Political News

జ‌గ‌న్ అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌లేదు..వెయిట్ చేయాల‌న్న ఈసీ

ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎన్నిక‌ల సంఘం షాక్ ఇచ్చింది. రైతుల‌కు ఇన్ పుట్ స‌బ్సిడీ స‌హా ఆస‌రా, చేయూత‌, విద్యా దీవెన ప‌థ‌కాల‌కు సంబంధించి ల‌బ్ధిదారుల‌కు ఇవ్వాల్సిన న‌గ‌దును పోలింగ్‌కు ముం దు ఇచ్చేందుకు వీలు కాద‌ని తేల్చి చెప్పింది. పోలింగ్ మ‌రో నాలుగు రోజుల్లో జ‌ర‌గ‌నుంద‌ని.. పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల‌కు ఆయా ప‌థ‌కాల నిధుల‌ను జ‌మ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. రాష్ట్ర హైకోర్టుకు పేర్కొంది.

రాష్ట్రంలో ప‌థ‌కాల‌కు సంబంధించిన ల‌బ్ది దారుల సొమ్మును జ‌మ చేయాల్సి ఉంద‌ని.. అయితే.. ఎన్నిక ల సంఘం ఆయా నిధుల‌ను నిలిపివేయాల‌ని ఆదేశించింద‌ని.. ఈ నేప‌థ్యంలో ఆ ఆదేశాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. ఏపీ ప్ర‌భుత్వం హైకోర్టులో పిటిష‌న్ వేసింది. రైతుల‌కు ఇన్ పుట్ స‌బ్సిడీ స‌హా ఇత‌ర ప‌థ‌కాల‌కు నిధులు విడుద‌ల చేయాల్సి ఉంద‌ని తెలిపింది. ఆయా నిధులు విడుద‌ల చేయ‌క‌పోతే.. రైతులు, విద్యార్థులు న‌ష్ట‌పోతార‌ని కూడా వివ‌రించింది.

పైగా ఎప్ప‌టి నుంచో కొన‌సాగుతున్న ప‌థ‌కాలేన‌ని.. కొత్త‌గా తీసుకువ‌చ్చిన‌వికాద‌ని కూడా ఏపీ ప్ర‌భుత్వం తెలిపింది. అదేవిధంగాకొత్త‌గా ల‌బ్ధి దారుల‌ను కూడా చేర్చ‌లేద‌ని.. పాత‌వారికే ఈ ప‌థ‌కాలు అందిస్తున్నామ‌ని కాబ‌ట్టి.. నిధులు జ‌మ చేసేందుకు అనుమ‌తి ఇచ్చేలా ఈసీని ఆదేశించాల‌ని హైకోర్టును అభ్య‌ర్థిం చింది. దీనిపై గత మూడు రోజ‌లుగా విచార‌ణ జ‌రిగింది. తాజాగా గురువారం ఈసీ మ‌రోసారి త‌న నిర్ణ‌యా న్ని కోర్టుకు వెల్ల‌డించింది.

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్రక్రియ పీక్ స్టేజ్‌కు చేరుకుందని.. పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. జ‌మ చేసుకుంటే అభ్యంత‌రం లేద‌ని తెలిపింది. ముందుగానే జ‌మ చేయ‌డం ద్వారా.. ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసిన ట్టు అవుతుంద‌ని.. ఇది కోడ్‌కు కూడా విరుద్ధ‌మ‌ని తెలిపింది. ఆయా నిధుల‌కు సంబంధించి సీఎం జ‌గ‌న్‌ ఎప్పుడో బ‌ట‌న్ నొక్కార‌ని.. కానీ, నిధులు జ‌మ కాకుండా నిలువ‌రించిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని తెలిపింది. ఎన్నిక‌ల‌కు ముందు వీటిని విడుద‌ల చేయాల‌న్న ఉద్దేశం ఉంద‌ని.. కాబ‌ట్టి.. పోలింగ్ ముగిసిప 13 వ తేదీ సాయంత్రం 6 గంట‌ల నుంచి నిధులు జ‌మ చేయొచ్చ‌ని ఎన్నిక‌ల సంఘం పేర్కొంది.

This post was last modified on May 9, 2024 2:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎటెటో వెళ్తున్న జన నాయకుడు గొడవ

సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…

33 minutes ago

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

1 hour ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

1 hour ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

4 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

5 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

5 hours ago