Political News

ష‌ర్మిల‌ను జ‌గ‌నే దూరం చేసుకున్నారు.. : బ్ర‌ద‌ర్ అనిల్

సీఎం జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి ష‌ర్మిల.. ఎన్నిక‌ల ప్ర‌చారాల్లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ.. హీటెక్కించిన విష‌యం తెలిసిందే. అన్న‌ను టార్గెట్ చేస్తూ.. గ‌డిచిన నెల రోజుల‌కు పైగానే ఆమె తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ష‌ర్మిల భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌.. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ష‌ర్మిల‌ను జ‌గ‌నే దూరం చేసుకున్నార‌ని.. రాజ‌కీయంగా ఆమె సేవ‌లు వినియోగించుకుని.. దూరం పెట్టార‌ని చెప్పారు. అయినా.. ష‌ర్మిల ఎప్పుడూ బాధ‌ప‌డ‌లేద‌న్నారు. కానీ, ప్ర‌శాంత్ కిశోర్ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత‌.. త‌న ఆలోచ‌న‌ను మార్చుకున్న‌ట్టు చెప్పారు.

“ష‌ర్మిల‌కు సొంత‌గా పార్టీ పెట్టాల‌న్న ఆలోచ‌న లేదు. కానీ, ప్ర‌శాంత్ కిశోర్.. ప‌దేప‌దే రావ‌డం.. ఆమెకు గైడ్ చేయ‌డంతోనే పార్టీ పెట్టారు” అని బ్ర‌ద‌ర్ అనిల్ చెప్పారు. సీఎం జ‌గ‌న్ అంటే.. ష‌ర్మిల‌కు అభిమాన‌మేన‌ని చెప్పారు. సీఎంగా చూడాల‌ని త‌పించా ‌ని.. అందుకే ఆయ‌న జైల్లో ఉన్న‌ప్పుడు పార్టీ ని ముందుండి న‌డిపించార‌ని తెలిపారు. కానీ, జ‌గ‌న్‌.. ష‌ర్మిల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డంతో ఆమె బెంగ‌ళూరులోనే ఉండిపోయార‌ని చెప్పారు. ఈ స‌మ‌యంలో ప్ర‌శాంత్ కిశోర్ వ‌చ్చి పార్టీ పెట్ట‌మ‌న్న‌ప్పుడు కూడా.. జ‌గ‌న్ అభిప్రాయం తీసుకోవాల‌ని చెప్పారన్నారు. పార్టీ పెట్టేందుకు జ‌గ‌న్ ఒప్పుకోలేద‌ని తెలిసి.. మౌనంగా ఉండిపోయార‌ని తెలిపారు.

కానీ, ప్ర‌శాంత్ కిశోర్ మాత్రం ష‌ర్మిల‌ను ఒత్తిడి చేసి.. తెలంగాణ ప్ర‌జ‌లు ఆమెను కోరుకుంటున్న‌ట్టు చెప్పార‌న్నారు. జ‌గ‌న్ కూడా.. తెలంగాణ‌లో ష‌ర్మిల రాజ‌కీయాలు చేస్తే బాగుంటుంద‌ని గ‌తంలో చెప్పిన నేప‌థ్యంలో ఏపీకి కాకుండా.. తెలంగాణ‌కు షిఫ్ట్ అయ్యా రని బ్ర‌డ‌ర్‌ తెలిపారు. కేసీఆర్ ఓట‌మిని కాంక్షించే తెలంగాణలో పార్టీ పోటీ చేయ‌లేద‌న్నారు. తాను ఎప్పుడూ ష‌ర్మిల రాజ‌కీయా ల్లో జోక్యం చేసుకోలేద‌ని అనిల్ కుమార్ వెల్ల‌డించారు. త‌న పోరాటం త‌నే చేసుకుంద‌న్నారు. రాజ‌కీయాల్లో ష‌ర్మిల‌కు స‌క్సెస్ వ‌స్తుంద‌నే ఆశ త‌న‌కు ఉంద‌న్నారు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు పోరాటాల‌తోనే తాను గ‌డుపుతున్నార‌ని.. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లు కూడా గుర్తించార‌ని తెలిపారు. భ‌విష్య‌త్తులో ష‌ర్మిల‌కు అవ‌కాశాలు వ‌స్తాయ‌న్నారు. తెలంగాణ‌లో ఆమె పెట్టిన‌ పార్టీలో చేరిన వారంతా ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేక‌పోయార‌ని బ్ర‌ద‌ర్ అనిల్ వెల్ల‌డించారు. త‌న వెంట న‌డిచిన వారిని వ‌దిలేశార‌న‌డం స‌రికాద‌న్నారు. అంద‌రికీ న్యాయం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానంతో ఆమె మాట్లాడార‌ని.. కానీ, కొంద‌రు తొంద‌ర‌ప‌డి ఆమెను విమ‌ర్శించార‌ని తెలిపారు. మంచి ఎప్పుడూ గెలుస్తుంద‌ని బ్ర‌ద‌ర్ చెప్పారు.

This post was last modified on May 10, 2024 10:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

1 hour ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

1 hour ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

3 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

5 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

5 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

6 hours ago