ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కూటమికి ఓ ప్రధాన ఆయుధం దొరికింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయాన్నే పదే పదే ప్రస్తావిస్తూ వైసీపీని దెబ్బ కొడుతున్నారు. ఆ ఆయుధం పేరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎన్నికల ప్రచార చివరి దశలో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఈ చట్టంతో భూములన్నీ జగన్ చేతిలోకి వెళ్లిపోతాయని, జనాలకు హక్కు ఉండదని బాబు బలంగా వాదన వినిపిస్తున్నారు. ఈ విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.
ఇప్పుడు ఇతర హామీలు, మేనిఫెస్టో ఇలా ఇతర అంశాలన్నింటినీ పక్కనపెట్టి ప్రధానంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించే బాబు మాట్లాడుతున్నారు. ఎక్కడైనా అదే మ్యాటర్. భూములన్నింటినీ మింగేసేందుకు చట్టం పేరుతో జగన్ సిద్ధమయ్యారని బాబు ఆరోపిస్తున్నారు. ఇంటర్వ్యూల్లో, పత్రికల్లో ప్రకటనలో ఇదే ప్రధానంగా కనిపిస్తోంది. దీంతో జనాలు కూడా ఈ విషయంపై చర్చిస్తున్నారు. తమ భూములను ఎలా వదులుకుంటామని ప్రశ్నిస్తున్నారు. జగన్కు మద్దతు తెలిపేదే లేదంటూ తీర్మానిస్తున్నారు.
ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో నెగెటివ్ ఎఫెక్ట్ ఊహించని స్థాయిలో వైసీపీని కమ్మేస్తోంది. అందుకే కౌంటర్ ఇచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నా జగన్ తప్ప దీని గురించి వైసీపీలో మాట్లాడేవాళ్లే లేకుండా పోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూములకు రక్షణ కల్పిస్తామని జగన్ చెబుతున్నారు. ప్రజల భూములు వాళ్ల పేర్లతోనే ఉంటాయని వివరణ ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో జీరాక్స్ కాపీలు కాదు ఒరిజినల్ పేపర్సే ఇస్తున్నామని కూడా చెబుతున్నారు. కానీ మరే వైసీసీ నేత కూడా దీనిపై మాట్లాడటం లేదు. దీంతో జనాలకు క్లారిటీ రావడం లేదనే టాక్ ఉంది. జగన్ ఎంత చెప్పినా జనాలు వినడం లేదని అంటున్నారు.
This post was last modified on May 10, 2024 5:41 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…