ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీ తట్టాబుట్ట సర్దుకోవాల్సిందేనా? ఇక్కడ టీడీపీ మెజారిటీ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమేనా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
విశాఖపట్నంలో టీడీపీదే ఆధిపత్యం అని అంటున్నారు. విశాఖలో టీడీపీ విజయ కేక పెడుతుందని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 11 గెలుచుకుంది. కానీ ఈ సారి రెండు మూడు స్థానాల కంటే ఎక్కువగా ఆ పార్టీ గెలవడం కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
విశాఖను రాజధాని చేస్తామని జగన్ ప్రకటించినా ఇక్కడి ప్రజల్లో వైసీపీపై సానుకూలత కనిపించడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే రుషికొండను ధ్వంసం చేయడం, బీచ్పై ఆధిపత్యం, సహజ వనరుల విధ్వంసం తదితర కారణలతో జగన్పై విశాఖ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఈ సారి 15 స్థానాలకు గాను 10కి పైగా స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
విశాఖ రూరల్ జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను గత ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది. కానీ ఈ సారి ఈ స్థానాల్లో వైసీపీని దాటి కూటమి అభ్యర్థులు ముందంజలో సాగుతున్నారనే టాక్ ఉంది. ఏజెన్సీలోని రెండు స్థానాల్లోనూ కూటమికే మొగ్గు ఉందని చెబుతున్నారు.
ఇక విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమలో కూటమికి తిరుగులేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నర్సీపట్నం, భీమునిపట్నంలోనూ వైసీపీకి ఓట్లు పడవనిదే స్పష్టమవుతోందని చెబుతున్నారు. మొత్తానికి మళ్లీ అధికారంలోకి వచ్చి విశాఖ రాజధానిగా అక్కడి వెళ్లి ఉంటానని అనుకున్న జగన్ ఆశలు మాత్రం తీరేలా లేవన్నది ఇక్కడ జనాల మాట.
This post was last modified on May 11, 2024 2:20 pm
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…