పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు.. ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత కోపం వస్తుందో తెలిసిందే. పవన్ను పేరు పెట్టి పిలవకుండా ‘దత్తపుత్రుడు’ అనడం.. తానుఎక్కడ మాట్లాడుతున్నది కూడా చూసుకోకుండా స్కూల్ పిల్లలున్న సభల్లోనూ ఆయన పెళ్లిళ్ల వ్యవహారం గురించి మాట్లాడ్డం.. కార్లను మార్చినట్లు ప్రతి ఐదేళ్లకోసారి పెళ్లాన్ని మారుస్తాడని కామెంట్లు చేయడం మామూలే.
తాజాగా జగన్ ఒక టీవీ ఛానెల్ ప్రతినిధికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ అంశం చర్చకు వచ్చింది. పవన్ను ప్రతిసారీ పేరు పెట్టకుండా దత్తపుత్రుడు అని ఎందుకు అంటారు.. ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి పెళ్లిళ్ల గురించి ఎందుకు మాట్లాడతారు అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. దీనికి జగన్ ఏమని బదులిచ్చాడంటే..
2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో పవన్ కళ్యాణ్ భాగమని.. ఆ తర్వాత ఐదేళ్ల పాటు చంద్రబాబు చేసిన పాలనలో కూడా అతను భాగమని.. అందుకే అతణ్ని తాను దత్తపుత్రుడు అంటానని జగన్ చెప్పారు.
ఇక పవన్ మీద చేసే వ్యక్తిగత కామెంట్ల గురించి మాట్లాడుతూ.. “రాజకీయాల్లో ఉన్నపుడు అందరికీ మనం కనిపిస్తాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు ఒక క్యారెక్టర్ ఉండాలి. ఒక రోల్ మోడల్గా, ఆదర్శవంతంగా ఉండాలి. నువ్వు ఐదేళ్లకొకసారి భార్యను మార్చి.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. ఈ రకంగా నువ్వంతట నువ్వే ఐదేళ్లకోసారి భార్యను మార్చే కార్యక్రమం చేస్తే నిన్ను రోల్ మోడల్గా తీసుకున్న వాళ్లు కూడా ఇదే మాదిరిగా చేస్తే వాళ్లూ చేయడం మొదలుపెడితే? ఒకసారి జరిగితే పొరపాటు.. రెండుసార్లు జరిగితే అది గ్రహపాటు.. మూడు, నాలుగుసార్లు జరిగితే అది అలవాటు” అని జగన్ వ్యాఖ్యానించారు.
This post was last modified on May 9, 2024 3:06 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…