Political News

విశాఖ‌లో కూట‌మి విజ‌య కేక‌!

ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లాలో వైసీపీ త‌ట్టాబుట్ట స‌ర్దుకోవాల్సిందేనా? ఇక్క‌డ టీడీపీ మెజారిటీ అసెంబ్లీ స్థానాల‌ను కైవ‌సం చేసుకోవ‌డం ఖాయ‌మేనా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి.

విశాఖ‌ప‌ట్నంలో టీడీపీదే ఆధిప‌త్యం అని అంటున్నారు. విశాఖ‌లో టీడీపీ విజ‌య కేక పెడుతుంద‌ని చెబుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాల‌కు గాను వైసీపీ 11 గెలుచుకుంది. కానీ ఈ సారి రెండు మూడు స్థానాల కంటే ఎక్కువగా ఆ పార్టీ గెల‌వ‌డం క‌ష్ట‌మేన‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

విశాఖ‌ను రాజ‌ధాని చేస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించినా ఇక్క‌డి ప్ర‌జ‌ల్లో వైసీపీపై సానుకూల‌త క‌నిపించ‌డం లేద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే రుషికొండ‌ను ధ్వంసం చేయ‌డం, బీచ్‌పై ఆధిప‌త్యం, స‌హ‌జ వ‌న‌రుల విధ్వంసం త‌దిత‌ర కార‌ణ‌ల‌తో జ‌గ‌న్‌పై విశాఖ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు తెలిసింది.

ఈ నేప‌థ్యంలో ఈ సారి 15 స్థానాల‌కు గాను 10కి పైగా స్థానాల్లో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి జెండా ఎగ‌ర‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

విశాఖ రూర‌ల్ జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ స్వీప్ చేసింది. కానీ ఈ సారి ఈ స్థానాల్లో వైసీపీని దాటి కూట‌మి అభ్య‌ర్థులు ముందంజ‌లో సాగుతున్నారనే టాక్ ఉంది. ఏజెన్సీలోని రెండు స్థానాల్లోనూ కూట‌మికే మొగ్గు ఉంద‌ని చెబుతున్నారు.

ఇక విశాఖ తూర్పు, విశాఖ ప‌శ్చిమ‌లో కూట‌మికి తిరుగులేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. న‌ర్సీప‌ట్నం, భీమునిప‌ట్నంలోనూ వైసీపీకి ఓట్లు ప‌డ‌వ‌నిదే స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని చెబుతున్నారు. మొత్తానికి మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చి విశాఖ రాజ‌ధానిగా అక్క‌డి వెళ్లి ఉంటాన‌ని అనుకున్న జ‌గ‌న్ ఆశ‌లు మాత్రం తీరేలా లేవ‌న్న‌ది ఇక్క‌డ జ‌నాల మాట.

This post was last modified on May 11, 2024 2:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

2 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

3 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

4 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

6 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago