ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ సహా ఆసరా, చేయూత, విద్యా దీవెన పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన నగదును పోలింగ్కు ముం దు ఇచ్చేందుకు వీలు కాదని తేల్చి చెప్పింది. పోలింగ్ మరో నాలుగు రోజుల్లో జరగనుందని.. పోలింగ్ ముగిసిన తర్వాత.. ప్రజలకు ఆయా పథకాల నిధులను జమ చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర హైకోర్టుకు పేర్కొంది.
రాష్ట్రంలో పథకాలకు సంబంధించిన లబ్ది దారుల సొమ్మును జమ చేయాల్సి ఉందని.. అయితే.. ఎన్నిక ల సంఘం ఆయా నిధులను నిలిపివేయాలని ఆదేశించిందని.. ఈ నేపథ్యంలో ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ.. ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ సహా ఇతర పథకాలకు నిధులు విడుదల చేయాల్సి ఉందని తెలిపింది. ఆయా నిధులు విడుదల చేయకపోతే.. రైతులు, విద్యార్థులు నష్టపోతారని కూడా వివరించింది.
పైగా ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకాలేనని.. కొత్తగా తీసుకువచ్చినవికాదని కూడా ఏపీ ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగాకొత్తగా లబ్ధి దారులను కూడా చేర్చలేదని.. పాతవారికే ఈ పథకాలు అందిస్తున్నామని కాబట్టి.. నిధులు జమ చేసేందుకు అనుమతి ఇచ్చేలా ఈసీని ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థిం చింది. దీనిపై గత మూడు రోజలుగా విచారణ జరిగింది. తాజాగా గురువారం ఈసీ మరోసారి తన నిర్ణయా న్ని కోర్టుకు వెల్లడించింది.
ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ పీక్ స్టేజ్కు చేరుకుందని.. పోలింగ్ ముగిసిన తర్వాత.. జమ చేసుకుంటే అభ్యంతరం లేదని తెలిపింది. ముందుగానే జమ చేయడం ద్వారా.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన ట్టు అవుతుందని.. ఇది కోడ్కు కూడా విరుద్ధమని తెలిపింది. ఆయా నిధులకు సంబంధించి సీఎం జగన్ ఎప్పుడో బటన్ నొక్కారని.. కానీ, నిధులు జమ కాకుండా నిలువరించినట్టు స్పష్టమవుతోందని తెలిపింది. ఎన్నికలకు ముందు వీటిని విడుదల చేయాలన్న ఉద్దేశం ఉందని.. కాబట్టి.. పోలింగ్ ముగిసిప 13 వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి నిధులు జమ చేయొచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.
This post was last modified on May 9, 2024 2:58 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…