ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీ తట్టాబుట్ట సర్దుకోవాల్సిందేనా? ఇక్కడ టీడీపీ మెజారిటీ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమేనా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
విశాఖపట్నంలో టీడీపీదే ఆధిపత్యం అని అంటున్నారు. విశాఖలో టీడీపీ విజయ కేక పెడుతుందని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 11 గెలుచుకుంది. కానీ ఈ సారి రెండు మూడు స్థానాల కంటే ఎక్కువగా ఆ పార్టీ గెలవడం కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
విశాఖను రాజధాని చేస్తామని జగన్ ప్రకటించినా ఇక్కడి ప్రజల్లో వైసీపీపై సానుకూలత కనిపించడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే రుషికొండను ధ్వంసం చేయడం, బీచ్పై ఆధిపత్యం, సహజ వనరుల విధ్వంసం తదితర కారణలతో జగన్పై విశాఖ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఈ సారి 15 స్థానాలకు గాను 10కి పైగా స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
విశాఖ రూరల్ జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను గత ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది. కానీ ఈ సారి ఈ స్థానాల్లో వైసీపీని దాటి కూటమి అభ్యర్థులు ముందంజలో సాగుతున్నారనే టాక్ ఉంది. ఏజెన్సీలోని రెండు స్థానాల్లోనూ కూటమికే మొగ్గు ఉందని చెబుతున్నారు.
ఇక విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమలో కూటమికి తిరుగులేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నర్సీపట్నం, భీమునిపట్నంలోనూ వైసీపీకి ఓట్లు పడవనిదే స్పష్టమవుతోందని చెబుతున్నారు. మొత్తానికి మళ్లీ అధికారంలోకి వచ్చి విశాఖ రాజధానిగా అక్కడి వెళ్లి ఉంటానని అనుకున్న జగన్ ఆశలు మాత్రం తీరేలా లేవన్నది ఇక్కడ జనాల మాట.
This post was last modified on May 11, 2024 2:20 pm
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…
జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత…