టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ నుంచి ఆయన పోటీ చేయడం ఇది రెండో సారి. గత ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ, ఇప్పుడు గెలిచి తీరాలనే కసితో ఉన్నారు. గత నాలుగేళ్లుగా నియోజకవర్గంతో అనుబంధం పెంచుకున్నారు. ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. పేదలను ఆదుకున్నారు. బండ్లు కొనిచ్చారు. చేనేతలకు హామీ కూడా ఇచ్చారు. ప్రత్యేకంగా మంగళగిరికి 20 హామీలు గుప్పించారు.
తాను ఎమ్మెల్యే అయ్యాక.. ఇవి నెరవేరుస్తానంటూ.. ఆయన ప్రజలను మచ్చిక చేసుకున్నారు. ఫలితంగా నారా లోకేష్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇక్కడ ఎవరిని పలకరించినా.. నారా లోకేష్ పేరు వినిపిస్తుండడం అతిశయోక్తి కాదు. నిజం. నారా లోకేష్ ఇచ్చిన భరోసా ఇక్కడ బాగానే వర్కవుట్ అవుతోంది. ఆయన ఇమేజ్ పెరిగిందనే చెప్పాలి. ప్రచారంలోనూ ఆయన వినూత్న పంథాను ఎంచుకున్నారు. సెక్టార్ల వారీగా నియోజకవర్గాన్ని విభజించారు.
దాని ప్రకారం.. ప్రచారాన్ని తీవ్ర తరం చేశారు. పేదలు, మధ్యతరగతి వారిని ఒక సెక్టార్గా చేసుకుని ఆది నుంచి వీరిపై కన్నేశారు. ఇక, రోడ్లపై వ్యాపారాలు చేసుకునే వారికి ప్రత్యేక సాయాలు చేశారు. అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేసి నిత్యం భోజనాలు పెడుతున్నారు. ఇక, ఎగుమ మధ్యతరగతి కుటుంబాలు ఉండే.. అపార్టమెంట్లలోనూ ఆయన ప్రచారం చేయడం గమనార్హం. గత రెండు వారాలు కూడా.. వరుస పెట్టి అపార్ట్మెంట్లలో ప్రచారాన్ని పెంచారు.
ఇక, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా.. ప్రచారంలో ముందుకు సాగారు. గతంలో మాదిరిగా ఎన్నికలకు నాలుగు రోజుల ముందు కాకుండా.. ఈ దఫా 20 రోజుల ముందే వచ్చి.. ఇక్కడ ఉన్నారు. కూలీల నుంచి కార్మికుల వరకు, మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతి వరకు కూడా.. పెద్ద ఎత్తున కలిశారు. తన భర్తను గెలిపించాలని కోరారు. మొత్తంగా చూస్తే.. మంగళగిరిలో వైసీపీని ఎదిరించి గెలవాలన్న కసి కనిపించింది. ఇదే టాక్ స్థానికంగా వినిపిస్తోంది. ఆయన గెలుపును రాసిపెట్టుకునే రీతిలో ఇక్కడ పరిస్థితి ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 11, 2024 6:05 pm
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…