Political News

జ‌గ‌న్ అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌లేదు..వెయిట్ చేయాల‌న్న ఈసీ

ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎన్నిక‌ల సంఘం షాక్ ఇచ్చింది. రైతుల‌కు ఇన్ పుట్ స‌బ్సిడీ స‌హా ఆస‌రా, చేయూత‌, విద్యా దీవెన ప‌థ‌కాల‌కు సంబంధించి ల‌బ్ధిదారుల‌కు ఇవ్వాల్సిన న‌గ‌దును పోలింగ్‌కు ముం దు ఇచ్చేందుకు వీలు కాద‌ని తేల్చి చెప్పింది. పోలింగ్ మ‌రో నాలుగు రోజుల్లో జ‌ర‌గ‌నుంద‌ని.. పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల‌కు ఆయా ప‌థ‌కాల నిధుల‌ను జ‌మ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. రాష్ట్ర హైకోర్టుకు పేర్కొంది.

రాష్ట్రంలో ప‌థ‌కాల‌కు సంబంధించిన ల‌బ్ది దారుల సొమ్మును జ‌మ చేయాల్సి ఉంద‌ని.. అయితే.. ఎన్నిక ల సంఘం ఆయా నిధుల‌ను నిలిపివేయాల‌ని ఆదేశించింద‌ని.. ఈ నేప‌థ్యంలో ఆ ఆదేశాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. ఏపీ ప్ర‌భుత్వం హైకోర్టులో పిటిష‌న్ వేసింది. రైతుల‌కు ఇన్ పుట్ స‌బ్సిడీ స‌హా ఇత‌ర ప‌థ‌కాల‌కు నిధులు విడుద‌ల చేయాల్సి ఉంద‌ని తెలిపింది. ఆయా నిధులు విడుద‌ల చేయ‌క‌పోతే.. రైతులు, విద్యార్థులు న‌ష్ట‌పోతార‌ని కూడా వివ‌రించింది.

పైగా ఎప్ప‌టి నుంచో కొన‌సాగుతున్న ప‌థ‌కాలేన‌ని.. కొత్త‌గా తీసుకువ‌చ్చిన‌వికాద‌ని కూడా ఏపీ ప్ర‌భుత్వం తెలిపింది. అదేవిధంగాకొత్త‌గా ల‌బ్ధి దారుల‌ను కూడా చేర్చ‌లేద‌ని.. పాత‌వారికే ఈ ప‌థ‌కాలు అందిస్తున్నామ‌ని కాబ‌ట్టి.. నిధులు జ‌మ చేసేందుకు అనుమ‌తి ఇచ్చేలా ఈసీని ఆదేశించాల‌ని హైకోర్టును అభ్య‌ర్థిం చింది. దీనిపై గత మూడు రోజ‌లుగా విచార‌ణ జ‌రిగింది. తాజాగా గురువారం ఈసీ మ‌రోసారి త‌న నిర్ణ‌యా న్ని కోర్టుకు వెల్ల‌డించింది.

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్రక్రియ పీక్ స్టేజ్‌కు చేరుకుందని.. పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. జ‌మ చేసుకుంటే అభ్యంత‌రం లేద‌ని తెలిపింది. ముందుగానే జ‌మ చేయ‌డం ద్వారా.. ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసిన ట్టు అవుతుంద‌ని.. ఇది కోడ్‌కు కూడా విరుద్ధ‌మ‌ని తెలిపింది. ఆయా నిధుల‌కు సంబంధించి సీఎం జ‌గ‌న్‌ ఎప్పుడో బ‌ట‌న్ నొక్కార‌ని.. కానీ, నిధులు జ‌మ కాకుండా నిలువ‌రించిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని తెలిపింది. ఎన్నిక‌ల‌కు ముందు వీటిని విడుద‌ల చేయాల‌న్న ఉద్దేశం ఉంద‌ని.. కాబ‌ట్టి.. పోలింగ్ ముగిసిప 13 వ తేదీ సాయంత్రం 6 గంట‌ల నుంచి నిధులు జ‌మ చేయొచ్చ‌ని ఎన్నిక‌ల సంఘం పేర్కొంది.

This post was last modified on May 9, 2024 2:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

44 minutes ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

1 hour ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

2 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

3 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

5 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

5 hours ago