Political News

కరోనా వ్యాప్తికి టీడీపీ కుట్రలు

అక్కడ కేంద్రంలో.. పక్కన తెలంగాణలో కరోనా వ్యాప్తి దిశగా ప్రభుత్వాలు సైలెంటుగా తమ పని తాము చేసుకుపోతున్నాయి. కేంద్రంలో ప్రతిపక్షాలు కొంత మేర ప్రభుత్వానికి సహకారం అందిస్తుండగా.. తెలంగాణలో అపోజిషన్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా సైలెంటుగా ఉంటున్నాయి. ఈ రెండు చోట్లా ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల గురించి ఏమీ మాట్లాడట్లేదు. చాలా రాష్ట్రాల్లో కూడా ఈ కష్ట కాలంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుబడతాయి. ప్రభుత్వ పెద్దలేమో ప్రతిపక్షం మీద తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేస్తాయి. ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్నాయి.

తమ ప్రచార పిచ్చితో వైకాపా నాయకులే కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారంటూ తెలుగుదేశం, జనసేన ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు నిజమే అనిపించేలా అనేక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఐతే ఈ విషయంలో ఇప్పుడు ప్రభుత్వం ప్రతి దాడి మొదలుపెట్టింది.

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపై సంచలన ఆరోపణలు చేసింది. ఏపీలో కరోనాను వ్యాప్తి చేసేందుకు తెలుగుదేశం కార్యకర్తలు స్లీపర్ సెల్స్ లాగా పని చేస్తున్నారంటూ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆరోపించడం గమనార్హం. కరోనా వ్యాప్తికి టీడీపీ కుట్రలు చేసిందేమోనన్న అనుమానం వస్తోందని ఆయనన్నారు. కొత్త ప్రాంతాల్లో కరోనా వ్యాప్తికి కారణం టీడీపీనేని అనుమానించే పరిస్థితి ఉందని.. ఆ పార్టీ వాళ్లు ఇందుకోసం స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాజ్‌భవన్‌లో కరోనా వ్యాప్తికి చెన్నై నుంచి వచ్చిన కనగరాజే కారణం అనడం సమంజసమా అని మోపిదేవి ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గవర్నర్‌కు లేఖ రాయడం రాజకీయమేనని.. కిట్ల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉందని మోపిదేవి స్పష్టం చేశారు.

This post was last modified on April 27, 2020 5:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

45 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

3 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago