గన్నవరం నియోజకవర్గంలో చంద్రబాబు తాజాగా ఎన్నికల ప్రచారం చేశారు. అయితే.. ఆయన నియోజకవర్గంలోకి అడుగు పెట్టేసరికి.. భారీ ఎత్తున వర్షం ప్రారంభమైంది. అయితే.. వర్షానికి వెరవకుండానే ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వర్షానికి-కూటమి పార్టీలకు ముడిపెట్టి ఆయన ప్రసంగించడం గమనార్హం. “వరుణుడు చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడో. ఇది కూటమి విజయానికి సంకేతం. మాకు తిరుగు లేదు. మీకు ఎదురు లేదు. కూటమి అభ్యర్థులను గెలిపించండి” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పోలింగ్ ప్రక్రియ కేవలం టెక్నికల్ మాత్రమేనని చెప్పిన చంద్రబాబు.. ఇప్పటికే కూటమి అభ్యర్థుల గెలుపు ఖరారైందని చెప్పారు. గన్నవరం నుంచి కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావేనని మరో రెండు రోజుల్లో ‘కాబోయే’ అనే మాట కూడా వినిపించదని చెప్పారు. ఇక, మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న బాలశౌరి ఈ సారి రెండు లక్షల మెజారిటీతో విజయం దక్కించుకోవడం ఖాయమని చంద్రబాబు చెప్పారు. కూటమి పక్షానే ప్రజలు నిలబడ్డారని, దీనికి వరుణుడే ప్రత్యక్ష ఉదాహరణని తెలిపారు. ఇది శుభ సంకేతమని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
మే నెలలో గన్నవరంలో వర్షం పడుతోందంటే వరుణ దేవుడు కూడా కరుణించాడని, కూటమిని తనదైన శైలిలో ఆశీర్వదించా డని చంద్రబాబు చెప్పారు. “అనుమానమే లేదు… విజయం మనదే” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ విధ్వంస పాలన అంతం అవుతుందని, మరో రెండు రోజుల్లోనే పోలింగ్ ప్రక్రియ జరగనుందని.. రెండు ఓట్లూ కూటమికే వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గన్నవరం ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. పిల్ల సైకోగా అభివర్ణించారు.
“తాడేపల్లిలో ఒక సైకో ఉన్నాడు. గన్నవరంలో పిల్ల సైకో ఉన్నాడు. ఇక్కడ పిల్ల సైకో తిన్నింటి వాసాలే లెక్కబెట్టాడు. వీళ్లని తరమి కొట్టే అవకాశం మే 13న మీకు వచ్చింది. వదులుకోవద్దు. ఇప్పటివరకు నా మర్యాద, మంచితనాన్నే చూశారు. భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేయకపోతే చూడండి” అని చంద్రబాబు తేల్చి చెప్పారు. కాగా,శుక్రవారం చంద్రబాబు ఐదు సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార వేగాన్ని మరింత పెంచారు. మే 13న పోలింగ్ జరగనుంది.
This post was last modified on May 10, 2024 10:33 pm
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…