“మీ శ్రేయోభిలాషి..” అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం చంద్రబాబు రాసిన లేఖను పార్టీ కార్యాలయం మీడియాకు విడుదల చేసింది.
దీనిలో ఆయన ఓటు గురించి, గత టీడీపీ పాలన గురించి సుదీర్ఘంగా వివరించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన టీడీపీ సుదీర్ఘ లక్ష్యాలు పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు సాగినట్టు తెలిపారు.
అమరావతి రాజధాని సహా.. సాగునీటి ప్రాజెక్టులు.. సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. 100కు పైగా సంక్షేమ పథకాలను అమలు చేశామని పేర్కొన్నారు.
2019లోనూ అధికారంలోకి వచ్చి ఉంటే.. దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండేదని చంద్రబాబు తెలిపారు. కానీ, అబద్ధాలు, దుర్మా ర్గాలు, కట్టుకథలు, మోసాలతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
ప్రజలు తమ సంక్షేమం కోసం వైసీపీకి అధికారం అప్పగిస్తే.. వైసీపీ నాయకులు భస్మాసురులుగా మారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.
ల్యాండ్, శ్యాండ్, మైనింగ్, లిక్కర్ మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని తెలిపారు. వ్యవస్థలను చెరబట్టి ప్రశ్నించేవారిని.. జైలు పాలు చేస్తు న్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను కూడా అణగదొక్కారని పేర్కొన్నారు.
ఈ నెల 13న జరిగేఎన్నికల్లో వైసీపీ భస్మాసురులను అంతం చేసేందుకు ఓటుతో వేటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కబ్జాలకు, బాదుడుకు, అరాచకాలకు ముగింపు పలికేలా ఈ నెల 13న జరిగే పోలింగ్ లో ఓటేయాలని సూచించారు.
సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ హామీలతో ప్రజల ముందుకు వచ్చిన కూటమిని గెలిపించాలని చంద్రబాబు విన్నవించారు.
రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయంపై కూటమి దగ్గర స్పష్టమైన విజన్ ఉందని తెలిపారు. అందుకే కటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిర్భయంగా, నిజాయితీగా ఓటేయాలని సూచించారు.
This post was last modified on May 11, 2024 10:12 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…