Political News

జగన్ ఎందుకు పవన్ పెళ్లిళ్లపై మాట్లాడతాడంటే..

పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు.. ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత కోపం వస్తుందో తెలిసిందే. పవన్‌ను పేరు పెట్టి పిలవకుండా ‘దత్తపుత్రుడు’ అనడం.. తానుఎక్కడ మాట్లాడుతున్నది కూడా చూసుకోకుండా స్కూల్ పిల్లలున్న సభల్లోనూ ఆయన పెళ్లిళ్ల వ్యవహారం గురించి మాట్లాడ్డం.. కార్లను మార్చినట్లు ప్రతి ఐదేళ్లకోసారి పెళ్లాన్ని మారుస్తాడని కామెంట్లు చేయడం మామూలే.

తాజాగా జగన్ ఒక టీవీ ఛానెల్ ప్రతినిధికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ అంశం చర్చకు వచ్చింది. పవన్‌ను ప్రతిసారీ పేరు పెట్టకుండా దత్తపుత్రుడు అని ఎందుకు అంటారు.. ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి పెళ్లిళ్ల గురించి ఎందుకు మాట్లాడతారు అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. దీనికి జగన్ ఏమని బదులిచ్చాడంటే..

2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో పవన్ కళ్యాణ్ భాగమని.. ఆ తర్వాత ఐదేళ్ల పాటు చంద్రబాబు చేసిన పాలనలో కూడా అతను భాగమని.. అందుకే అతణ్ని తాను దత్తపుత్రుడు అంటానని జగన్ చెప్పారు.

ఇక పవన్ మీద చేసే వ్యక్తిగత కామెంట్ల గురించి మాట్లాడుతూ.. “రాజకీయాల్లో ఉన్నపుడు అందరికీ మనం కనిపిస్తాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు ఒక క్యారెక్టర్ ఉండాలి. ఒక రోల్ మోడల్‌గా, ఆదర్శవంతంగా ఉండాలి. నువ్వు ఐదేళ్లకొకసారి భార్యను మార్చి.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. ఈ రకంగా నువ్వంతట నువ్వే ఐదేళ్లకోసారి భార్యను మార్చే కార్యక్రమం చేస్తే నిన్ను రోల్ మోడల్‌గా తీసుకున్న వాళ్లు కూడా ఇదే మాదిరిగా చేస్తే వాళ్లూ చేయడం మొదలుపెడితే? ఒకసారి జరిగితే పొరపాటు.. రెండుసార్లు జరిగితే అది గ్రహపాటు.. మూడు, నాలుగుసార్లు జరిగితే అది అలవాటు” అని జగన్ వ్యాఖ్యానించారు.

This post was last modified on May 9, 2024 3:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

22 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago