంపై కూట‌మి ద‌గ్గ‌ర స్ప‌ష్ట‌మైన విజ‌న్ ఉంద‌ని తెలిపారు. అందుకే క‌ట‌మి అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. నిర్భ‌యంగా, నిజాయితీగా ఓటేయాల‌ని సూచించారు.

This post was last modified on May 11, 2024 10:12 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

55 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago