Political News

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ) ఎత్తి వేసింది. ఇదే స‌మ‌యంలో ఆయ‌న‌ను స‌స్పెండ్ చేయ‌డాన్ని కూడా త‌ప్పుబ‌ట్టింది. ఒకే ర‌క‌మైన అభియోగాల‌పై రెండో సారి ఎలా స‌స్పెండ్ చేస్తార‌ని ప్ర‌శ్నించింది. త‌క్ష‌ణ‌మే ఈ స‌స్పెన్ష‌న్ను ఎత్తేసి.. ఆయ‌న వెంట‌నే పోస్టింగ్ ఇవ్వాల‌ని ఏపీ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. దీంతో గ‌త రెండేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న ఏబీ వెంక‌టేశ్వ‌రరావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కిన‌ట్టు అయింది. అంతేకాదు.. స‌స్పెన్ష‌న్ కాలంలో నిలిపివేసిజీత భ‌త్యాల‌ను కూడా తిరిగి చెల్లించాల‌ని ఆదేశించింది. ఇప్పుడు ఇచ్చిన ఆదేశాల‌తో ఆయ‌న‌కు ఎలాంటి పోస్టు ఇస్తార‌నేది అందరిలో ఆసక్తి నెలకొంది.

ఇదీ జరిగింది
వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఏబీ వెంక‌టేశ్వ‌రరావు అప్ప‌టి టీడీపీ హ‌యాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప‌నిచేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌మ వైసీపీ ఎమ్మెల్యేలు 23 మందిని టీడీపీలోకి వెళ్లేలా ప్రోత్స‌హించి.. ఒత్తిడి తెచ్చార‌నేది వైసీపీ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఇది రాజ‌కీయం కావ‌డంతో ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి వైసీపీ అధికారంలోకి రావ‌డంతోనే ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ఆయ‌న కుమారుడు విదేశీ కంపెనీతో టై అప్ పెట్టుకుని.. ఆయుధాల వ్యాపారం చేశార‌నేది వైసీపీ స‌ర్కారు ఆరోప‌ణ‌. దీనికి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు స‌హ‌క‌రించార‌ని పేర్కొంది. దీంతో కొన్నాళ్లు.. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేశారు.

దీనిపై క్యాట్‌ను, హైకోర్టును ఆశ్ర‌యించిన వెంక‌టేశ్వ‌రరావు 2022-23 మ‌ధ్య కాలంలో స‌స్పెన్ష‌న్ ఎత్తేసేలా చేసుకున్నారు. అనం త‌రం ప్ర‌భుత్వం ఆయ‌న‌కు పోస్టింగ్ ఇచ్చింది. ప్ర‌భుత్వం ప్రింటింగ్ అండ్ స్టేష‌న‌రీ విభాగం డీజీగా ఆయ‌న‌ను నియ‌మించింది. అయితే.. ఆయ‌న ఫీల్డ్‌లోకి వెళ్లి.. కొన్ని అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారంటూ.. ఆ త‌ర్వాత‌.. మూడు రోజుల్లోనే మ‌రోసారి స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. దీనిపై సుదీర్ఘం గా న్యాయ పోరాటం జ‌రిగింది. వాయిదాల‌పై వాయిదాలు ప‌డుతూనే ఉన్నాయి. చివ‌ర‌కు.. తాజాగా ఆయ‌న‌పై సస్పెన్ష‌న్ను ఎత్తేసింది. మొత్తంగా ఈ ఐదేళ్ల‌పాటు ఏబీ వెంక‌టేశ్వ‌రరావు న్యాయ పోరాటానికి.. స‌స్పెన్ష‌న్ల‌కే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

బాబోయ్.. డిటర్జెంట్‌ పొడితో 2.3 కోట్ల లీటర్ల పాలు తయారు?

 మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…

1 hour ago

ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ‘ది ఒడిస్సీ’

ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…

2 hours ago

‘ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ నోట్… సంతకం ఎక్కడ?’

ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల వ్య‌వ‌హారం ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి…

2 hours ago

అనుకూలమైన తీర్పు కోసం జడ్జి కుర్చీపైనే చేతబడి…!

న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…

3 hours ago

త్రివిక్రమ్ కోసం బ్రేస్‌లెట్ తాకట్టు

సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…

3 hours ago

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…

3 hours ago