ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీ తట్టాబుట్ట సర్దుకోవాల్సిందేనా? ఇక్కడ టీడీపీ మెజారిటీ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమేనా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
విశాఖపట్నంలో టీడీపీదే ఆధిపత్యం అని అంటున్నారు. విశాఖలో టీడీపీ విజయ కేక పెడుతుందని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 11 గెలుచుకుంది. కానీ ఈ సారి రెండు మూడు స్థానాల కంటే ఎక్కువగా ఆ పార్టీ గెలవడం కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
విశాఖను రాజధాని చేస్తామని జగన్ ప్రకటించినా ఇక్కడి ప్రజల్లో వైసీపీపై సానుకూలత కనిపించడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే రుషికొండను ధ్వంసం చేయడం, బీచ్పై ఆధిపత్యం, సహజ వనరుల విధ్వంసం తదితర కారణలతో జగన్పై విశాఖ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఈ సారి 15 స్థానాలకు గాను 10కి పైగా స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
విశాఖ రూరల్ జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను గత ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది. కానీ ఈ సారి ఈ స్థానాల్లో వైసీపీని దాటి కూటమి అభ్యర్థులు ముందంజలో సాగుతున్నారనే టాక్ ఉంది. ఏజెన్సీలోని రెండు స్థానాల్లోనూ కూటమికే మొగ్గు ఉందని చెబుతున్నారు.
ఇక విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమలో కూటమికి తిరుగులేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నర్సీపట్నం, భీమునిపట్నంలోనూ వైసీపీకి ఓట్లు పడవనిదే స్పష్టమవుతోందని చెబుతున్నారు. మొత్తానికి మళ్లీ అధికారంలోకి వచ్చి విశాఖ రాజధానిగా అక్కడి వెళ్లి ఉంటానని అనుకున్న జగన్ ఆశలు మాత్రం తీరేలా లేవన్నది ఇక్కడ జనాల మాట.
This post was last modified on May 11, 2024 2:20 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…